Virat Kohli: ఆర్సీబీ ఎగ్జిట్.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
తాజా ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ (RCB) జట్టు ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది. దీంతో ఆ జట్టు కీలక ఆటగాడు, టీమిండియా మాజీ సారథి కోహ్లీ (Virat Kohli) సోషల్మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఈ సాలా కప్ నమదే’ అన్న కల.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కు ఈసారీ తీరలేదు. ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ (RCB) మెరుగ్గానే రాణించినప్పటికీ.. లీగ్ స్టేజ్కే పరిమితమైంది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) శతకం సాధించినా.. గుజరాత్ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు.
‘‘ఈ సీజన్లో మెరుగ్గా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ మనం లక్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయాం. నిరాశ చెందినప్పటికీ.. మనం ఎప్పుడూ తలెత్తుకునే ఉండాలి. ఈ ప్రయాణంలో మాకు అడుగడుగునా అండగా నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటాం. మా కోచ్లు, మేనేజ్మెంట్, మా జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. మరింత బలంగా తిరిగొస్తాం’’ అని కోహ్లీ (Virat Kohli) రాసుకొచ్చాడు. థాంక్యూ బెంగళూరు అంటూ ఫొటోలు షేర్ చేశాడు.
ఈ సీజన్లో కోహ్లీ (Virat Kohli) అద్భుత ప్రదర్శన చేశాడు. చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్పై సెంచరీ బాదాడు. మొత్తంగా ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 53.25 సగటుతో 639 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థ శతకాలున్నాయి. తాజా సీజన్లో ఇప్పటివరకు డుప్లెసిస్, శుభ్మన్ గిల్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన మూడో క్రికెటర్ కోహ్లీనే కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!