Virat Kohli: న్యూయార్క్‌లో కోహ్లీ.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డౌటే..!

టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు భారత్‌ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ న్యూయార్క్‌ చేరుకున్నాడు. అయితే, శనివారం బంగ్లాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడతాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Published : 31 May 2024 23:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి సమయం ఆసన్నమైంది. జూన్‌ 2 నుంచే ఈ సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత్‌ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ న్యూయార్క్‌ చేరుకున్నాడు. జట్టు సభ్యులంతా ఇప్పటికే  అక్కడికి వెళ్లగా.. ఐదు రోజుల ఆలస్యంగా ‘కింగ్‌’ అక్కడికి వెళ్లాడు. టీమ్‌ఇండియా బస చేసిన హోటల్‌లోనే దిగాడు. 

అయితే శనివారం బంగ్లాదేశ్‌తో జరగబోయే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడా లేదా?అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 16 గంటలపాటు జర్నీ చేసి అలిసిపోయిన కోహ్లీ.. విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. కోహ్లీ అమెరికా చేరుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది కానీ, మ్యాచ్‌ గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌కు విండీస్‌- యూఎస్‌ఏ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఎలాగైనా కప్పును ఒడిసిపట్టుకోవాలనే కసితో టీమ్‌ఇండియా అక్కడ అడుగుపెట్టింది. శనివారం బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అసలైన సంగ్రామం మాత్రం జూన్‌ 5న ఐర్లాండ్‌తో మొదలుకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని