Wasim Akram: మొత్తం మార్చాలి..
భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ పాకిస్థాన్ జట్టుపై ఆ జట్టు మాజీలు విరుచుకుపడుతున్నారు. భారత్ చేతిలో ఓడిపోవడం కంటే.. ఓడిన తీరే బాధ కలిగించిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు.
పాక్ జట్టుపై వసీమ్ అక్రమ్
కరాచి: భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ పాకిస్థాన్ జట్టుపై ఆ జట్టు మాజీలు విరుచుకుపడుతున్నారు. భారత్ చేతిలో ఓడిపోవడం కంటే.. ఓడిన తీరే బాధ కలిగించిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. ‘‘పాక్ క్రికెట్కు ఇదో బాధాకరమైన రోజు. ఆటలో గెలుపు ఓటములు సహజమే. కానీ ఆడిన తీరు ముఖ్యం. జట్టులో అసలేమవుతోందో పీసీబీనే చెప్పాలి. ఇప్పటిదాకా జరిగింది చాలు. పాక్ జట్టులో కనీసం ఆరేడుగురు ఆటగాళ్లను మార్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అప్పుడూ ఓటమే ఎదురైనా కొత్తవాళ్లతో ఓడిపోయాం అనైనా అనుకోవచ్చు. కనీసం వాళ్లతోనైనా పోరాటం చేసే జట్టును తయారు చేసుకోవచ్చు’’ అని అక్రమ్ సూచించాడు.
శస్త్ర చికిత్స చేయాల్సిందే... పీసీబీ: టీ20 ప్రపంచకప్లో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టుకు పెద్ద శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వి అన్నాడు. ‘‘విజయాల బాట పట్టాలంటే పాక్ జట్టుకు పెద్ద శస్త్ర చికిత్స అవసరం. అమెరికా చేతిలో కంగుతిన్న బాధ నుంచి తేరుకోముందే.. భారత్ చేతిలో పరాభవం ఎదురైంది. ఎందుకు పాక్ సరిగా ఆడట్లేదని అంతా అడుగుతున్నారు. ఈ విషయంపై చర్చ జరగాలి’’ అని నఖ్వి తెలిపాడు.
ఇమాద్ కావాలనే చేశాడు: భారత్తో మ్యాచ్లో కీలక సమయంలో ఇమాద్ వసీమ్ కావాలనే బంతులను వృథా చేశాడని పాక్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ ఆరోపించాడు. ‘‘ఇమాద్ ఇన్నింగ్స్ చూడండి.. అతడు 23 బంతులు ఆడి 15 పరుగులే చేశాడు. కావాలనే బంతులు వృథా చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఛేదన చాలా క్లిష్టంగా మారింది’’ అని మాలిక్ అన్నాడు. ‘‘సారథి అంటే అందరిని ఐక్యంగా ఉంచాలి. లేకపోతే జట్టు వాతావరణం దెబ్బ తింటుంది. అజామ్తో మిగిలిన ఆటగాళ్లకు పొసగనట్లు కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్ ముగిశాక ఈ విషయంపై మరింత బహిరంగంగా మాట్లాడతా’’ అని అఫ్రిది అన్నాడు. పాక్ ఓటమిపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్