Virat: అప్పుడు డకౌట్.. ఇప్పుడు సెంచరీ.. కోహ్లీ ‘మైలురాళ్ల’ ఇన్నింగ్స్లు ఇలా!
అంతర్జాతీయ స్థాయిలో 500, అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన పదో ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డు సృష్టించాడు. ఇదే క్రమంలో శతకం సాధించి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి విండీస్తో జరుగుతున్న రెండో టెస్టు ఎంతో ప్రత్యేకం. కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్.. ఈ మైలురాయి మ్యాచ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే శతకం నమోదు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్లో 121 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరిగాడు. అయితే.. గతంలో తన తొలి, 100, 200, 300, 400వ.. ఇలా స్పెషల్ మ్యాచ్ల్లో ఈ రన్ మెషీన్ ప్రదర్శన ఎలా ఉందో చూద్దామా..
తొలి మ్యాచ్లో ఇలా..
జాతీయ జట్టు తరఫున ఆడాలనేది ప్రతి ఒక్కరి కల. విరాట్ కోహ్లీకి ఈ అవకాశం 2008లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వచ్చింది. ఓపెనర్గా వచ్చిన విరాట్ ఆ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం అలా జరిగింది.
100వ అంతర్జాతీయ మ్యాచ్..
ఆసియా కప్లో భాగంగా మార్చి 16, 2012లో బంగ్లాదేశ్తో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 289/5 స్కోరు సాధించింది. ఇందులో కోహ్లీ 82 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
200వ మ్యాచ్..
నవంబర్ 6, 2014లో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మ్యాచ్ కోహ్లీకి 200వది. అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ.. ధోనీ అందుబాటులో లేకపోవడంతో స్టాండ్బై కెప్టెన్గానూ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో 49 (44) పరుగులు బాదాడు. ఇదే సిరీస్లో రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(264) నమోదు చేశాడు.
300వ మ్యాచ్..
విరాట్ కోహ్లీ 200వ మ్యాచ్ అనంతరం.. 300వ మ్యాచ్ ఆడటానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన కోహ్లీ ఆగస్టు 24, 2017లో కెరీర్లో 300వ మ్యాచ్ ఆడాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులకే విరాట్ పెవిలియన్కు చేరాడు. ఆ మ్యాచ్లో భారత్ 109/0 నుంచి 131/7కి పతనమైంది. అయితే ఎనిమిదో వికెట్కు ధోనీ -భువనేశ్వర్ శతక భాగస్వామ్యంతో టీమ్ఇండియా గట్టెక్కింది.
తెలుగు గడ్డపైనే 400వ మ్యాచ్..
తన కెరీర్లో అత్యంత చేదు జ్ఞాపకంగా 400వ మ్యాచ్ నిలుస్తుందనడంలో అనుమానం లేదు. అదీనూ తెలుగు గడ్డపైనే కావడం విశేషం. విశాఖపట్నం వేదికగా 2019 డిసెంబర్ 18న విండీస్తో జరిగిన మ్యాచ్లోనే గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఆ పిచ్పై 38వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన విరాట్ కీరన్ పొలార్డ్ వేసిన తొలి బంతికే పెవిలియన్కు చేరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mumbai Vs Hyderabad: ‘‘పొలార్డ్.. నువ్వేం మారలేదు.. నీ ఫీల్డింగ్ ఇప్పటికీ సూపర్’’
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు.
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు