World Test Championship: ఇంగ్లాండ్పై పాక్ ఓటమి.. భారత్కు మేలే చేసింది..
తొలి టెస్టులో పాక్పై ఇంగ్లాండ్ గెలుపు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) పాయింట్ల పట్టికలో భారత్(Team India)కు మేలు చేసే విధంగా ఉంది.
ఇంటర్నెట్డెస్క్ : పరుగుల వరదలా సాగిన టెస్టులో పాకిస్థాన్(Pakistan)పై ఇంగ్లాండ్(England) చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 15 వందలకు పైగా పరుగులు నమోదైన ఈ టెస్టులో ఇంగ్లాండ్.. 74 పరుగుల తేడాతో పాక్పై గెలుపొందింది. అయితే.. ఈ విజయం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship)లో ఇంగ్లాండ్ జట్టుకు ప్రయోజనం కలిగించడమే కాకుండా.. పాయింట్ల పట్టికలో భారత్(Team India)కూ మేలే చేసింది.
ఈ టెస్టులో పాక్ అపజయంతో.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిఫ్ ఫైనల్ చేరే అవకాశాలు భారత్కు మరింత మెరుగయ్యాయి. ఎందుకంటే పాక్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోనే ఉంది. భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ భారత్, ఆసీస్ తమ తర్వాతి టెస్టు సిరీస్ల్లో విజయం సాధిస్తే.. బాబర్ అజామ్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు చేరుకోవడం క్లిష్టంగా మారుతుంది. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను టీమ్ఇండియా 2-0తో గెల్చుకుని.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్లు ఓడిపోకపోతే.. భారత్ టాప్ 2 ప్లేస్లో నిలిచే అవకాశం ఉంది.
అయితే ఇంగ్లాండ్తో సిరీస్లో ఇంకో రెండు మ్యాచ్లు ఉండటంతో.. పాక్ పుంజుకునేందుకూ అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి