ఆ స్థానంలో మరో బ్యాటర్ వచ్చి ఉంటే..? లఖ్నవూ వ్యూహాలపై సెహ్వాగ్ మండిపాటు
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో లఖ్నవూ సూపర్జెయింట్స్ అనుసరించిన వ్యూహాలపై సెహ్వాగ్ మండిపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 (IPL)లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG) 56 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో లఖ్నవూ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) మండిపడ్డాడు. ఈ మ్యాచ్లో లఖ్నవూ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదన్నాడు. మూడో స్థానంలో దీపక్ హుడా (Deepak Hooda)ను పంపడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ స్థానంలో అతడికి బదులుగా ఫామ్లో ఉన్న మరో బ్యాటర్ను పంపాల్సిందన్నాడు.
‘‘పది ఓవర్లకు లఖ్నవూ స్కోర్ 102/1. వారు ఇదే ఫామ్ని కొనసాగించి ఉంటే ఓడిపోయేవారు కాదు. తొలి వికెట్ కోల్పోయాక ఫామ్లో ఉన్న ఆటగాడు బ్యాటింగ్కి రావాలి. నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని వీరిలో ఎవరైనా మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చి ఉంటే బాగుండేది. కానీ, హుడా వచ్చాడు. ఒకవేళ పూరన్ (Nicholas pooran) వచ్చి ఉంటే 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించేవాడు. అప్పుడు ఆట మరోలా ఉండేది. ఈ మ్యాచ్లో ఆయుష్ బదోని (Ayush Badoni) 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఒకవేళ మూడో స్థానంలో అతడు బ్యాటింగ్ చేసినా ఎక్కువ పరుగులు సాధించేవాడు. ఆ స్థానంలో హుడానే పంపాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు.. కోచా? కెప్టెనా? యాజమాన్యమా? ఆ నిర్ణయం తీసుకొని లఖ్నవూ పొరపాటు చేసింది’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే