ఐపీఎల్లో విరాట్ - గంభీర్ ఎపిసోడ్.. దూకుడు ఎప్పుడూ మంచిదే: కేల్ మేయర్స్
విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్లోనూ చూశాం. వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కేల్ మేయర్స్ కూడా ఐపీఎల్లో ప్రత్యక్షంగా విరాట్ దూకుడు రుచి చూశాడు.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ - గౌతమ్ గంభీర్ (Virat - Gambhr) వాగ్వాదం.. గత ఐపీఎల్లో హాట్ టాపిక్గా మారిన సంఘటన. ఇప్పటికీ అభిమానుల మదిలో అలాగే ఉండిపోయింది. మరి అలాంటి సంఘటనలో ప్రత్యక్షంగా ఉన్న ఆటగాడు కేల్ మేయర్స్. ప్రస్తుతం భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో కేల్ మేయర్స్ ఆడుతుండగా.. విరాట్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో చోటు చేసుకున్న సంఘటనపై తాజాగా కేల్ మేయర్స్ స్పందించాడు.
ఈ నాలుగే సెమీస్కు.. టీమ్ఇండియాలో ఆ సీనియర్ ఉండాల్సిందే
‘‘ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో వాగ్వాదం జరిగింది కదా. ఆ మ్యాచ్ సందర్భంగా విరాట్ దూకుడు గురించి నువ్వేమి అనుకుంటున్నావు?’’ అని కేల్ మేయర్స్ను రిపోర్టర్ ప్రశ్నించాడు.
‘‘ప్రత్యర్థితో కొన్నిసార్లు ఇలా ప్రవర్తించడం అవసరం. మ్యాచ్ సందర్భంగా పైచేయి సాధించాలంటే దూకుడుగా ఉండాలి. అందుకే, దూకుడుగా ఉండే స్వభావం ఎప్పుడూ మంచిదే. జట్టు విజయం సాధించేలా సహచరుల్లో ధైర్యం నూరిపోయడానికి అది ఉపయోగపడుతుంది’’ అని మేయర్ వ్యాఖ్యానించాడు.
ఇదీ జరిగింది..
ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్నవూ సూపర్ జెయింట్స్ మ్యాచ్ అనంతరం కేల్ మేయర్స్, విరాట్ కోహ్లీతో ఏదో మాట్లాడుతుండగా.. ఎల్ఎస్జీ మెంటార్ గౌతమ్ గంభీర్ వచ్చి మేయర్స్ను పక్కకు తీసుకెళ్లాడు. అనంతరం గంభీర్ - కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం గంభీర్, విరాట్ కోహ్లీపై 100 శాతం మ్యాచ్ ఫీజ్లో కోత విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే