IND vs ENG: వైజాగ్ టెస్టు.. ‘ఫైనల్ XI’లో ఊహించని మార్పులుంటాయా..?
ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు (IND vs ENG) ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. ఇప్పటికే ఇరు జట్లూ వైజాగ్ చేరుకుని ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 0-1తో వెనుకబడి ఉంది.
తొలి టెస్టులో ఊహించని పరాజయం మూటగట్టుకున్న భారత్కు రెండో టెస్టు (IND vs ENG) ప్రారంభం కాకముందే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు జట్టుకు దూరమవ్వగా... ఫైనల్ 11లో ఎవరు అనే ప్రశ్న మరొకటి. సిరీస్లో మరింత వెనకబడిపోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్లో విజయం అత్యవసరం. దీంతో ఈ సారి ఊహించని మార్పులు ఉంటాయి అని అంటున్నారు.
బ్యాటర్లు ఎవరు?
హైదరాబాద్ టెస్టులో స్పిన్ ఆల్రౌండర్లతో కలిపి మొత్తం 9 మంది బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగింది. కానీ, లక్ష్య ఛేదనలో ఒకరిద్దరే రాణించారు. దీంతో పరాజయం మూటగట్టుకుంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో కుదురుకోవడానికే ఇబ్బందిపడ్డారు. వైజాగ్ టెస్టులో వీళ్లిద్దరూ రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిడిలార్డర్లో రాణించిన కేఎల్ రాహుల్ గాయపడి దూరమయ్యాడు. అతని స్థానంలో ఎవరొస్తారు అనేదే ప్రశ్న. అతడి స్థానంలో రజత్ పటీదార్ ఆడే అవకాశాలే ఎక్కువ అంటున్నా... సర్ఫరాజ్ ఎంట్రీని కొట్టిపారేయలేమని క్రికెట్ పరిశీలకులు అంటున్నారు. రోహిత్తో (Rohit Sharma) యశస్వి ఇన్నింగ్స్ను ప్రారంభించడంలో మార్పు ఉండకపోవచ్చు. ఇక నాలుగు, ఐదు స్థానాల సంగతి తేలడం అంత ఈజీగా లేదు. తొలి టెస్టులో ఆ స్థానంలో ఆకట్టుకున్న కేఎల్ లేకపోవడంతో శ్రేయస్ను ప్రమోట్ చేస్తారా లేక కొత్తవాళ్లతో ఊహించని ప్రయోగం చేస్తారా అనేది చూడాలి. ఇక వన్ అండ్ ఓన్లీ వికెట్ కీపింగ్ ఆప్షన్ శ్రీకర్ భరత్ ఎలాగూ ఉంటాడు.
నలుగురు స్పిన్నర్లతోనా?
విశాఖ టెస్టుకు నలుగురు స్పిన్నర్లతో ఆడటానికి కూడా రెడీ అని ఇంగ్లాండ్ కోచ్ మెక్కల్లమ్ అన్నాడు. పర్యటక జట్టే అలా అంటే... ఆతిథ్య జట్టు కూడా ఆ ఆలోచనలో ఉంది అనే అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే జట్టు యాజమాన్యం ఆలోచనలు చేస్తోందట. ఈ క్రమంలో స్టార్ పేసర్ సిరాజ్ను పక్కన పెడతారని అంటున్నారు. అతని స్థానంలోనూ స్పిన్నర్నే తీసుకుంటారని భోగట్టా. ఆ లెక్కన రవిచంద్రన్ అశ్విన్ సారథ్యంలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగొచ్చు. ఇక పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తొలి టెస్టు ఫామ్ను రెండో టెస్టులోనూ కొనసాగిస్తాడని టీమ్ ఆశిస్తోంది.
ఇదే చివరి అవకాశమా?
కోరి మరీ వన్డౌన్లో వస్తున్న గిల్ విఫలం కావడం.. మిడిలార్డర్లో జట్టును ఆదుకుంటాడని భావించిన శ్రేయస్ నిరాశపరచడం జట్టుకు తలనొప్పిగా మారుతోంది. దీంతో ఈ టెస్టు ప్రదర్శన చూసి వారి విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఉప్పల్ టెస్టులో గిల్ తొలి ఇన్నింగ్స్లో 23 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్గా పెవిలియన్కు చేరాడు. శ్రేయస్ మొదటి ఇన్నింగ్స్లో 63 బంతుల్లో 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు ఓవర్లపాటు ఆడి 13 పరుగులు చేశాడు. అయితే జట్టు విజయానికి అవి సరిపోని పరిస్థితి. జట్టులో స్థానం కోసం కుర్రాళ్లు పోటీ పడుతున్న వేళ వీరి ఆటతీరు ఇలానే కొనసాగితే... చివరి మూడు టెస్టుల స్క్వాడ్లో పేర్లు కనిపించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటీదార్/సర్ఫరాజ్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సుందర్/సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!