WFI: పద్మశ్రీ వెనక్కి.. ఆటకు వీడ్కోలు.. అసలు రెజ్లింగ్లో ఏం జరుగుతోంది?
వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచే వారికి ఇచ్చే పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం.. ఆటనే ప్రాణంగా సాగిన అథ్లెట్లు వెనుకడుగు వేయడం భారత రెజ్లింగ్ సమాఖ్యలో సంచలనంగా మారాయి.
పద్మశ్రీ.. భారత్లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం. వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్లకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పురస్కారాన్నిస్తుంది. ఈ అవార్డు పొందడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని వెనక్కిచ్చేస్తున్నారు. మరోవైపు చిన్నప్పటి నుంచి ఆటే ప్రాణంగా సాగి.. ప్రపంచ వేదికలపై అద్భుత విజయాలతో దేశానికి ఖ్యాతి తెచ్చిన వాళ్లు ఆ ఆటకే వీడ్కోలు పలికారు. అసలు ఏం జరుగుతోంది. భారత రెజ్లింగ్లో రేగిన కలకలం ఏమిటీ? రెజ్లింగ్కు సాక్షి మలిక్ గుడ్బై చెప్పాల్సిన, బజ్రంగ్ పద్మశ్రీని వెనక్కి ఇవ్వాల్సిన పరిసిౖతి ఎందుకొచ్చింది?
లైంగిక వేధింపులపై పోరాటం
2023కు ముందు భారత రెజ్లింగ్లో అంతా సవ్యంగానే సాగింది. జాతీయ ఛాంపియన్షిప్స్లు, శిబిరాలు, అంతర్జాతీయ పోటీల్లో భారత రెజ్లర్ల ప్రాతినిథ్యం.. ఇలా అన్నీ సాఫీగా సాగిపోయాయి. కానీ ఈ ఏడాది జనవరిలో రెజ్లర్ల నిరసనతో భారత రెజ్లింగ్ ముఖ చిత్రమే మారిపోయింది. రోడ్డుపై ఆందోళన, పోలీసుల జోక్యం, కేసులు, కోర్టులో విచారణ, ఆగిన జాతీయ ఛాంపియన్షిప్స్.. ఇలా పరిస్థితి గందరగోళంగా మారింది. మహిళా రెజ్లర్లపై అప్పటి భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో సాక్షి మలిక్, వినేశ్ ఫొగట్, బజ్రంగ్ పునియా లాంటి దిగ్గజాలు జంతర్మంతర్ దగ్గర ఈ ఏడాది జనవరి 18న ధర్నాకు దిగడం కలకలం రేపింది. బ్రిజ్భూషణ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, డబ్ల్యూఎఫ్ఐ పాలక వర్గాన్ని రద్దు చేయాలని ఈ రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై విచారణ కోసం కమిటీ వేస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించడంతో జనవరి 21న రెజ్లర్లు నిరసన విరమించారు. అప్పుడే బ్రిజ్భూషణ్ను అధ్యక్షుడిగా తప్పించారు. దీంతో అంతా సద్దుమణిగినట్లే అనిపించింది.
మళ్లీ రోడ్డుపైకి..
విచారణ కమిటీ నివేదికను బయట పెట్టాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 23న రెజ్లర్లు మళ్లీ ఆందోళన మొదలెట్టారు. లైంగిక హింస ఆరోపణలతో బ్రిజ్భూషణ్పై ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేసినప్పటికీ దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఈ సారి ఉద్యమానికి తెరతీశారు. రైతు సంఘాల నేతలు, ఇతర వర్గాల నుంచి రెజ్లర్లకు మద్దతు లభించడంతో ఈ సారి ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో దిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ కేసులు ఇంకా కోర్టు విచారణలో ఉన్నాయి. మరోవైపు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీగా రెజ్లర్లు భవనం వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా జంతర్మంతర్ దగ్గర దీక్షా శిబిరాన్ని కూడా తొలగించారు. దీంతో తీవ్ర ఆవేదనతో తమ పతకాలను గంగలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. కానీ రైతు సంఘాల నాయకులు వారించడంతో రెజ్లర్లు తగ్గారు. బ్రిజ్భూషణ్పై పోలీసు విచారణ సరిగ్గా జరిగేలా చూస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో జూన్ 7న రెజ్లర్లు ఆందోళన విరమించారు.
ఎన్నికలతో మళ్లీ..
మరోవైపు గడువు లోపు డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ ఈ సమాఖ్యపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిషేధం విధించింది. కోర్టుల స్టే కారణంగా ఈ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. సుప్రీం కోర్టు జోక్యంతో డిసెంబర్ 21న ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. కానీ బ్రిజ్భూషణ్ సన్నిహితులెవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని క్రీడల మంత్రిని రెజ్లర్లు కోరారు. మహిళా అధ్యక్షురాలు రావాలని కోరుకున్నారు. దీంతో బ్రిజ్భూషణ్ తనయుడు, అల్లుడు పోటీకి దూరంగా ఉన్నాడు. కానీ కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్కు వీర విధేయుడైన సంజయ్ సింగ్ గెలవడంతో ఆందోళన చేసిన రెజ్లర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల పాటు రోడ్డుపై ఉండి నిరసన చేస్తే లాభం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో డబ్ల్యూఎఫ్ఐపై మళ్లీ బ్రిజ్భూషణ్ ఆధిపత్యమే కొనసాగుతుందని బాధ పడుతున్నారు. దీంతో సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మలిక్ తన బూట్లను బల్లపై పెట్టి, కన్నీళ్లతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని పార్లమెంట్ ముందు రోడ్డుపై పెట్టేసి ఆ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు బజ్రంగ్ ప్రకటించాడు. డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) రెజ్లింగ్ ఛాంపియన్ వీరేందర్ సింగ్ కూడా తన పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తానని పేర్కొన్నాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పరిణామాలు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!