Virender Sehwag: సచిన్ను మోయడమా.. మా వల్ల కాదన్నాం: సెహ్వాగ్
2011 ప్రపంచకప్ ఫైనల్స్ నాటికి తాము వృద్ధులమైపోయామని సెహ్వాగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. అప్పట్లో జరిగిన ఓ ఘటనను వెల్లడిస్తూ ఈ కామెంట్లు చేశాడు.
ఇంటర్నెట్డెస్క్: ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ నిర్వహణకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఈసారి స్వదేశంలో జరుగనున్న మెగా టోర్నీని గెలిచి.. సుదీర్ఘకాలంగా ఉన్న ఐసీసీ ట్రోఫీల కొరతను తీర్చాలని టీమ్ఇండియా అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 2011లో ధోనీ నేతృత్వంలో రెండోసారి ప్రపంచకప్ను నెగ్గిన నాటి క్షణాలను మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పంచుకున్నాడు.
భారత్ విజేతగా నిలిచిన వెంటనే.. మైదానంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. సచిన్ను ఏకంగా భుజాలకెత్తుకొని మైదానం మొత్తం కలియదిరిగారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర ఘటనను సెహ్వాగ్(Virender Sehwag) తాజాగా వెల్లడించాడు. అప్పట్లో తాము మాస్టర్బ్లాస్టర్ను భుజాలపై ఎక్కించుకోకపోవడానికి కారణముందని తెలిపాడు.
‘‘సచిన్ చాలా బరువు ఉంటాడు. మేం ముసలోళ్లం..(నవ్వుతూ) మాకు భుజాల నొప్పులున్నాయి.. ధోనీకి మొకాలి గాయం ఉంది. మరికొందరు ఆటగాళ్లకు మరికొన్ని సమస్యలున్నాయి. అందుకే.. ఆ భారాన్ని యువ ఆటగాళ్లకు వదిలేశాం. మీరెళ్లి సచిన్ను ఎత్తుకొని మైదానంలో రౌండ్ కొట్టి రండి అని చెప్పాం. అందుకే విరాట్ అతడిని మోశాడు’’ అని సరదాగా వీరు వెల్లడించాడు. ఐసీసీ వరల్డ్కప్ 2023 షెడ్యూలింగ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
2011 ప్రపంచకప్లో సచిన్ అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నిలో అతడు 9 మ్యాచ్ల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేశాడు. మరోవైపు సెహ్వాగ్ 8 మ్యాచ్ల్లో 380 పరుగులు సాధించాడు. ఇక టోర్నీ మొత్తంలో యువరాజ్ చెలరేగిపోయాడు. తొమ్మిది మ్యాచ్లకు గాను 8 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 362 పరుగులు సాధించాడు.. ఇక బౌలింగ్లో కూడా 14 వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!