World Cup 2023 : అప్పుడు సచిన్లానే ఇప్పుడు విరాట్.. అతడి కోసం వరల్డ్ కప్ గెలవాలి : సెహ్వాగ్
2011లో సచిన్ కోసం తాము ప్రంపంచకప్ గెలిచామని వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) చెప్పాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కోసం వరల్డ్కప్ గెలవాలని టీమ్ఇండియాను కోరాడు.
ఇంటర్నెట్ డెస్క్ : 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ను భారత్(Team India)కు అందించి కపిల్ సేన చరిత్ర లిఖించింది. ఆ తర్వాత 28 ఏళ్లకు.. ధోనీ(Ms dhoni)సేన రెండోసారి వరల్డ్ కప్ను ముద్దాడి భారత అభిమానుల కలను నెరవేర్చింది. ఇప్పుడు 12 ఏళ్ల అనంతరం మరోసారి స్వదేశం వేదికగా ఈ మెగాటోర్నీ(World Cup 2023) జరగనుంది. ఈ నేపథ్యంలో మరోసారి కప్ గెలిచి.. సుదీర్ఘకాలంగా ఉన్న ఐసీసీ ట్రోఫీల కొరతను తీర్చాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అప్పుడు తాము సచిన్(Sachin Tendulkar) కోసం ప్రపంచకప్ గెలిచామని.. ఇప్పుడు విరాట్ కోహ్లీ(Virat Kohli) కోసం కప్ గెలవాల్సిన అవసరముందని సెహ్వాగ్ చెప్పాడు. ‘‘మేం అప్పుడు సచిన్ తెందూల్కర్ కోసం ప్రపంచకప్ ఆడాం.. గెలిచాం. దీంతో దిగ్గజ క్రికెటర్కు ఘనంగా వీడ్కోలు చెప్పాం. అప్పుడు సచిన్ ఎలానో.. ఇప్పుడు కోహ్లీ అలాగే ఉన్నాడు. విరాట్ ఆట, మాట తీరు, చూపులు, ఆటపై అతడికుండే మక్కువ.. ఇవన్నీ సచిన్ను తలపిస్తాయి. అందుకే అతడి కోసం ప్రపంచకప్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎల్లప్పుడూ వంద శాతం కంటే ఎక్కువ ప్రదర్శన ఇస్తాడు. కోహ్లీ కూడా ఈ ప్రపంచకప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడని నేను అనుకుంటున్నాను’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
‘అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మంది మీ ఆటను వీక్షిస్తారు. కోహ్లీకి పిచ్ల పరిస్థితులు ఏంటో తెలుసు. అతడు తప్పకుండా గొప్ప ఇన్నింగ్స్లు ఆడతాడు. భారత్కు ప్రపంచకప్ అందించేందుకు ఉత్తమంగా పొరాడతాడు’ అని కోహ్లీపై తనకున్న నమ్మకాన్ని సెహ్వాగ్ వివరించాడు.
ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూసే చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్(IND vs PAK) అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. దాయాదుల మధ్య పోరులో భారత్ ఫేవరెట్ అని.. తప్పకుండా రోహిత్ సేన విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని సెహ్వాగ్ వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఒత్తిడిని అధిగమించడంతో భారత్ మెరుగ్గా ఉందని చెప్పాడు. ‘‘టీమ్ఇండియా ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలదు. ఇక పాక్ పరిస్థితి అలా కాదు. వారు ఇప్పటి వరకూ ప్రపంచకప్ మ్యాచ్ల్లో భారత్పై గెలవలేదు’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!