IND vs ENG: ఇంగ్లాండ్తో తొలి టెస్టు.. ప్రత్యర్థి వికెట్ల హంటర్స్ ఎవరు?
స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో (IND vs ENG) మొదటిి మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ప్రస్తుత ఏడాది తొలి అర్ధ భాగంలో టీమ్ఇండియా ఆడే భారీ టెస్టు సిరీస్ ఇదే. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు (IND vs ENG) జట్టును ప్రకటించారు. విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. స్వదేశంలో అనగానే.. స్పిన్నర్ల ప్రభావం ఎక్కువని కొద్దిపాటి క్రికెట్ పరిజ్ఞానం ఉన్నవారెవరైనా చెబుతారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (Rohit Sharma) తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది.
జనవరి 25 నుంచి మార్చి 11 వరకు.. దాదాపు 45 రోజులపాటు భారత్లో ఇంగ్లాండ్ జట్టు పర్యటన కొనసాగనుంది. గురువారం నుంచి ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లూ హైదరాబాద్కు చేరుకుని ప్రాక్టీస్ షురూ చేశాయి. ఉప్పల్ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. తొలి రోజు చివరి సెషన్ నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుందనేది మునుపటి గణాంకాలు చెబుతున్నాయి. అలాగని పేసర్లను ఇబ్బందికి గురి చేస్తుందా? అంటే అదీ లేదు. తొలి రోజు వారిదే హవా.
రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లదే ప్రభావం
చివరిసారిగా ఇక్కడ జరిగిన (2018లో) మ్యాచ్ ఫలితాలను గమనిస్తే.. విండీస్పై భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లవి కలిపి 30 వికెట్లు పడగా.. అనూహ్యంగా పేసర్లు 18 వికెట్లు తీశారు. ఉమేశ్ యాదవ్ ఈ టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. స్పిన్నర్లు 12 వికెట్లు పడగొట్టారు. ఈ లెక్కన హైదరాబాద్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతోపాటు తొలుత పేసర్లకు సహకరిస్తుందని తెలుస్తోంది. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం స్పిన్నర్లే ప్రధాన పాత్ర పోషించారు. భారత స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీశారు. అప్పుడు అశ్విన్, కుల్దీప్, జడేజా కట్టుదిట్టమైన బౌలింగ్తో అదరగొట్టారు. ఈసారి కూడా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. లోతైన బ్యాటింగ్ కూడా చాలా అవసరం. పేసర్లలో బుమ్రానే కాస్త బ్యాట్ను ఝుళిపించగలడు. అదే, స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్/అక్షర్ పటేల్ ఉంటే బ్యాటింగ్ పిచ్పై పరుగులు రాబట్టగలరు.
పేస్ ఆల్రౌండర్ ఉండుంటే..
భారత్ జట్టులో ఇప్పుడు పేస్ ఆల్రౌండర్ స్థానం ఖాళీగా ఉంది. హార్దిక్ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరం కావడం.. శార్దూల్ ఠాకూర్కు అవకాశాలు వచ్చినా నిరూపించుకోకపోవడంతో భారత్కు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు టీమ్లో పేస్ ఆల్రౌండర్ ఉండుంటే.. స్వదేశంలోనూ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే వెసులుబాటు కలిగేది. మనకు ఉన్న ముగ్గురు స్పిన్నర్లూ బ్యాటింగ్లో రాణించగల సత్తా ఉన్న ఆటగాళ్లే. హైదరాబాద్ పిచ్నే ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ స్పిన్నర్ల కంటే పేసర్లే రాణించారనేది తెలుస్తోంది. దీంతో ఒక స్పిన్నర్ కమ్ బ్యాటర్ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి. అదనంగా స్పెషలిస్ట్ పేసర్ను జట్టులోకి తీసుకోవాల్సి వస్తుంది.
బజ్బాల్ను అడ్డుకోవాలంటే..
ఇంగ్లాండ్ బజ్బాల్ క్రికెట్తో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది. భారత్లోనూ ఇదే దూకుడుతో ఆడుతుందని ఇప్పటికే ఆ జట్టు మాజీలు చెబుతున్నారు. అలాంటి బజ్బాల్ను అడ్డుకోవడానికి ఇక్కడ స్పిన్ ఆయుధం సరైందనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. బంతి ఎక్కువగా తిరిగితే భారీ షాట్లు ఆడకుండా నియంత్రించడానికి వీలు కలుగుతుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్, జాక్ క్రాలే, బెన్ డకెట్, పోప్ క్రీజ్లో పాతుకుపోతే ఓ పట్టాన వికెట్ ఇవ్వడానికి ఇష్టపడరు. అలాంటి వారికి చెక్ పెట్టడంతోపాటు.. బెన్స్టోక్స్, బెయిర్స్టోను భారీ షాట్లకు వెళ్లేలా చేయడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించాలి.
భారత్ (తుది జట్టు)
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్/కుల్దీప్/అక్షర్ పటేల్.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!