IND vs PAK: అక్టోబర్ 23 ఎంతో ప్రత్యేకం.. ఎప్పుడూ లేనంత శక్తి వచ్చినట్లుంది: విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. టీమ్ఇండియా సెమీస్లోనే ఓడి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ మీద ఆడిన ఇన్నింగ్స్ను ఎప్పటికీ మరిచిపోలేనని విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతూ విశ్రాంతి తీసుకొంటున్నాడు. పొట్టి కప్లో భారత్ సెమీస్లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై అద్భుత విజయం సాధించడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఆ ఒక్క మ్యాచ్లోనే కాకుండా టోర్నీ ఆసాంతం మంచి ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీకి పాక్పై చేసిన 82* పరుగులు ప్రత్యేకమైనవి. చివరి వరకూ క్రీజ్లో ఉండి భారత్కు విజయం చేకూర్చి పెట్టాడు. ఈ క్రమంలో అప్పటి మ్యాచ్ను మరోసారి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా గుర్తుకు తెచ్చాడు.
‘‘ అక్టోబర్ 23వ తేదీకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి వరకు చాలా మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఎప్పుడూలేనంత బలమొచ్చినట్లు అనుభూతి కలిగింది. ఆ సాయంత్రం అద్భుతం’’ అని తన ఇన్స్టాగ్రామ్లో ఫొటోను షేర్ చేశాడు. ఏడు ఓవర్లకే 31 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయిన భారత్ను హార్దిక్ పాండ్యతో (40)తో కలిసి విరాట్ నిలబెట్టాడు. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవుఫ్ వంటి పేసర్లను తట్టుకొని అజేయంగా నిలిచాడు. పొట్టి కప్ టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం