West Indies Cricket: టీ20లంటే పూనకమే... పొట్టి క్రికెట్ ప్రమాదకారి విండీస్
వన్డేల్లో గొప్పగా రాణించలేకపోతున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies).. పొట్టి ఫార్మాట్లో మాత్రం తిరుగులేదని చాటి చెబుతోంది. తాజాగా భారత్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
వన్డే ప్రపంచకప్ను రెండుసార్లు గెలుచుకున్న ఘన చరిత్ర ఉన్న వెస్టిండీస్ (West Indies).. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి అర్హత కూడా సాధించలేకపోయింది. ఈ ఫార్మాట్లో చాలా ఏళ్లుగా ఆ జట్టుది పేలవ ప్రదర్శనే. ఇక టెస్టుల్లో కరీబియన్ జట్టు ఆట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇటీవలే భారత్ చేతిలో రెండు టెస్టుల సిరీస్లో చిత్తుగా ఓడింది. కానీ ఇదే జట్టు టీ20లకు వచ్చేసరికి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. మేటి జట్లకు కూడా దీటుగా బదులిస్తుంది. తాజాగా టీమ్ఇండియాను 3-2తో సునాయాసంగా ఓడించి సిరీస్ ఎగరేసుకుపోయింది విండీస్. పొట్టి క్రికెట్లో కరీబియన్ జట్టు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ సిరీస్ రుజువుగా నిలిచింది.
క్రికెట్లో ఒక జట్టు బలంగా ఉంది, మెరుగైన ప్రదర్శన చేస్తోంది అంటే.. దానికి ఫార్మాట్తో సంబంధం ఉండదు. టెస్టులైనా, వన్డేలైనా, టీ20లైనా.. ఆడేది క్రికెట్టే. ఫార్మాట్లను బట్టి ఆటలో కొంచెం మార్పు ఉండొచ్చు కానీ.. వెస్టిండీస్ అంత వైరుధ్యం మరే జట్టులోనూ కనిపించదు. ఇటీవలి భారత్తో సిరీస్ విషయానికే వస్తే.. టెస్టు సిరీస్లో రెండు మ్యాచ్ల్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘోర పరాభవం చవిచూసిన ఆతిథ్య జట్టు.. రెండో టెస్టులో కూడా భారీ ఓటమి ముంగిట నిలిచినా వర్షం వల్ల గట్టెక్కింది. వన్డే సిరీస్లోనూ భారతే 2-1తో పైచేయి సాధించింది. కానీ టీ20లకు వచ్చేసరికి కరీబియన్ జట్టుదే ఆధిపత్యం.
తొలి రెండు టీ20ల్లో ఆ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. ఆ ఊపు చూస్తే సిరీస్లో భారత్ ఒక్క మ్యాచ్ అయినా గెలవగలదా అనిపించింది. ఐతే 3, 4 టీ20ల్లో పుంజుకుని విజయం సాధించి సిరీస్పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ చివరి టీ20లో మాత్రం విండీస్ అలవోకగా విజయం సాధించి సిరీస్ను ఎగరేసుకుపోయింది. వన్డే ప్రపంచకప్నకు అర్హత కూడా సాధించలేకపోయిన వెస్టిండీస్ చేతిలో టీ20 సిరీస్ ఓడిపోవడం దారుణం అంటూ వెంకటేష్ ప్రసాద్ లాంటి వాళ్లు విమర్శించారు కానీ.. పొట్టి క్రికెట్లో కరీబియన్ జట్టు చాలా ప్రమాదకరం అని దశాబ్ద కాలంగా ఆ జట్టు ఆట చూస్తున్న వాళ్లకు అర్థమయ్యే ఉంటుంది.
రెండుసార్లు ఛాంపియన్
గత ఏడాది టీ20 ప్రపంచకప్లో గెలిచి ఈ ట్రోఫీని రెండుసార్లు గెలిచిన జట్టుగా ఘనతను అందుకుంది ఇంగ్లాండ్. ఐతే అంతకంటే ముందు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ సాధించిన ఏకైక జట్టు వెస్టిండీస్ మాత్రమే. ఓవైపు టెస్టులు, వన్డేల్లో పేలవ ప్రదర్శన చేస్తూనే.. 2012, 2016లో రెండుసార్లు పొట్టి కప్పును సొంతం చేసుకుంది. జీతాలు, కాంట్రాక్టులకు సంబంధించి బోర్డుతో ఆటగాళ్ల గొడవ పుణ్యమా అని గత దశాబ్ద కాలంలో వెస్టిండీస్ క్రికెట్ ప్రమాణాలు బాగా పడిపోయాయి. చాలామంది నాణ్యమైన ఆటగాళ్ల సేవలను వెస్టిండీస్ కోల్పోయింది.
వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడాన్ని ఆటగాళ్లు గర్వకారణంగా భావించే రోజులు ఎప్పుడో పోయాయి. ఇది టెస్టులు, వన్డేల్లో వెస్టిండీస్ పతనానికి దారి తీసింది. కానీ టీ20ల్లో మాత్రం ఇప్పటికీ వెస్టిండీస్ బలమైన జట్టే. అందుక్కారణం.. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల్లో ఆడుతూ ఆ జట్టు ఆటగాళ్లు రాటుదేలడమే. ఐపీఎల్ సహా ప్రధాన టీ20 లీగ్లు అన్నింట్లోనూ వెస్టిండీస్ ఆటగాళ్లకు మంచి డిమాండ్ ఉంది. పూరన్, రసెల్, నరైన్, హోల్డర్, కైల్ మేయర్స్, రొమారియో షెఫర్డ్.. ఇలా టీ20 లీగ్ల్లో మెరుస్తున్న కరీబియన్ ఆటగాళ్ల జాబితా పెద్దదే.
బాదమంటే సరే.. నిలవమంటే కష్టం
ప్రపంచవ్యాప్తంగా 20లకు తోడు టీ10 లీగ్ల్లోనూ వెస్టిండీస్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పొట్టి క్రికెట్కు బాగా అలవాటు పడ్డ ఆ దేశ ఆటగాళ్లు తొలి బంతి నుంచి సిక్సర్లతో విరుచుకుపడమంటే సిద్ధంగా ఉంటారు. పూరన్, రసెల్ లాంటి వాళ్లు బౌలర్లపై ఎలా విరుచుకుపడతారో తెలిసిందే. కానీ కాసేపు క్రీజులో నిలబడి ఆచితూచి ఆడమంటే మాత్రం కరీబియన్ క్రికెటర్లకు చాలా కష్టమైపోతుంది. అందుకే అయిదు రోజులు ఆడాల్సిన టెస్టులు ఆ జట్టు ఆటగాళ్లకు సవాలుగా మారుతున్నాయి. ఒకట్రెండు సెషన్లు నిలబడి ఆడాలంటే శక్తికి మించి పనే అవుతోంది. బౌలర్లు కూడా సుదీర్ఘ స్పెల్స్ వేయలేకపోతున్నారు. టెస్టుల సంగతలా ఉంచితే.. 50 ఓవర్లు సాగే వన్డేల్లో కూడా కరీబియన్ క్రికెటర్లు నిలవలేకపోతున్నారు.
ఫలితమే.. ప్రపంచకప్ కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి వచ్చింది. అందులో కూడా స్కాట్లాండ్, నెదర్లాండ్స్ లాంటి జట్ల చేతిలో ఓడి ఈ మెగా టోర్నీకి దూరమైంది వెస్టిండీస్. భారత్తో సిరీస్లోనూ టెస్టులు, వన్డేల్లో నిలవలేకపోయింది. కానీ టీ20లకు వచ్చేసరికి తన సత్తాను చాటింది. టీ20ల్లో కూడా గత కొన్నేళ్లలో డ్వేన్ బ్రావో, పొలార్డ్, రసెల్ లాంటి మేటి ఆటగాళ్ల సేవలను కోల్పోయినా.. ఆ జట్టు బలహీన పడిపోలేదు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే ఈ ఫార్మాట్లో సత్తా చాటుతోంది. మేయర్స్, షెఫర్డ్, హోల్డర్, రోమన్ పావెల్, రోస్టన్ చేజ్.. ఇలా బోలెడంత మంది ఆల్రౌండర్లు ఆ జట్టు సొంతం. కింది వరుసలో ఆడే అకీల్ హొసీన్, అల్జారి జోసెఫ్ లాంటి బౌలర్లు కూడా ధాటిగా బ్యాటింగ్ చేయగలరు. ఈసారి వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించకపోయినా.. వచ్చే ఏడాది జరిగే పొట్టి కప్పులో మాత్రం కరీబియన్ జట్టు గట్టి పోటీదారుగానే బరిలోకి దిగబోతోంది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్