IPL 2023: ఫిట్నెస్పై దృష్టి పెట్టు.. కుదరకపోతే నన్ను కలువు: సీనియర్ స్పిన్నర్కు సెహ్వాగ్ సూచన
ప్రతి క్రికెటర్ ఫిట్నెస్ను సాధించాలని, వారి కెరీర్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) సూచించాడు. తాజాగా లఖ్నవూ సూపర్ జెయింట్స్ సీనియర్ బౌలర్ను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో (Cricket) ఫిట్నెస్ చాలా కీలకం. ఫిట్గా ఉంటే అతడి కెరీర్ మరింత కాలం కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో (IPL 2023) ఎంఎస్ ధోనీ ఇలాగే ఫిట్నెస్ కొనసాగిస్తూ.. 41 ఏళ్ల వయసులోనూ చెన్నై జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit mishra) కూడా 40 ఏళ్లు వచ్చినా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం విశేషం. కేవలం 7.47 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను కట్టిపడేస్తున్నాడు. అయితే, మిశ్రా తన ఫిట్నెస్ సమస్యల కారణంగా లఖ్నవూ సూపర్ జెయింట్స్ తరఫున అన్ని మ్యాచ్ల్లోనూ ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు చేశాడు. ఫిట్నెస్పై దృష్టిపెట్టాలని సూచించాడు.
‘‘అమిత్ మిశ్రా ప్రతిభ ఎక్కడికీ పోలేదు. అయితే, వయసు పెరిగే కొద్దీ మునుపటి వేగం మాత్రం తగ్గడం సహజం. ఎవరైనా బ్యాటర్ త్వరగా రిటైర్మెంట్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఫిట్నెస్ సమస్య. 20 ఓవర్లపాటు మైదానంలో ఫీల్డింగ్ చేయాలంటే ఫిట్గా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు సునీల్ గావస్కర్ను బ్యాటింగ్కు దింపినా.. కొన్ని షాట్లు కొట్టగలడు. కానీ, వికెట్ల మధ్య పరుగెత్తడం, ఫీల్డింగ్ చేయడం సాధ్యంకాదు. అందుకే ఫిట్నెస్ చాలా ముఖ్యం. అప్పుడే క్రికెటర్లు తమ కెరీర్ను పొడిగించుకుంటూ వెళ్లగలరు. ఇప్పుడు ఆటగాళ్లంతా ఇలానే చేయాలని నేను చెబుతా. అమిత్ మిశ్రా కూడా మరో ఏడాదిపాటు ఆడాలి. ధోనీ ఇప్పటికే చేసి చూపించాడు. విరాట్, రోహిత్, ధావన్ కూడా ఫిట్నెస్పై శ్రద్ధపెట్టి సాధించారు. అమిత్ మిశ్రా.. నువ్వు కూడా నా మాట విని ఫిట్నెస్పై దృష్టిపెట్టు. ఇంకాస్త కష్టపడు. అలా చేయలేనప్పుడు.. వెంటనే నన్ను కలువు. తప్పకుండా సాయం చేస్తా’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా