Virat Kohli: ‘విరాట్’ పర్వంలో విరామం.. కోహ్లీ ఎక్కడ?
గత దశాబ్దంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) లేకుండా భారత్ సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఒకటీ లేదా రెండు మ్యాచ్లకు దూరంగా ఉండే కోహ్లీ ఈసారి సిరీస్ నుంచి వైదొలగడం గమనార్హం.
19 ఏళ్ల వయసులో ఆ కుర్రాడు వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. అప్పటినుంచి ఈ ఏడాది ఇంగ్లాండ్తో సిరీస్ ముందువరకూ నిరాటంకంగా అతని ప్రయాణం సాగింది. ముఖ్యంగా 13 ఏళ్లలో ఒక్కసారి కూడా స్వదేశంలో టెస్టు సిరీస్కు దూరం కాలేదు. ఆ కుర్రాడు భారత జట్టులో దిగ్గజంగా ఎదిగాడు. కెప్టెన్గానూ సత్తా చాటాడు. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి అతని పయనం ఆగింది. విరాట్పర్వంలో విరామం వచ్చింది. ఆ ఆటగాడు ఎవరో కాదు మన విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమైన అతను ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
ఎన్నో ఊహాగానాలు
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ (Virat Kohli) పొట్టి ఫార్మాట్కు 14 నెలల పాటు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ మళ్లీ వస్తుండటంతో తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్తో సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టీ20కు దూరమయ్యాడు. మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఆడాడు. అంతకుముందు ఇదే కారణంతో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్లో ఆడలేదు. కానీ టెస్టుల్లో బరిలో దిగాడు. ఇక స్వదేశంలో కీలకమైన ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్లో కోహ్లీ కచ్చితంగా ఆడతాడనే అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే తొలి టెస్టు కోసం అతను హైదరాబాద్కు కూడా వచ్చాడు. కానీ ఉన్నట్లుండి మ్యాచ్ ఆరంభానికి ముందే ఇక్కడినుంచి వెళ్లిపోయాడు. తొలి రెండు టెస్టులకు అతను అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది.
మూడో టెస్టు నుంచి అయినా అతను ఆడతాడేమోనని అనుకుంటే.. ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లాండ్తో సిరీస్కు దూరంగా ఉన్నాడంటే కోహ్లీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతని తల్లికి అనారోగ్యమనే వార్తలు వచ్చాయి. కానీ అతని సోదరుడు వీటిని ఖండించాడు. ఇక కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. కానీ అది తప్పుడు సమాచారమని ఏబీ క్షమాపణ చెప్పాడు. దీంతో కోహ్లీ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. 13 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యేంత అవసరం అతడికి ఏమొచ్చిందనే దానిపై స్పష్టత లేదు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్లో అతను తిరిగి మైదానంలో కనిపించే అవకాశముంది.
అతను లేని లోటు
జట్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అతను మైదానంలో ఉంటే ఉండే ఉత్సాహమే వేరు. అతని ఉనికి జట్టులో జోష్ పెంచుతుందనే చెప్పాలి. అతను ఆడుతున్నాడంటే స్టేడియాలకు వచ్చేందుకు అభిమానులు పోటీపడతారు. ఇంగ్లాండ్తో హైదరాబాద్ టెస్టులో ప్రతిరోజు స్టేడియానికి సగటున 30 వేల మంది ప్రేక్షకుల వరకూ వచ్చారు. అదే కోహ్లీ ఆ మ్యాచ్లో ఆడి ఉంటే.. ఆ సంఖ్య మరింత పెరిగేదనడంలో సందేహం లేదు. ఇక విశాఖలో జరిగిన రెండో టెస్టులోనూ కోహ్లీ ఉండి ఉంటే.. స్టేడియం మరింతగా కిక్కిరిసేది. టెస్టు క్రికెట్ను అమితంగా ఇష్టపడే, ఈ ఫార్మాట్కు అత్యంత ప్రాధాన్యమిచ్చే విరాట్ ఇప్పుడీ సిరీస్లో లేకపోవడం ప్రపంచ క్రికెట్కు దెబ్బ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ పేర్కొన్నాడు. అండర్సన్, కోహ్లీ మధ్య పోరును చూసే ఛాన్స్ మిస్సయ్యామని టీమ్ఇండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇక ఆటపరంగా చూసినా భారత టెస్టు జట్టులో కోహ్లీ లేని లోటు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టుల్లో కోహ్లీ ఆడే నాలుగోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు గాయంతో శ్రేయస్ మిగిలిన మూడు టెస్టులకు దూరమవడంతో కోహ్లీ స్థానంలో ఎవరాడతారో చూడాలి. ఎవరాడని కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం కష్టమేనని చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్