Virat Kohli : చేతికి స్టిచ్చెస్తో ఆడి.. అద్భుత సెంచరీ బాది.. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ గుర్తు చేసిన మాజీ ఆటగాడు
ఐపీఎల్(IPL)లో బెంగళూరు జట్టుతో విరాట్ కోహ్లీ(Virat Kohl) ప్రయాణం 15 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మాజీ ఆటగాళ్లు.. ఆటపట్ల అతడి అంకితభావాన్ని గుర్తు చేశారు
(ఫొటో : ఆర్సీబీ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్ : పరుగుల వీరుడు, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ(Virat Kohli)కి.. ఐపీఎల్(IPL)లో బెంగళూరు(RCB) జట్టుతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆ జట్టుతో అతడి అనుబంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో అతడు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఒక్కసారి కూడా ట్రోఫీ గెలుచుకోకపోయినప్పటికీ.. ఈ మెగాటోర్నీలో బెంగళూరును విలువైన జట్టుగా అభిమానులు ఆదరిస్తున్నారంటే అందుకు కారణం కోహ్లీనే. అంకితభావం, అద్భుతమైన ఆటతీరు, గొప్ప నాయకత్వంతో ఆ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు విరాట్.
ఆర్సీబీతో కోహ్లీ ప్రయాణం 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ క్రీడా ఛానల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. జట్టుతో విరాట్కు ఉన్న అనుబంధాన్ని మాజీ ఆటగాళ్లు గుర్తుచేసుకున్నారు. మాజీ ఆల్రౌండర్ సంజయ్ బంగర్(Sanjay Bangar) 2016 నాటి ఘటనను గుర్తుచేసుకొని కోహ్లీకి ఆట పట్ల ఎంత అంకితభావం ఉందో తెలియజేశాడు. చేతి గాయంతో బాధపడుతూ.. నొప్పిని పంటి బిగువనే అదిమిపట్టి సెంచరీ బాదిన అతడి ఆటతీరును వివరించాడు. ‘ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో అనుకుంటా.. చేతికి స్టిచ్చెస్తోనే కోహ్లీ బ్యాట్ పట్టాడు. వీరవిహారం చేసి 50 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఆ మ్యాచ్లో అతడి ఆట తీరు అద్భుతం’ అంటూ బంగర్ మెచ్చుకున్నాడు.
వర్షం అంతరాయంతో 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో.. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. 146 పరుగుల భాగస్వామ్యంతో కోహ్లీ, గేల్ చెలరేగి ఆడి.. జట్టుకు 15 ఓవర్లలోనే 211 పరుగులు భారీ స్కోరును చేసి పెట్టారు. అనంతరం పంజాబ్ను 120 పరుగులకే కట్టడి చేయడంతో 82 పరుగుల(DLS) తేడాతో కోహ్లీసేన ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని నమోదు చేసింది.
2008లో కోహ్లీ తన ఐపీఎల్ ప్రయాణాన్ని బెంగళూరు జట్టుతో ప్రారంభించాడు. 2013-21 మధ్య కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం డుప్లెసిస్ సారథ్యంలో అతడు ఆడుతున్నాడు. ఇక 16వ ఐపీఎల్(IPL-2023) సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్