Bangalore: బెంగళూరు ప్లేఆఫ్స్ బెర్తు తేడా కొడుతోంది.. ఎందుకో తెలుసా?
భారత టీ20 లీగ్లో బెంగళూరు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా మారేటట్లు కనిపిస్తున్నాయి. గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో...
అయినా ఓ సులువైన మార్గం ఉంది..
భారత టీ20 లీగ్లో బెంగళూరు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా మారేటట్లు కనిపిస్తున్నాయి. గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఓడిపోవడమే అందుకు ప్రధాన కారణం. ఫా డుప్లెసిస్ టీమ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నా.. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి ఏ స్థానంలో నిలుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర జట్ల సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంటే బెంగళూరు అవకాశాలకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది.
బెంగళూరు ఇప్పుడెలా ఉంది..
డుప్లెసిస్ నాయకత్వంలో ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన బెంగళూరు మధ్యలో పలు వైఫల్యాలు చవిచూసింది. తర్వాత కొన్ని విజయాలు సాధించి మళ్లీ టాప్-4లోకి దూసుకొచ్చింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో చోటు దక్కించుకునేలా కనిపించింది. కానీ, గతరాత్రి పంజాబ్ చేతిలో ఓటమిపాలవ్వడంతో పరిస్థితులు మారాయి. ప్రస్తుతానికి టాప్-4లో ఉన్నా.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 13 మ్యాచ్ల్లో 7 విజయాలు, 6 ఓటములతో నిలవడంతో 14 పాయింట్లతో కొనసాగుతోంది. అయితే, ఇక్కడ నెట్రన్రేట్(-0.323)లో చాలా వెనుకపడిపోయింది. అది ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై (-0.181) కన్నా మరీ తక్కువగా ఉండటం గమనార్హం. దీంతో లీగ్ దశ ముగిసేసరికి.. పరిస్థితులు కఠినంగా మారి నాలుగో స్థానం కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి వస్తే రన్రేట్ విషయంలో బెంగళూరు కచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అది తప్పించుకోవాలంటే మిగిలి ఉన్న ఒకే ఒక్క మ్యాచ్లో సంచలన విజయం సాధించాలి.
ఇతర జట్లు ఎలా ఉన్నాయి..
గుజరాత్: హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ ప్రస్తుతం 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఆ జట్టు ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో.. రెండూ గెలిచినా 22 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో అగ్రస్థానంతోనే ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకుంటుంది. ఒకవేళ ఒకటి ఓడి.. ఒకటి గెలిచినా 20 పాయింట్లతో నిలుస్తుంది. లేదా దురదృష్టంకొద్దీ రెండూ ఓడినా ఇప్పటికే 18 పాయింట్లు సాధించడంతో బెర్తు కచ్చితంగా ఉంటుంది.
లఖ్నవూ: కేఎల్ రాహుల్ సారథ్యంలోని లఖ్నవూ ప్రస్తుతం 8 విజయాలతో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు కూడా ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో.. రెండూ గెలిస్తే 20 పాయింట్లు సాధించనుంది. ఒకవేళ ఒక్కటి గెలిచినా 18 పాయింట్లతో నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. పరిస్థితులు ఎదురుతన్ని రెండూ ఓడినా 16 పాయింట్లతో ఉంటుంది. అలాంటప్పుడు లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి కచ్చితంగా మూడు లేదా నాలుగో స్థానమైనా ఎక్కడికీ పోదు.
రాజస్థాన్: సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ ఈ సీజన్లో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలు, 5 ఓటములతో 14 పాయింట్లు సాధించి బెంగళూరుతో సమానంగా ఉంది. అయితే, రన్రేట్ మెరుగ్గా ఉండటంతో మూడులో నిలిచింది. ఈ జట్టు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో తనకన్నా తక్కువ పాయింట్లు, రన్రేట్లో వెనుకపడిపోయిన దిగువ స్థానాల్లో నిలిచిన జట్లకన్నా రాజస్థాన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో నిలుస్తుంది. ఒకవేళ ఒకటి ఓడినా 16 పాయింట్లు కచ్చితంగా ఉంటాయి. ఎలాగూ రన్రేట్ పరంగా బాగుండటంతో మంచి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
దిల్లీ: రిషభ్పంత్ ఈసారి దిల్లీని అంత మెరుగ్గా నడిపించలేకపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి కష్టపడుతోంది. ఒక గెలుపు, ఒక ఓటమి లెక్కన కొనసాగుతూ ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములతో నిలిచింది. దీంతో 12 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, రన్రేట్లో దిల్లీ (0.210).. బెంగళూరు (-0.323) కన్నా మెరుగ్గా.. రాజస్థాన్ (0.228) కాస్త తక్కువగా ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్లు కష్టపడి గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఒకటి గెలిచి, ఒకటి ఓడితే పరిస్థితి ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.
పంజాబ్: మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ గతరాత్రి బెంగళూరుపై విజయం సాధించడంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో దిల్లీ లాగే 6 గెలిచి, 6 ఓటములపాలై 12 పాయింట్లతోనే ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇది కూడా ఫర్వాలేదనిపించే రన్రేట్ (0.023) కలిగి ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే 3 లేదా 4 స్థానాల్లో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. అది కూడా ఇతర జట్లతో సమానంగా నిలవకుండా ఉంటేనే. ఒకవేళ నిలిచినా రన్రేట్ మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్: కేన్ విలియమ్సన్ టీమ్ హైదరాబాద్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 5 విజయాలు, 6 ఓటములతో 10 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. అయితే, ఆడాల్సినవి ఇంకా మూడు మ్యాచ్లు ఉండటంతో అన్నీ గెలిస్తే ప్లేఆఫ్స్లో చోటు దక్కే అవకాశం ఉంది. కానీ, హైదరాబాద్ ఇటీవల వరుసగా నాలుగు మ్యాచ్లు ఓటమిపాలవ్వడంతో ఇకపై వరుసగా మూడు గెలవడం అత్యంత కష్టమనే చెప్పాలి. విలియమ్సన్ టీమ్ ఏదైనా అద్భుతం చేసి విశేషంగా రాణిస్తే కనీసం నాలుగో స్థానంలోనైనా చోటు దక్కే వీలుంది.
కోల్కతా: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్కతా ఈసారి అంత ప్రభావవంతంగా లేదు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 5 విజయాలు, 7 ఓటములతో 10 పాయింట్లు సాధించి 8 స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఆ జట్టుకు ఇంకా టెక్నికల్గా పోటీలో అవకాశం ఉంది. అయితే, కోల్కతా మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించినా 14 పాయింట్లతోనే నిలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాజస్థాన్, బెంగళూరు జట్లు14 పాయింట్లతో కొనసాగుతుండటంతో ఈ జట్టు అవకాశాలు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలా కాకపోయినా రన్రేట్ పరంగా దిల్లీ, పంజాబ్, హైదరాబాద్లతో పోటీపడి మరీ నెగ్గాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే బెంగళూరుకు.. దిల్లీ, పంజాబ్ జట్ల నుంచే ప్రధానంగా పోటీ ఉంది. హైదరాబాద్, కోల్కతాలతోనూ పోటీ ఉన్న ప్రస్తుతం ఆ జట్ల పరిస్థితులు చూస్తుంటే టాప్-4లో చోటు దక్కించుకోవడం అంత తేలిక కాదు. మరోవైపు బెంగళూరు తేలిగ్గా ప్లేఆఫ్స్ చేరాలన్నా ఇంకో సులువైన మార్గం ఉంది. అదేంటంటే.. ఇప్పుడు టాప్-3లో ఉన్న గుజరాత్, లఖ్నవూ, రాజస్థాన్ తలా ఒక్కో మ్యాచ్ గెలిచినా.. అవి వరుసగా 20, 18, 16 పాయింట్లు సాధిస్తాయి. దీంతో మూడు స్థానాలు భర్తీ అయిపోతాయి. అలాగే బెంగళూరు కన్నా తక్కువ స్థానాల్లో ఉన్న దిల్లీ, పంజాబ్, హైదరాబాద్, కోల్కతా ఒక్కో మ్యాచ్ ఓడిపోయినా బెంగళూరుకే కలిసివస్తుంది. అప్పుడు ఆ జట్టు మిగిలిన ఏకైక మ్యాచ్లో విజయం సాధించాలి. ఒకవేళ భారీ విజయం సాధిస్తే ఇంకా మంచిది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై ఛీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి