Virender sehwag: క్రిప్టో కరెన్సీ కన్నా వేగంగా టీమ్ ఇండియా ఫామ్ను కోల్పోతోంది: వీరేంద్ర సెహ్వాగ్
బంగ్లాదేశ్(Bangladesh)పై రెండో వన్డేలో టీమ్ఇండియా(Team india) ఓటమిపై వీరేంద్ర సెహ్వాగ్(Virender sehwag) స్పందించాడు. ఇప్పటికైనా జట్టు మేల్కోవాల్సిన అవసరం ఉందన్నాడు.
దిల్లీ: బంగ్లా(Bangladesh)తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2తో టీమ్ఇండియా(Team india) సిరీస్(Ind vs Ban 2022)ను కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లా టెయిలెండర్ మెహదీ హసన్ మిరాజ్ చిరస్మరణీయ శతకం, పేలవమైన బ్యాటింగ్ కలగలిసి ఈ మ్యాచ్లో 5 పరుగుల తేడాతో టీమ్ఇండియాకు ఓటమిని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender sehwag) జట్టు ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘క్రిప్టో కరెన్సీ కన్నా వేగంగా టీమ్ఇండియా ఫామ్ను కోల్పోతోంది. మార్పులకు, మేల్కొలుపు ఇప్పుడు చాలా అవసరం’’ అంటూ ట్వీట్ చేశాడు.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ముంగిట భారత్కు ఈ సిరీస్ కీలకంగా మారింది. అయితే, 50వ ఓవర్ చివరి బంతికి భారత్కు సిక్స్ అవసరం కాగా.. ముస్తాఫిజుర్ కట్టుదిట్టమైన బౌలింగ్తో బంగ్లాకు విజయాన్నందించాడు. ఈ సిరీస్లో బంగ్లా విజయం సాధించింది. గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ చివరి వన్డేతో పాటుగా రానున్న రెండు టెస్టులకు దూరమయ్యాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్ ఖాన్
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్లైన్లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు