ఐపీఎల్లో విరాట్ - గంభీర్ ఎపిసోడ్.. దూకుడు ఎప్పుడూ మంచిదే: కేల్ మేయర్స్
విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్లోనూ చూశాం. వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కేల్ మేయర్స్ కూడా ఐపీఎల్లో ప్రత్యక్షంగా విరాట్ దూకుడు రుచి చూశాడు.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ (Virat - Gambhr) వాగ్వాదం.. గత ఐపీఎల్లో హాట్ టాపిక్గా మారిన సంఘటన. ఇప్పటికీ అభిమానుల మదిలో అలాగే ఉండిపోయింది. మరి అలాంటి సంఘటనలో ప్రత్యక్షంగా ఉన్న ఆటగాడు కేల్ మేయర్స్. ప్రస్తుతం భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో కేల్ మేయర్స్ ఆడుతుండగా.. విరాట్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో చోటు చేసుకున్న సంఘటనపై తాజాగా కేల్ మేయర్స్ స్పందించాడు.
ఈ నాలుగే సెమీస్కు.. టీమ్ఇండియాలో ఆ సీనియర్ ఉండాల్సిందే
‘‘ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో వాగ్వాదం జరిగింది కదా. ఆ మ్యాచ్ సందర్భంగా విరాట్ దూకుడు గురించి నువ్వేమి అనుకుంటున్నావు?’’ అని కేల్ మేయర్స్ను రిపోర్టర్ ప్రశ్నించాడు.
‘‘ప్రత్యర్థితో కొన్నిసార్లు ఇలా ప్రవర్తించడం అవసరం. మ్యాచ్ సందర్భంగా పైచేయి సాధించాలంటే దూకుడుగా ఉండాలి. అందుకే, దూకుడుగా ఉండే స్వభావం ఎప్పుడూ మంచిదే. జట్టు విజయం సాధించేలా సహచరుల్లో ధైర్యం నూరిపోయడానికి అది ఉపయోగపడుతుంది’’ అని మేయర్ వ్యాఖ్యానించాడు.
ఇదీ జరిగింది..
ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్నవూ సూపర్ జెయింట్స్ మ్యాచ్ అనంతరం కేల్ మేయర్స్, విరాట్ కోహ్లీతో ఏదో మాట్లాడుతుండగా.. ఎల్ఎస్జీ మెంటార్ గౌతమ్ గంభీర్ వచ్చి మేయర్స్ను పక్కకు తీసుకెళ్లాడు. అనంతరం గంభీర్ - కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం గంభీర్, విరాట్ కోహ్లీపై 100 శాతం మ్యాచ్ ఫీజ్లో కోత విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.