Playoffs Race: ‘ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవటానికి కోహ్లీ అన్ని విధాలా కృషి చేస్తాడు’
ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన శక్తి మేరకు అన్ని విధాలా కృషి చేస్తాడని సన్రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్ ప్రథమార్థంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బాగానే ఆడినప్పటికీ రెండో సీజన్లో ఆశించిన ప్రదర్శన కనబర్చలేదని సన్రైజర్స్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ అన్నాడు. అయితే, ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన శక్తి మేరకు అన్ని విధాలా కృషి చేస్తాడని పేర్కొన్నాడు.
‘‘ఈ సీజన్ ప్రథమార్థంలో ఆర్సీబీ బాగా ఆడింది. కానీ, ద్వితీయార్థంలో ఆ జట్టు వెనకబడి పోయింది. కాబట్టి, వారు తమ మిగిలిన మ్యాచ్ల్లో విజయం కోసం వంద శాతం కృషి చేయాల్సిన అవసరముంది. వారికి విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు ఉన్నాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి కోహ్లీ తన శక్తి మేరకు కృషి చేస్తాడు’’ అని టామ్ మూడీ ఓ క్రీడా ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో అన్నాడు.
భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఆర్సీబీ ఆటతీరు గురించి మాట్లాడాడు. ఆ జట్టు (KGF) విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్లపై ఎక్కువగా ఆధారపడుతోందన్నాడు. ‘ఆర్సీబీ జట్టుగా ఆడాలి. కేవలం ముగ్గురు ఆటగాళ్లపై (కోహ్లీ, మ్యాక్స్వెల్, డుప్లెసిస్) ఆడితే సరిపోదు. ఇప్పుడు ప్రతి ఆటగాడు ముందుకు వచ్చి తన బాధ్యతను నెరవేర్చాలి’ అని యూసుఫ్ పఠాన్ అన్నాడు.
ఈ సీజన్లో బెంగళూరు ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములతో ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్స్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలవాలి. ఈ క్రమంలో నేడు సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం బెంగళూరుకు అత్యావశ్యకం. ఓడినా ఆ జట్టు రేసులో ఉంటుంది కానీ.. ఆఖరి మ్యాచ్లో గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలు కలిసిరావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!