Virat - Dada: దాదాతో కింగ్‌ కరచాలనం.. వివాదానికి ముగింపు!

దిల్లీ - ఆర్‌సీబీ  (DC vs RCB) మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన నెటిజన్లను ఆకట్టుకుంది. గతంలో ఇరు జట్ల మధ్య వివాదానికి ముగింపు పలుకుతూ స్టార్లు కలిసిపోయారు.

Published : 07 May 2023 11:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ (Sourav Ganguly), స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మధ్య నెలకొన్న వివాదానికి శుభం కార్డు పడింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏప్రిల్‌ 15న దిల్లీ క్యాపిటల్స్ - రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ సందర్భంగా గంగూలీకి కరచాలనం ఇచ్చేందుకు విరాట్ విముఖత చూపాడు. అప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం మరోసారి ఇరు జట్ల మధ్య పోరు జరిగింది. ఇందులో బెంగళూరుపై దిల్లీ అద్భుత విజయం సాధించింది. ఈ క్రమంలోనూ ఆర్‌సీబీ బౌలర్ సిరాజ్‌, దిల్లీ బ్యాటర్ సాల్ట్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే, అంపైర్లు ఆటగాళ్లకు సర్ది చెప్పడంతో  అది అంతటితో ఆగిపోయింది. అయితే, మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాత్రం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

గత మ్యాచ్‌లో సౌరభ్‌ గంగూలీ, విరాట్ కోహ్లీ ఒకరినొకరు ఆగ్రహంగా చూసుకోవడం.. కరచాలనం చేసుకొనేందుకు విముఖత చూపడం చోటు చేసుకుంది. అయితే, ఈసారి మాత్రం గంగూలీ వద్దకు వెళ్లిన విరాట్ అతడితో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించాడు. దీంతో సోషల్‌ మీడియాలో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈసారి లఖ్‌నవూతో మ్యాచ్‌ జరిగితే గౌతమ్‌ గంభీర్‌ - విరాట్ ఇలానే కలిసి పోవాలని ఫ్యాన్స్‌ ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని