Rishabh Pant: రిషభ్ పంత్ తడబడుతున్నాడా.. నడిపించలేకపోతున్నాడా?
రిషభ్ పంత్ గతేడాది భారత టీ20 లీగ్లో దిల్లీని అద్భుతంగా నడిపించి భవిష్యత్ టీమ్ఇండియా కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇటీవల అతడు ఆ నమ్మకాన్ని...
రిషభ్ పంత్ గతేడాది భారత టీ20 లీగ్లో దిల్లీని అద్భుతంగా నడిపించి భవిష్యత్ టీమ్ఇండియా కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇటీవల అతడు ఆ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి కొనితెచ్చుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన టీ20 లీగ్ 15వ సీజన్లో దిల్లీని 14 మ్యాచ్ల్లో ఏడింటిలోనే గెలిపించిన పంత్.. కనీసం ప్లేఆఫ్స్కు కూడా తీసుకెళ్లలేకపోయాడు. మరోవైపు ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టీ20ల్లోనూ టీమ్ఇండియాకు న్యాయం చేయలేకపోయాడు. దీంతో అతడు కెప్టెన్గా తడబడుతున్నాడా.. ? లేక నడిపించలేకపోతున్నాడా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తొలిసారి టీమ్ఇండియా..
ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్లో కెప్టెన్సీ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సారథి అంటే మైదానంలో చురుగ్గా ఉంటూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అవి కలిసి వస్తాయా లేదా అనే విషయాలు పక్కనపెడితే ఏదో చేద్దామని ప్రయత్నించి మరేదో విధంగా తడబాటుకు గురైతే ఫలితాలు ఇలాగే నిరాశకు గురిచేస్తాయి. పంత్ విషయంలో గత రెండు టీ20ల్లో అదే జరిగింది. దిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 211 పరుగుల భారీ స్కోర్ సాధించినా అంతపెద్ద లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే భారత జట్టు మునుపెన్నడూ ఇలా 200పైగా స్కోర్ సాధించిన సందర్భాల్లో ఓటమిపాలైంది లేదు. జట్టులో యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్కుమార్, అవేశ్ ఖాన్ లాంటి సత్తా కలిగిన బౌలర్లు ఉన్నా మ్యాచ్ గెలవలేకపోయింది.
పంత్ చేసిన తప్పులివే..
కెప్టెన్సీ పరంగా తొలి టీ20లో పలు వైఫల్యాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అందులో ఒకటి పవర్ప్లేలోనే ఐదుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించడం. భువీకి రెండు ఓవర్లు ఇచ్చిన పంత్.. అవేశ్ ఖాన్, చాహల్, హార్దిక్ పాండ్య, హర్షల్ పటేల్కూ తలో ఓవర్ అవకాశం ఇచ్చాడు. ఇదే జట్టు ఓటమికి ప్రధాన కారణంలా కనిపిస్తోంది. చాహల్ సహజంగా పవర్ప్లే తర్వాత బౌలింగ్ చేసి మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తాడు. అలాంటిది అతడికి పవర్ప్లేలోనే ఒక ఓవర్ ఇవ్వడం.. తర్వాత 8వ ఓవర్లో ఒకసారి ఇవ్వడం చూశాం. చివరికి మ్యాచ్ దక్షిణాఫ్రికా చేతిలోకి వచ్చాక 20వ ఓవర్లో మళ్లీ అవకాశం ఇచ్చాడు. అంటే 8 నుంచి 19 ఓవర్ల మధ్య చాహల్ లాంటి కీలక స్పిన్నర్ను పక్కనపెట్టాడు. అలాగే హార్దిక్ పాండ్యకు కూడా ఆదిలోనే పవర్ప్లేలో ఒకే ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు. కానీ, అతడు 18 పరుగులు సమర్పించుకోవడంతో తర్వాత పూర్తిగా పక్కనపెట్టాడు. దీంతో పంత్ ఇష్టమొచ్చిన విధంగా బౌలింగ్ చేయించి విఫలమయ్యాడని తెలుస్తోంది. దీంతో ఆట సాగుతున్న తీరుకు, బ్యాట్స్మెన్ ఆడుతున్న తీరుకు తగ్గ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టంగా కనిపిస్తోంది.
తప్పుల నుంచి నేర్చుకోలేదు..
ఇక రెండో టీ20లోనూ రిషభ్ పంత్ కెప్టెన్గా సరైన ప్రణాళికతో వచ్చినట్లు కనిపించలేదు. కటక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పిచ్ మందకొడిగా ఉండటంతో బ్యాట్స్మెన్కు కూడా ఆడటం ఇబ్బందిగా మారింది. పరుగుల పరంగా ఎలా ఉన్నా.. పంత్ తన తప్పుల నుంచి ఏమాత్రం నేర్చుకోలేదని ఇక్కడ తెలిసొచ్చింది. 149 పరుగుల మోస్తరు ఛేదనలో దక్షిణాఫ్రికా పవర్ప్లే ముగిసే సమయానికి 29/3తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో తెంబా బవుమా, క్లాసెన్ లాంటి ఇద్దరు కుడిచేతి బ్యాట్స్మెన్ క్రీజులో ఉన్నారు. అప్పుడు అక్షర్ పటేల్ వంటి ఎడమచేతి వాటం లెగ్స్పిన్నర్కు అవకాశం ఇవ్వకుండా పంత్ చాహల్, పాండ్యలకు అవకాశం ఇచ్చాడు. అంటే తొలి మ్యాచ్లో వీళ్లిద్దరికీ మధ్య ఓవర్లలో అవకాశం ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఇక్కడ సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు. కానీ, ఈ స్థితిలో ఏ కెప్టెన్ అయినా కుడిచేతి బ్యాట్స్మెన్కు ఎడమచేతి బౌలర్లను ఉపయోగిస్తారు. ఈ మ్యాచ్లో అక్షర్కు అవకాశం ఇచ్చేసేసరికి క్లాసెన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అలాగే బ్యాటింగ్లోనూ టీమ్ఇండియా 13 ఓవర్లకు 90/4తో కష్టాల్లో ఉన్నప్పుడు దినేశ్ కార్తీక్ లాంటి హిట్టర్ను కాకుండా అక్షర్ పటేల్ను ముందు పంపాడు. దీంతో చాలా మంది నెటిజన్లు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
తడబాటుకు గురవుతాడు..
అయితే, పంత్ తడబాటుకు గురవుతాడని, అనుభవం గడిచేకొద్దీ మెరుగవుతాడని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు. భారత టీ20 లీగ్ 15వ సీజన్లో దిల్లీ విఫలమైనా ఆ జట్టు కోచ్ రికీపాంటింగ్ పంత్ కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. అతడు కచ్చితంగా మెరుగవుతాడని గట్టి విశ్వాసం వ్యక్తం చేశాడు. మరోవైపు టీ20 లీగ్లో పంత్ కెప్టెన్సీని గమనించిన టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశాడు. మ్యాచ్లు కీలక సమయానికి వచ్చేసరికి ఈ యువ సారథి తడబాటుకు గురుతాడన్నాడు. అతడు అనుభవంతోనే కెప్టెన్గా మెరుగవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని లేదంటే మ్యాచ్లు కోల్పోతామని మాజీ బ్యాట్స్మన్ పార్థివ్ పటేల్ సైతం పంత్ కెప్టెన్సీపై పెదవి విరిచాడు. కీలక సమయాల్లో బ్యాట్స్మెన్కు తగ్గ బౌలర్లను వినియోగించుకోవాలని సూచించాడు. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖలో జరిగే మూడో టీ20లో టీమ్ఇండియా గెలవాలంటే పంత్ సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం