IND vs AUS: అంపైర్కు తగిలిన బంతి.. ఆసీస్ కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఆసీస్ (AUS)తో జరిగిన ఐదో టీ20లో భారత్ (IND) ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్ను టీమ్ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియా విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ మొదటి నాలుగు బంతుల్లో ఒకే పరుగు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఈ దశలో ఐదో బంతిని ఎదుర్కొన్న నాథన్ ఎలిస్ నేరుగా ఆడాడు. బంతిని అర్ష్దీప్ ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ క్రమంలో బంతి వికెట్ల వెనక ఉన్న అన్ ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మకు తగిలింది. అయితే, బంతి అంపైర్కు తగలకపోతే బౌండరీ వెళ్లే అవకాశం ఉండేది. అంపైర్కు తగిలి బంతి ఆగిపోవడంతో ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ (Matthew Wade) అసంతృప్తికి లోనయ్యాడు. ఆ సమయంలో వేడ్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అశ్విన్ రికార్డును సమం చేసిన రవి బిష్ణోయ్
ఆసీస్తో ఐదు టీ20ల సిరీస్లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) సత్తాచాటాడు. ఈ సిరీస్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి స్వదేశంలో ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ సరసన చేరాడు. 2016లో శ్రీలంకపై అశ్విన్ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆసీస్తో చివరి టీ20లో బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ అనంతరం బిష్ణోయ్ మాట్లాడాడు. ‘‘ఈ సిరీస్ మొదటి మ్యాచ్లో నేను పేలవ ప్రదర్శన చేశాను. ఆ తర్వాత నా ప్రణాళిక ప్రకారం వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేయడంపైనే దృష్టిపెట్టాను. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ విషయానికొస్తే అక్కడ పిచ్లు, వాతావరణం భిన్నంగా ఉంటాయి. వీలైనంత త్వరగా ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తా’’ అని బిష్ణోయ్ అన్నాడు. త్వరలో టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబరు 10 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్కు రవి బిష్ణోయ్ ఎంపికైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..