Sehwag: టెస్టు క్రికెట్లో అతడు కొత్త ‘మిస్టర్ కూల్’: వీరేంద్ర సెహ్వాగ్
ప్రపంచ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni)ని ‘‘మిస్టర్ కూల్’’ అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ ఆస్ట్రేలియా బ్యాటర్ను టెస్టు క్రికెట్లో కొత్త ‘మిస్టర్ కూల్’ అని అభివర్ణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా (Australia) శుభారంభం చేసింది. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ (England)పై ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ చేజారుతున్న దశలో కెప్టెన్ పాట్ కమిన్స్ (44 నాటౌట్; 73 బంతుల్లో 4×4, 2×6).. లైయన్ (16 నాటౌట్)తో కలిసి గొప్పగా పోరాడి ఆసీస్ను గెలిపించాడు. ఈ నేపథ్యంలో కమిన్స్ (Pat Cummins)పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా కమిన్స్ను అభినందించాడు. అతడిని టెస్టు క్రికెట్లో కొత్త ‘‘మిస్టర్ కూల్’’గా అభివర్ణించాడు. ప్రపంచ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni)ని ‘‘మిస్టర్ కూల్’’ అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే.
‘‘వాట్ ఎ టెస్ట్ మ్యాచ్. ఇటీవల కాలంలో నేను చూసిన అత్యుత్తమ మ్యాచ్ల్లో ఇది ఒకటి. టెస్ట్ క్రికెట్ ఈజ్ బెస్ట్ క్రికెట్. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి రోజు ఇంగ్లాండ్ ధైర్యంగా డిక్లేర్ చేసింది. కానీ, ఉస్మాన్ ఖవాజా రెండు ఇన్నింగ్స్ల్లోనూ అత్యద్భుతంగా ఆడాడు. టెస్ట్ క్రికెట్లో పాట్ కమిన్స్ కొత్త మిస్టర్ కూల్.ఒత్తిడిలోనూ లైయన్తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో రెండో మ్యాచ్ జూన్ 28న లండన్లోని లార్డ్స్ మైదానంలో మొదలవుతుంది. మొదటి టెస్టులో విజయ తీరాల వరకు వచ్చి చివర్లో బోల్తాపడిన ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఆసీస్కు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం