Bengaluru Vs Punjab: సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?
ఐపీఎల్లో బెంగళూరు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్తో తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచులు ముగిశాయి. విజేతలుగా నిలిచిన జట్ల సొంత మైదానాల్లోనే ఇవి జరగడం విశేషం. ఇవాళ బెంగళూరు - పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హోమ్ గ్రౌండ్లో విక్టరీ ఆనవాయితీని బెంగళూరు కొనసాగిస్తుందో.. లేదో చూడాలి!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై జట్టుతో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ అత్యుత్తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. స్టార్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడలేదు. కెప్టెన్ డుప్లెసిస్, దినేశ్ కార్తిక్, అనుజ్ రావత్ రాణించడంతో చెన్నై ముందు 170+ స్కోరును లక్ష్యంగా నిర్దేశించింది. భారీ మొత్తం వెచ్చించి ముంబయి నుంచి తీసుకున్న కామెరూన్ గ్రీన్ (18: 22 బంతుల్లో) నాణ్యమైన క్రికెట్ ఆడలేకపోయాడు. ప్రపంచ కప్లో ఆసీస్ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్ మ్యాక్స్వెల్ (0) తొలి మ్యాచ్లో డకౌట్గా పెవిలియన్కు చేరాడు. అతడితోపాటు రజత్ పటీదార్ కూడా సున్నాకే ఔటయ్యాడు. వీరిద్దరూ రెండో మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు 84 మ్యాచ్లు ఆడి 39 మ్యాచుల్లో గెలిచింది. మరో 40 మ్యాచుల్లో ఓడింది. ఐదు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
బౌలింగ్ మెరుగైతేనే..
చెన్నై పిచ్ బౌలర్లకు కాస్త సహకారం అందిస్తుంది. అలాంటి పిచ్పైనా బెంగళూరు బౌలర్లు విఫలం కావడం ఆ జట్టును ఆందోళన కలిగించే అంశమే. ఇక బెంగళూరు పిచ్ బ్యాటింగ్కే అనుకూలం. పైగా చిన్న పిచ్ కావడంతో బౌలర్లు విభిన్నంగా సంధించాల్సి ఉంటుంది. సిరాజ్, అల్జారీ జోసెఫ్, కామెరూన్ గ్రీన్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్ భారీగా పరుగులు సమర్పించకుండా ఉండాలి. తొలి మ్యాచ్లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన మ్యాక్స్వెల్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మయాంక్ దగర్ కూడా 2 ఓవర్లలో 6 రన్స్ ఇచ్చినప్పటికీ.. పూర్తి ఓవర్ల కోటాను వేయించకపోవడం గమనార్హం. బౌలింగ్ వనరులను సరైన పద్ధతిలో వినియోగించుకోవడమూ అవసరమే.
పంజాబ్ను కాపాడిన కరన్, లివింగ్స్టోన్
దిల్లీతో మ్యాచ్లో పంజాబ్ ఒక సమయంలో ఓటమి దిశగా సాగింది. కానీ, సామ్కరన్ (63), లివింగ్స్టోన్ (38) కీలక ఇన్నింగ్స్తో గట్టెక్కించారు. గత రెండు సీజన్లలో విఫలమైన కరన్ మంచి ఫామ్ అందుకోవడం పంజాబ్కు సానుకూల అంశం. కెప్టెన్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇక జానీ బెయిర్ స్టోకు (9) కలిసిరాలేదు. మూడు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అతడు రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. కొత్తగా వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన జితేశ్ శర్మ తేలిపోయాడు. దాదాపు రూ.11 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకున్న హర్షల్ పటేల్ బౌలింగ్లో గొప్ప ప్రదర్శన చేయలేదు. రెండు వికెట్లు తీసినా 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించాడు. అయితే, చిన్నస్వామి మైదానంపై పూర్తి అవగాహన అతడికి ఉంది. గతంలో బెంగళూరు తరఫున ఆడిన అనుభవం పటేల్ సొంతం.
తుది జట్లు (అంచనా)
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దగర్, కర్ణ్ శర్మ, సిరాజ్
పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కరన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం