Virat Kohli: వన్డే సిరీస్.. విరాట్ దూకుడును ఆసీస్ అడ్డుకోగలదా..?
టెస్టు సిరీస్లు ముగిశాయి. ఇక రాబోయే మూడు నెలలు వన్డేలు, టీ20లదే హవా. తొలుత ఆసీస్తో భారత్ మూడు వన్డేల (IND vs AUS) సిరీస్ను ఆడనుంది. ఈ క్రమంలో మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) దూకుడును ఆసీస్ ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి.
ఇంటర్నెట్ డెస్క్: జట్టులో స్థానం కోసం పోటీ లేదు.. శతకం చేయాలనే ఒత్తిడి లేదు.. కెప్టెన్సీ భారం అసలే లేదు. తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. ఇదీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పరిస్థితి. శుక్రవారం నుంచి ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మరోసారి విరాట్ విజృంభించాలని అభిమానులు కోరుతున్నారు. మరి విరాట్ను ఆసీస్ అడ్డుకోగలదో లేదో చూడాలి. ఈలోగా ఆసీస్పై విరాటుడి దండయాత్ర ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం..
దాదాపు మూడేళ్లపాటు సెంచరీ లేదనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓర్పుగా సహనంతో ఉన్న విరాట్ ఆరు నెలల కిందట టీ20ల్లో సెంచరీ.. మూడు నెలల ముందు వన్డేల్లో శతకం.. ఇప్పుడు టెస్టుల్లోనూ సెంచరీ కొట్టి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తనపై ఉన్న కొండంత భారాన్ని వదిలించుకున్నాడు. ఇక రాబోయే కాలంలో సరికొత్త విరాట్ను చూడటం తథ్యం.. అందుకు ఆసీస్తో వన్డే సిరీస్ (IND vs AUS) తొలి వేదికగా నిలవనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టుపై విరాట్ రికార్డు అలాంటిది మరి. విరాట్ ఆసీస్పై 43 వన్డేల్లో 54.81 స్ట్రైక్రేట్తో 2,083 పరుగులు సాధించాడు. ఇందులో 8 శతకాలు ఉండటం విశేషం. సచిన్ తెందూల్కర్ కంటే కేవలం ఒక్క సెంచరీ మాత్రమే తక్కువ. విరాట్ ఫామ్ను బట్టి ఇప్పుడీ సిరీస్లోనే సచిన్ను అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత పది వన్డే ఇన్నింగ్స్ల్లో మూడు సెంచరీలు ఉన్నాయి.
భారత్లో మరీ ఎక్కువ..
స్వదేశంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసీస్పై భారీగా చెలరేగిపోతాడు. అందుకు సాక్ష్యం ఈ గణాంకాలు.. ఇక్కడ ఆసీస్పై 23 వన్డే మ్యాచ్లు ఆడిన విరాట్ 59.95 సగటుతో ఐదు శతకాలతో 1,199 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు అన్ని దేశాల మీద 107 వన్డేల్లో 58.87 సగటుతో 5,358 పరుగులు చేశాడు. అందుకే స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆసీస్ (కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు) విరాట్ కోహ్లీపై ఓ కన్నేయాలి. గత డిసెంబర్లో బంగ్లాదేశ్పై సెంచరీతో వన్డేల్లో ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. శ్రీలంక మీద చెలరేగిపోయాడు. మూడు వన్డేల్లో ఏకంగా రెండు సెంచరీలు బాదేశాడు.
జంపా బౌలింగ్లోనే కాస్త..
ఉపఖండ పిచ్లపై విరాట్ కోహ్లీకి అడ్డు కట్ట వేయడం కష్టంతో కూడుకున్నదే. కానీ, ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా (Virat vs Adam Zampa) బౌలింగ్లో మాత్రం విరాట్ తడబాటుకు గురవుతున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో 16 మ్యాచుల్లో 5సార్లు విరాట్ను జంపాపెవిలియన్కు చేర్చాడు. అందుకే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు వచ్చినప్పుడు స్మిత్ తప్పకుండా ఆడమ్ జంపాను ప్రయోగిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదని క్రికెట్ విశ్లేషకులు ఘంటాపథంగా చెప్పారు. మిచెల్ స్టార్క్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. అయితే, విరాట్ను త్వరగా ఔట్ చేస్తేనే ఫలితం ఉంటుంది. క్రీజ్లో పాతుకుపోయేలా అవకాశం ఇస్తే మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడేస్తాడు.
సచిన్ రికార్డుకు చేరువగా..
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డులను దాటాలంటే ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి ‘వంద’ శతకాలను సచిన్ సాధించగా.. విరాట్ కోహ్లీ 75 వద్ద ఉన్నాడు. కానీ, ఓ రికార్డుకు మాత్రం అత్యంత చేరువగా ఉన్నాడు. అదే వన్డేల్లో సెంచరీల రికార్డు. అవునండి.. సచిన్ 49 శతకాలు చేయగా.. విరాట్ 46 సెంచరీలతో వెనుకనే ఉన్నాడు. మరో నాలుగు చేస్తే సచిన్ను అధిగమిస్తాడు. ఇప్పుడున్న ఫామ్ను బట్టి ఆసీస్తో జరిగే మూడు వన్డేల్లో సెంచరీలు సాధించినా సాధించగల సత్తా విరాట్ సొంతం. అప్పుడు సచిన్తో సమంగా నిలుస్తాడు. ఎలాగూ ఈ ఏడాది ఆసియా కప్ (Asia cup 2023), వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఉన్నాయి. కాబట్టి, ఆ రికార్డు మాత్రం విరాట్ కొట్టేయడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన