England - ODI World Cup: ఛాంపియన్కు ఏమైంది?.. ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఎందుకిలా?
డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగు పెట్టిన ఇంగ్లాండ్ (England) జట్టు తన స్థాయికి తగ్గట్టు ఆడటంలో విఫలమవుతోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.
అగ్రశ్రేణి బ్యాటర్లు.. ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులో ఆరుగురు ఆల్రౌండర్లు.. ప్రమాదకర బౌలర్లు.. ఇలా మొత్తంగా స్టార్ క్రికెటర్లతో నిండిన జట్టు. దూకుడైన ఆటతీరుతో.. ప్రత్యర్థిని ఏ మాత్రం లెక్క చేయకుండా.. నిర్భయంగా విజయాల వేటలో సాగే జట్టు. ప్రత్యర్థి జట్లను చావుదెబ్బ కొడుతూ.. అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే జట్టు. అందుకే ఈ ప్రపంచకప్లోనూ టైటిల్ ఫేవరెట్గా ఆ జట్టును పరిగణించారు. సునీల్ గావస్కర్ లాంటి దిగ్గజం భారత్ను కాదని.. ఆ జట్టు కప్పు గెలుస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అంతా తలకిందులైంది. నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓటములతో సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఆ జట్టే ఇంగ్లాండ్. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన ఇంగ్లిష్ జట్టు ప్రస్తుత ఆటతీరు ఏ మాత్రం ఊహించనిదే. మరి ఇంగ్లాండ్కు ఏమైంది?
ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో ఇంగ్లాండ్ ఓడింది. తర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్పై విజయంతో పుంజుకుంటుందనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా పసికూన అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు సఫారీ సేన చేతిలో చిత్తుచిత్తుగా ఓడి తమ వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త పరాజయాన్ని మూటగట్టుకుంది. 229 పరుగుల తేడాతో ఓడి.. పరుగుల పరంగా అతి పెద్ద ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ సెమీస్ చేరడం కష్టమనే చెప్పాలి. అందుకు ముందుగా ఆడబోయే అయిదు మ్యాచ్లూ గెలవాల్సిందే! ఇంగ్లాండ్ వరుసగా శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్తో తలపడనుంది. ఇందులో శ్రీలంక, నెదర్లాండ్స్ మినహాయిస్తే మిగతా మూడు మ్యాచ్లూ ఇంగ్లాండ్కు కఠిన పరీక్షే.
2015లోనూ ఇలాగే..
2015 వన్డే ప్రపంచకప్లోనూ ఇంగ్లాండ్ ఇలాగే పేలవ ప్రదర్శన చేసింది. అప్పుడు 6 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించింది. 4 ఓటములతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. కానీ ఈ పరాభవం ఇంగ్లాండ్కే మేలు చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత ఆ జట్టు పూర్తిగా మారిపోయింది. దూకుడైన ఆటతీరుతో సాగుతోంది. 2019లో తొలిసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది. నిరుడు టీ20 ప్రపంచకప్నూ సొంతం చేసుకుంది. ఆ రెండు సందర్భాల్లోనూ ఉన్న కీలక ఆటగాళ్లు ఇప్పుడూ జట్టులో ఉన్నారు. కానీ ఇప్పుడు జట్టు ఓటముల కంటే ఓడిన తీరు మరింత షాక్కు గురిచేస్తోంది. ఎలాంటి పోరాటం లేకుండా చేతులెత్తేస్తోంది. 2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్, ఆల్రౌండర్ స్టోక్స్ కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్ రిజర్వ్ ఆటగాడిగా జట్టుతో కొనసాగుతున్నాడు.
తుంటి గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్లకు దూరమైన స్టోక్స్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో అడుగుపెట్టినా లయ అందుకోలేక వికెట్ పారేసుకున్నాడు. బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్ లాంటి బ్యాటర్లు.. మొయిన్ అలీ, సామ్ కరన్, లివింగ్స్టోన్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ లాంటి ఆల్రౌండర్లు.. అట్కిన్సన్, రషీద్, రీస్ టాప్లీ, మార్క్వుడ్ లాంటి బౌలర్లు ఉన్నారు. కానీ జట్టు గెలవలేకపోతోంది. అందుకు ప్రధాన కారణం సమష్టిగా సత్తాచాటలేకపోవడం. అంచనాలకు తగ్గట్లుగా స్టార్ క్రికెటర్లు రాణించలేకపోవడం.
ఆ దూకుడేదీ?
టెస్టుల్లోనే టీ20 ఆటతీరుతో అదరగొట్టే ఇంగ్లాండ్.. వన్డేల్లో మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోతుంది. క్రీజులో బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్లో ఆధిపత్యం సంగతి పక్కనపెడితే కనీస ప్రదర్శన కూడా లేదు. బంగ్లాదేశ్పై మలన్ 140 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు మ్యాచ్ల్లో రూట్ వరుసగా 77, 82 పరుగులు చేశాడు. బెయిర్స్టో కూడా వరుసగా 33, 52 పరుగులు సాధించాడు. కానీ నిలకడైన ప్రదర్శన లేదు. భారీ ఇన్నింగ్స్ల్లేవు. తుది జట్టు ఎంపిక కూడా సరిగ్గా ఉండటం లేదు. బౌలింగ్లో పూర్తిగా తేలిపోతోంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం లివింగ్స్టోన్, క్రిస్ వోక్స్, సామ్ కరన్ను తప్పించి స్టోక్స్, విల్లీ, అట్కిన్సన్ను ఆడించింది. విల్లీ, అట్కిన్సన్కు ఇదే తొలి ప్రపంచకప్ మ్యాచ్. బట్లర్ బ్యాటర్గానే కాదు కెప్టెన్గానూ విఫలమవుతున్నాడు.
అవసరమైన సమయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో టాప్లీ గాయంతో మధ్యలో బయటకు వెళ్లి వచ్చాడు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రూట్తో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. అతని బౌలింగ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. అలాగే బ్యాటింగ్కు చక్కగా సహకరించిన పిచ్పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమూ దెబ్బతీసింది. మరోవైపు ఆటగాళ్లు వేడిని తట్టుకోలేక అలసిపోతున్నారు. ఇంగ్లాండ్ తిరిగి పుంజుకోవాలంటే తుది జట్టు ఎంపికలో కాదు దృక్పథంలో మార్పు రావాలి. ఇప్పటికీ జట్టులోని ఆటగాళ్లు సత్తాచాటితే ఇంగ్లాండ్ ప్రమాదకరంగా మారుతుంది. ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేసి సత్తా ఆ జట్టుకుంది. కానీ నమ్మకం కావాలి. ముందుగా ఆటగాళ్లు తమను తాము నమ్మాలి. విజయాలు సాధిస్తామనే కసితో సాగాలి. జట్టు సమతూకం పాటించాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్