Virat Kohli: వన్డే సిరీస్.. విరాట్ దూకుడును ఆసీస్ అడ్డుకోగలదా..?
టెస్టు సిరీస్లు ముగిశాయి. ఇక రాబోయే మూడు నెలలు వన్డేలు, టీ20లదే హవా. తొలుత ఆసీస్తో భారత్ మూడు వన్డేల (IND vs AUS) సిరీస్ను ఆడనుంది. ఈ క్రమంలో మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) దూకుడును ఆసీస్ ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి.
ఇంటర్నెట్ డెస్క్: జట్టులో స్థానం కోసం పోటీ లేదు.. శతకం చేయాలనే ఒత్తిడి లేదు.. కెప్టెన్సీ భారం అసలే లేదు. తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. ఇదీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పరిస్థితి. శుక్రవారం నుంచి ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మరోసారి విరాట్ విజృంభించాలని అభిమానులు కోరుతున్నారు. మరి విరాట్ను ఆసీస్ అడ్డుకోగలదో లేదో చూడాలి. ఈలోగా ఆసీస్పై విరాటుడి దండయాత్ర ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం..
దాదాపు మూడేళ్లపాటు సెంచరీ లేదనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓర్పుగా సహనంతో ఉన్న విరాట్ ఆరు నెలల కిందట టీ20ల్లో సెంచరీ.. మూడు నెలల ముందు వన్డేల్లో శతకం.. ఇప్పుడు టెస్టుల్లోనూ సెంచరీ కొట్టి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తనపై ఉన్న కొండంత భారాన్ని వదిలించుకున్నాడు. ఇక రాబోయే కాలంలో సరికొత్త విరాట్ను చూడటం తథ్యం.. అందుకు ఆసీస్తో వన్డే సిరీస్ (IND vs AUS) తొలి వేదికగా నిలవనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టుపై విరాట్ రికార్డు అలాంటిది మరి. విరాట్ ఆసీస్పై 43 వన్డేల్లో 54.81 స్ట్రైక్రేట్తో 2,083 పరుగులు సాధించాడు. ఇందులో 8 శతకాలు ఉండటం విశేషం. సచిన్ తెందూల్కర్ కంటే కేవలం ఒక్క సెంచరీ మాత్రమే తక్కువ. విరాట్ ఫామ్ను బట్టి ఇప్పుడీ సిరీస్లోనే సచిన్ను అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత పది వన్డే ఇన్నింగ్స్ల్లో మూడు సెంచరీలు ఉన్నాయి.
భారత్లో మరీ ఎక్కువ..
స్వదేశంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసీస్పై భారీగా చెలరేగిపోతాడు. అందుకు సాక్ష్యం ఈ గణాంకాలు.. ఇక్కడ ఆసీస్పై 23 వన్డే మ్యాచ్లు ఆడిన విరాట్ 59.95 సగటుతో ఐదు శతకాలతో 1,199 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు అన్ని దేశాల మీద 107 వన్డేల్లో 58.87 సగటుతో 5,358 పరుగులు చేశాడు. అందుకే స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆసీస్ (కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు) విరాట్ కోహ్లీపై ఓ కన్నేయాలి. గత డిసెంబర్లో బంగ్లాదేశ్పై సెంచరీతో వన్డేల్లో ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. శ్రీలంక మీద చెలరేగిపోయాడు. మూడు వన్డేల్లో ఏకంగా రెండు సెంచరీలు బాదేశాడు.
జంపా బౌలింగ్లోనే కాస్త..
ఉపఖండ పిచ్లపై విరాట్ కోహ్లీకి అడ్డు కట్ట వేయడం కష్టంతో కూడుకున్నదే. కానీ, ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా (Virat vs Adam Zampa) బౌలింగ్లో మాత్రం విరాట్ తడబాటుకు గురవుతున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో 16 మ్యాచుల్లో 5సార్లు విరాట్ను జంపాపెవిలియన్కు చేర్చాడు. అందుకే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు వచ్చినప్పుడు స్మిత్ తప్పకుండా ఆడమ్ జంపాను ప్రయోగిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదని క్రికెట్ విశ్లేషకులు ఘంటాపథంగా చెప్పారు. మిచెల్ స్టార్క్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. అయితే, విరాట్ను త్వరగా ఔట్ చేస్తేనే ఫలితం ఉంటుంది. క్రీజ్లో పాతుకుపోయేలా అవకాశం ఇస్తే మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడేస్తాడు.
సచిన్ రికార్డుకు చేరువగా..
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డులను దాటాలంటే ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి ‘వంద’ శతకాలను సచిన్ సాధించగా.. విరాట్ కోహ్లీ 75 వద్ద ఉన్నాడు. కానీ, ఓ రికార్డుకు మాత్రం అత్యంత చేరువగా ఉన్నాడు. అదే వన్డేల్లో సెంచరీల రికార్డు. అవునండి.. సచిన్ 49 శతకాలు చేయగా.. విరాట్ 46 సెంచరీలతో వెనుకనే ఉన్నాడు. మరో నాలుగు చేస్తే సచిన్ను అధిగమిస్తాడు. ఇప్పుడున్న ఫామ్ను బట్టి ఆసీస్తో జరిగే మూడు వన్డేల్లో సెంచరీలు సాధించినా సాధించగల సత్తా విరాట్ సొంతం. అప్పుడు సచిన్తో సమంగా నిలుస్తాడు. ఎలాగూ ఈ ఏడాది ఆసియా కప్ (Asia cup 2023), వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఉన్నాయి. కాబట్టి, ఆ రికార్డు మాత్రం విరాట్ కొట్టేయడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్