Virat Kohli : చేతికి స్టిచ్చెస్తో ఆడి.. అద్భుత సెంచరీ బాది.. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ గుర్తు చేసిన మాజీ ఆటగాడు
ఐపీఎల్(IPL)లో బెంగళూరు జట్టుతో విరాట్ కోహ్లీ(Virat Kohl) ప్రయాణం 15 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మాజీ ఆటగాళ్లు.. ఆటపట్ల అతడి అంకితభావాన్ని గుర్తు చేశారు
(ఫొటో : ఆర్సీబీ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్ : పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ(Virat Kohli)కి.. ఐపీఎల్(IPL)లో బెంగళూరు(RCB) జట్టుతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆ జట్టుతో అతడి అనుబంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో అతడు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఒక్కసారి కూడా ట్రోఫీ గెలుచుకోకపోయినప్పటికీ.. ఈ మెగాటోర్నీలో బెంగళూరును విలువైన జట్టుగా అభిమానులు ఆదరిస్తున్నారంటే అందుకు కారణం కోహ్లీనే. అంకితభావం, అద్భుతమైన ఆటతీరు, గొప్ప నాయకత్వంతో ఆ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు విరాట్.
ఆర్సీబీతో కోహ్లీ ప్రయాణం 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ క్రీడా ఛానల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. జట్టుతో విరాట్కు ఉన్న అనుబంధాన్ని మాజీ ఆటగాళ్లు గుర్తుచేసుకున్నారు. మాజీ ఆల్రౌండర్ సంజయ్ బంగర్(Sanjay Bangar) 2016 నాటి ఘటనను గుర్తుచేసుకొని కోహ్లీకి ఆట పట్ల ఎంత అంకితభావం ఉందో తెలియజేశాడు. చేతి గాయంతో బాధపడుతూ.. నొప్పిని పంటి బిగువనే అదిమిపట్టి సెంచరీ బాదిన అతడి ఆటతీరును వివరించాడు. ‘ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో అనుకుంటా.. చేతికి స్టిచ్చెస్తోనే కోహ్లీ బ్యాట్ పట్టాడు. వీరవిహారం చేసి 50 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఆ మ్యాచ్లో అతడి ఆట తీరు అద్భుతం’ అంటూ బంగర్ మెచ్చుకున్నాడు.
వర్షం అంతరాయంతో 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో.. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. 146 పరుగుల భాగస్వామ్యంతో కోహ్లీ, గేల్ చెలరేగి ఆడి.. జట్టుకు 15 ఓవర్లలోనే 211 పరుగులు భారీ స్కోరును చేసి పెట్టారు. అనంతరం పంజాబ్ను 120 పరుగులకే కట్టడి చేయడంతో 82 పరుగుల(DLS) తేడాతో కోహ్లీసేన ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని నమోదు చేసింది.
2008లో కోహ్లీ తన ఐపీఎల్ ప్రయాణాన్ని బెంగళూరు జట్టుతో ప్రారంభించాడు. 2013-21 మధ్య కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం డుప్లెసిస్ సారథ్యంలో అతడు ఆడుతున్నాడు. ఇక 16వ ఐపీఎల్(IPL-2023) సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?