Virat: అప్పుడు డకౌట్.. ఇప్పుడు సెంచరీ.. కోహ్లీ ‘మైలురాళ్ల’ ఇన్నింగ్స్లు ఇలా!
అంతర్జాతీయ స్థాయిలో 500, అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన పదో ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డు సృష్టించాడు. ఇదే క్రమంలో శతకం సాధించి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి విండీస్తో జరుగుతున్న రెండో టెస్టు ఎంతో ప్రత్యేకం. కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్.. ఈ మైలురాయి మ్యాచ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే శతకం నమోదు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్లో 121 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరిగాడు. అయితే.. గతంలో తన తొలి, 100, 200, 300, 400వ.. ఇలా స్పెషల్ మ్యాచ్ల్లో ఈ రన్ మెషీన్ ప్రదర్శన ఎలా ఉందో చూద్దామా..
తొలి మ్యాచ్లో ఇలా..
జాతీయ జట్టు తరఫున ఆడాలనేది ప్రతి ఒక్కరి కల. విరాట్ కోహ్లీకి ఈ అవకాశం 2008లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వచ్చింది. ఓపెనర్గా వచ్చిన విరాట్ ఆ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం అలా జరిగింది.
100వ అంతర్జాతీయ మ్యాచ్..
ఆసియా కప్లో భాగంగా మార్చి 16, 2012లో బంగ్లాదేశ్తో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 289/5 స్కోరు సాధించింది. ఇందులో కోహ్లీ 82 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
200వ మ్యాచ్..
నవంబర్ 6, 2014లో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మ్యాచ్ కోహ్లీకి 200వది. అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ.. ధోనీ అందుబాటులో లేకపోవడంతో స్టాండ్బై కెప్టెన్గానూ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో 49 (44) పరుగులు బాదాడు. ఇదే సిరీస్లో రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(264) నమోదు చేశాడు.
300వ మ్యాచ్..
విరాట్ కోహ్లీ 200వ మ్యాచ్ అనంతరం.. 300వ మ్యాచ్ ఆడటానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన కోహ్లీ ఆగస్టు 24, 2017లో కెరీర్లో 300వ మ్యాచ్ ఆడాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులకే విరాట్ పెవిలియన్కు చేరాడు. ఆ మ్యాచ్లో భారత్ 109/0 నుంచి 131/7కి పతనమైంది. అయితే ఎనిమిదో వికెట్కు ధోనీ -భువనేశ్వర్ శతక భాగస్వామ్యంతో టీమ్ఇండియా గట్టెక్కింది.
తెలుగు గడ్డపైనే 400వ మ్యాచ్..
తన కెరీర్లో అత్యంత చేదు జ్ఞాపకంగా 400వ మ్యాచ్ నిలుస్తుందనడంలో అనుమానం లేదు. అదీనూ తెలుగు గడ్డపైనే కావడం విశేషం. విశాఖపట్నం వేదికగా 2019 డిసెంబర్ 18న విండీస్తో జరిగిన మ్యాచ్లోనే గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఆ పిచ్పై 38వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన విరాట్ కీరన్ పొలార్డ్ వేసిన తొలి బంతికే పెవిలియన్కు చేరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్