Rajasthan Vs Bengaluru: రాజస్థాన్పై విరాట్ దూకుడు కొనసాగేనా? బెంగళూరు స్టార్కు కలసిరాని జైపుర్
నాణ్యమైన బౌలింగ్ లేకపోవడం వల్ల కలిగే నష్టం బెంగళూరును చూస్తే అర్థమవుతోంది. బ్యాటింగ్లో ఎక్కువగా విరాట్పైనే (Virat Kohli) ఆ జట్టు ఆధారపడుతోంది. అయితే, జైపుర్ వేదిక మ్యాచ్ కావడంతో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది చూడాలి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టాప్ స్కోరర్. ఆరెంజ్ క్యాప్ హోల్డర్.. అయినా తన జట్టు బెంగళూరు మాత్రం వరుసగా ఓటములను చవిచూస్తోంది. ఇవాళ జైపుర్ వేదికగా రాజస్థాన్తో తలపడేందుకు సిద్ధమైంది. అద్భుత ఫామ్లో ఉన్న విరాట్కు ఈ మైదానంలో గొప్ప గణాంకాలు లేవు. ఈక్రమంలో బెంగళూరు హ్యాట్రిక్ ఓటమి నుంచి బయటపడుతుందా? రాజస్థాన్ వరుస విజయాలకు బ్రేక్ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. మరోవైపు తన సొంత మైదానంలో వరుసగా రెండు ఓటములను చవిచూసిన బెంగళూరు అట్టడుగు నుంచి మూడులో కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ (4 మ్యాచుల్లో 203 పరుగులు) బ్యాటింగ్లో అదరగొడుతున్నా.. అతడికి జట్టు నుంచి సరైన సహకారం లభించడం లేదు. అప్పుడప్పుడు లామ్రోర్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్ బ్యాటింగ్లో మెరుపులు తప్పితే.. నిలకడగా ఆడేవారే కరవయ్యారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ విషయంలో అభిమానులకు ఆందోళన కలిగించే విషయం.. జైపుర్లో అతడికి మెరుగైన గణాంకాలు లేవు. జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ల్లో అదరగొట్టేసిన కోహ్లీ.. ఐపీఎల్లో మాత్రం పేలవ ప్రదర్శనే చేశాడు. భారత్ తరఫున కేవలం 3 మ్యాచుల్లోనే 195 పరుగులు చేశాడు. అందులో అక్టోబర్ 2013లో 52 బంతుల్లోనే సెంచరీ చేసిన ఫీట్ కూడా ఉంది. ఐపీఎల్లో మాత్రం ఎనిమిది మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. కేవలం 149 పరుగులే చేశాడు. చివరిసారిగా రాజస్థాన్పై ఇదే మైదానంలో 19 బంతుల్లో 18 పరుగులు చేసి నిరాశపరిచాడు. దేశంలో అన్ని మైదానాల్లోకెల్లా ఇక్కడే తక్కువ యావరేజ్ ఉండటం గమనార్హం. అయితే, ఇప్పుడు ఉన్న ఫామ్ను బట్టి ఎలాంటి పిచ్పైనైనా అదరగొట్టే విరాట్ గత గణాంకాలను పట్టించుకోడు.
రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మదే ఆధిపత్యం
విరాట్ కోహ్లీపై రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. ఐపీఎల్లో ఇరువురు 15 మ్యాచుల్లో తలపడగా.. కోహ్లీ 67 బంతుల్లో 87 పరుగులు చేశాడు. కోహ్లీని సందీప్ 7 సార్లు ఔట్ చేయడం విశేషం. సందీప్ బౌలింగ్లో విరాట్ బ్యాటింగ్ యావరేజ్ 12.42 మాత్రమే. ఇందులో 25 బంతులకు పరుగులేమీ రాలేదు. అలాగే బెంగళూరుపై 26 వికెట్లు తీసిన ఘనత సందీప్ సొంతం. చాహల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్ వంటి బౌలర్లను ఎదుర్కోడానికి బెంగళూరు బ్యాటర్లు తీవ్ర సాధన చేయాల్సిందే. రాజస్థాన్ బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్ఠమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్తో కూడిన టాప్ ఆర్డర్ను త్వరగా ఔట్ చేయడం బెంగళూరు బౌలింగ్ విభాగానికి కష్టమే. గతంలో రాజస్థాన్పై మంచి ప్రదర్శనే చేసిన సిరాజ్ ఇప్పుడు పెద్దగా ఫామ్లో లేడు.
పిచ్ పరిస్థితి
జైపుర్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. గత రెండు మ్యాచ్ల గణాంకాలను బట్టి క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రతీ మ్యాచ్లోనూ 180+ స్కోరు నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించడం గమనార్హం. మ్యాచ్లో పరుగులు రాబట్టడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. దిల్లీ, లఖ్నవూ జట్లను ఇక్కడే రాజస్థాన్ ఓడించింది. ఇప్పుడు సొంత మైదానంలో హ్యాట్రిక్ విజయంపై సంజూ శాంసన్ సేన కన్నేసింది.
తుది జట్లు (అంచనా)
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మయేర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, నాండ్రీ బర్గర్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్
బెంగళూరు: విరాట్ కోహ్లీ, పాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజిత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్, మయాంక్ దగర్, సిరాజ్, టోప్లే, యశ్ దయాల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652