Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!
‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్తో ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ జట్లు కీలక సమయంలో బ్యాటర్ లేదా బౌలర్ను రంగంలోకి దింపి ఫలితాలను సాధిస్తున్నాయి. ఈ రూల్ వల్ల మైదానంలో 20 ఓవర్లపాటూ ఉండాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (IPL 2023) నుంచి కొత్తగా ‘ఇంపాక్ట్’ ప్లేయర్ రూల్ అమల్లోకి వచ్చింది. దీని ద్వారా అదనంగా బౌలర్/బ్యాటర్ను తీసుకొనే వెసులుబాటు జట్లకు లభించింది. ఈ రూల్తో కొందరు సీనియర్లు కేవలం బ్యాటింగ్కే పరిమితమైన సందర్భాలూ ఉన్నాయి. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు సారథి డుప్లెసిస్ కూడా ఇలాగే ‘ఇంపాక్ట్’గా ఆడినవారే. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ ధోనీ మాత్రం ఒక్కసారి కూడా ఇలా బరిలోకి దిగలేదు. అయితే, ఇదే చివరి సీజన్గా భావిస్తున్న తరుణంలో ‘ఇంపాక్ట్’ రూల్తో ధోనీ మరికొన్ని సంవత్సరాలు ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోచ్ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. కానీ, టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఆ వ్యాఖ్యలను సమర్థించలేదు. ధోనీకి (MS Dhoni) ఇలాంటి ఇంప్టాక్ రూల్ వర్తించదని పేర్కొన్నాడు. దానికిగల కారణాలనూ విశ్లేషించాడు. మరికొన్ని సీజన్లపాటు ఆటగాడిగా ధోనీ కొనసాగవచ్చని, ఇంప్లాక్ ప్లేయర్గా మాత్రం కాదని స్పష్టం చేశాడు.
‘‘40ల్లో క్రికెట్ ఆడటం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు అతడు కేవలం కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడు. మైదానంలోనూ వ్యూహాలను రచిస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ సీజన్లో చివరి రెండు ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఇప్పటి వరకు అతడు మొత్తం 40 నుంచి 50 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. అందుకే ధోనీకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదు. వర్తించదు కూడానూ. ఇప్పుడు అతడు ఆడుతోంది సీఎస్కేకు కెప్టెన్గా ఉండటానికి మాత్రమే. ఇంప్టాక్ రూల్ అనేది పూర్తిస్థాయిలో మైదానంలో లేకుండా బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికే వినియోగించుకుంటారు. కానీ, ధోనీ మాత్రం 20 ఓవర్లపాటు మైదానంలో ఫీల్డింగ్ చేస్తాడు. అతడు కెప్టెన్ కాకపోతే.. ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ఆడడు. అందుకే, భవిష్యత్తులో ధోనీని కోచ్ లేదా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిలో చూసే అవకాశం లేకపోలేదు’’ అని సెహ్వాగ్ వివరించాడు.
గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోనీ తన ఐపీఎల్ రిటైర్మెంట్ను ప్రకటిస్తాడనే ఊహాగానాలు పెద్దఎత్తున వస్తున్నాయి. కానీ, సీఎస్కే కోచ్ డ్వేన్ బ్రావో మాత్రం వాటన్నింటినీ కొట్టిపడేశాడు. వచ్చే సీజన్లో (IPL 2024) ధోనీ ఆడతాడా..? అనే ప్రశ్నకు ‘వందశాతం. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో ఆడతాడు. తన కెరీర్ను మరికొంతకాలం పొడిగిస్తాడు’ అని బ్రావో సమాధానం ఇచ్చాడు. మరి కెప్టెన్ కూల్ ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు