Virat Kohli: ‘విరాట్’ పర్వంలో విరామం.. కోహ్లీ ఎక్కడ?
గత దశాబ్దంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) లేకుండా భారత్ సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఒకటీ లేదా రెండు మ్యాచ్లకు దూరంగా ఉండే కోహ్లీ ఈసారి సిరీస్ నుంచి వైదొలగడం గమనార్హం.
19 ఏళ్ల వయసులో ఆ కుర్రాడు వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. అప్పటినుంచి ఈ ఏడాది ఇంగ్లాండ్తో సిరీస్ ముందువరకూ నిరాటంకంగా అతని ప్రయాణం సాగింది. ముఖ్యంగా 13 ఏళ్లలో ఒక్కసారి కూడా స్వదేశంలో టెస్టు సిరీస్కు దూరం కాలేదు. ఆ కుర్రాడు భారత జట్టులో దిగ్గజంగా ఎదిగాడు. కెప్టెన్గానూ సత్తా చాటాడు. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి అతని పయనం ఆగింది. విరాట్పర్వంలో విరామం వచ్చింది. ఆ ఆటగాడు ఎవరో కాదు మన విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమైన అతను ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
ఎన్నో ఊహాగానాలు
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ (Virat Kohli) పొట్టి ఫార్మాట్కు 14 నెలల పాటు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ మళ్లీ వస్తుండటంతో తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్తో సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టీ20కు దూరమయ్యాడు. మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఆడాడు. అంతకుముందు ఇదే కారణంతో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్లో ఆడలేదు. కానీ టెస్టుల్లో బరిలో దిగాడు. ఇక స్వదేశంలో కీలకమైన ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్లో కోహ్లీ కచ్చితంగా ఆడతాడనే అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే తొలి టెస్టు కోసం అతను హైదరాబాద్కు కూడా వచ్చాడు. కానీ ఉన్నట్లుండి మ్యాచ్ ఆరంభానికి ముందే ఇక్కడినుంచి వెళ్లిపోయాడు. తొలి రెండు టెస్టులకు అతను అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది.
మూడో టెస్టు నుంచి అయినా అతను ఆడతాడేమోనని అనుకుంటే.. ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లాండ్తో సిరీస్కు దూరంగా ఉన్నాడంటే కోహ్లీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతని తల్లికి అనారోగ్యమనే వార్తలు వచ్చాయి. కానీ అతని సోదరుడు వీటిని ఖండించాడు. ఇక కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. కానీ అది తప్పుడు సమాచారమని ఏబీ క్షమాపణ చెప్పాడు. దీంతో కోహ్లీ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. 13 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యేంత అవసరం అతడికి ఏమొచ్చిందనే దానిపై స్పష్టత లేదు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్లో అతను తిరిగి మైదానంలో కనిపించే అవకాశముంది.
అతను లేని లోటు
జట్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అతను మైదానంలో ఉంటే ఉండే ఉత్సాహమే వేరు. అతని ఉనికి జట్టులో జోష్ పెంచుతుందనే చెప్పాలి. అతను ఆడుతున్నాడంటే స్టేడియాలకు వచ్చేందుకు అభిమానులు పోటీపడతారు. ఇంగ్లాండ్తో హైదరాబాద్ టెస్టులో ప్రతిరోజు స్టేడియానికి సగటున 30 వేల మంది ప్రేక్షకుల వరకూ వచ్చారు. అదే కోహ్లీ ఆ మ్యాచ్లో ఆడి ఉంటే.. ఆ సంఖ్య మరింత పెరిగేదనడంలో సందేహం లేదు. ఇక విశాఖలో జరిగిన రెండో టెస్టులోనూ కోహ్లీ ఉండి ఉంటే.. స్టేడియం మరింతగా కిక్కిరిసేది. టెస్టు క్రికెట్ను అమితంగా ఇష్టపడే, ఈ ఫార్మాట్కు అత్యంత ప్రాధాన్యమిచ్చే విరాట్ ఇప్పుడీ సిరీస్లో లేకపోవడం ప్రపంచ క్రికెట్కు దెబ్బ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ పేర్కొన్నాడు. అండర్సన్, కోహ్లీ మధ్య పోరును చూసే ఛాన్స్ మిస్సయ్యామని టీమ్ఇండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇక ఆటపరంగా చూసినా భారత టెస్టు జట్టులో కోహ్లీ లేని లోటు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టుల్లో కోహ్లీ ఆడే నాలుగోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు గాయంతో శ్రేయస్ మిగిలిన మూడు టెస్టులకు దూరమవడంతో కోహ్లీ స్థానంలో ఎవరాడతారో చూడాలి. ఎవరాడని కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం కష్టమేనని చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్