Virat Kohli: న్యూయార్క్లో కోహ్లీ.. ప్రాక్టీస్ మ్యాచ్ డౌటే..!
టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ న్యూయార్క్ చేరుకున్నాడు. అయితే, శనివారం బంగ్లాతో వార్మప్ మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇంటర్నెట్డెస్క్: పొట్టి ప్రపంచకప్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. జూన్ 2 నుంచే ఈ సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ న్యూయార్క్ చేరుకున్నాడు. జట్టు సభ్యులంతా ఇప్పటికే అక్కడికి వెళ్లగా.. ఐదు రోజుల ఆలస్యంగా ‘కింగ్’ అక్కడికి వెళ్లాడు. టీమ్ఇండియా బస చేసిన హోటల్లోనే దిగాడు.
అయితే శనివారం బంగ్లాదేశ్తో జరగబోయే ప్రాక్టీస్ మ్యాచ్లో కోహ్లీ ఆడతాడా లేదా?అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 16 గంటలపాటు జర్నీ చేసి అలిసిపోయిన కోహ్లీ.. విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. కోహ్లీ అమెరికా చేరుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది కానీ, మ్యాచ్ గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈసారి టీ20 వరల్డ్ కప్కు విండీస్- యూఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఎలాగైనా కప్పును ఒడిసిపట్టుకోవాలనే కసితో టీమ్ఇండియా అక్కడ అడుగుపెట్టింది. శనివారం బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అసలైన సంగ్రామం మాత్రం జూన్ 5న ఐర్లాండ్తో మొదలుకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.