Team India: ఫైనల్ ఎలెవన్లో ఎవరు? రోహిత్ కామెంట్లతో చర్చ
మరో నాలుగు నెలల్లో పొట్టి కప్ (T20 World Cup 2024) సమరం ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ఇండియా చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్ను ఆడేసింది. మెగా టోర్నీకి ముందు ఐపీఎల్లో భారత క్రికెటర్లు ఆడతారు.
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్నకు (T20 World Cp 2024) ఇంకా నాలుగు నెలలకు పైగా సమయం ఉంది. జూన్ 1న ఈ పొట్టి కప్ ఆరంభమవుతుంది. కానీ, ఇప్పుడే ఆ కప్లో ఆడే భారత జట్టుపై మైదానంలో బరిలో దిగే ఫైనల్ ఎలెవన్పై చర్చ జోరందుకుంది. ఇప్పుడిదే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో సత్తా చాటేందుకు చివరి అవకాశమైన అఫ్గానిస్థాన్తో సిరీస్ ముగిసింది. ఈ సిరీస్లో కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనపై స్పెషల్ ఫోకస్ కనిపించింది. తాజాగా కెప్టెన్ రోహిత్ (Rohit Sharma) చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఇంకా జట్టు ఖరారు కాలేదని, కొంతమంది ఆటగాళ్లను తప్పించక తప్పదని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. మరి ఆ కప్లో ఆడే 11 మంది ఎవరు? పోటీలో ఉండేదెవరు?
వచ్చేదెవరు?
ప్రపంచకప్లో ఆడబోయే 8 నుంచి 10 మంది ఆటగాళ్లు తమ మదిలో ఉన్నారని రోహిత్ చెప్పాడు. ఆ కప్ కోసం జట్టు 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది. ఇందులో నుంచి 11 మంది మ్యాచ్లో ఆడతారు. అయితే 25 నుంచి 30 మంది ఆటగాళ్ల పూల్ నుంచి ప్రపంచకప్ జట్టును ఎంచుకోవాల్సి ఉందని రోహిత్ అన్నాడు. ముందుగా జట్టుకు ఎంపిక చేసే ఆటగాళ్లపై ఓ అంచనాకు రావాల్సి ఉంది. 14 నెలల తర్వాత అఫ్గానిస్థాన్ సిరీస్తో తిరిగి టీ20ల్లో పునరాగమనం చేసిన రోహిత్, కోహ్లి.. ఆ పొట్టి కప్లో ఆడటం ఖాయమనే చెప్పాలి. గాయాల నుంచి కోలుకుని, ఐపీఎల్లో సత్తాచాటితే హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్తో పాటు రిషబ్ పంత్ కూడా తిరిగి జట్టులోకి వస్తారు. ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఆడటం పక్కా. ఫిట్నెస్తో ఉంటే షమి కూడా జట్టులోకి వస్తాడనడంలో సందేహం లేదు. ఫినిషర్గా రింకు ఆడే ఛాన్స్ ఉంది.
స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసే జట్టులో చోటు దక్కించుకోవచ్చు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, జితేశ్, అర్ష్దీప్ను జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలున్నాయి. పైన పేర్కొన్న ఆటగాళ్లే కాకుండా ఐపీఎల్తో సత్తాచాటే వాళ్లు కూడా జట్టులోకి వచ్చే అవకాశాలుంటాయి. అఫ్గానిస్థాన్తో సిరీస్లో రాణించిన ఆల్రౌండర్లు శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్తో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకూ ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి. ఇక అఫ్గానిస్థాన్ సిరీస్లో ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ ఆకట్టుకోలేకపోయారు. ముకేశ్ 9.80 ఎకానమీ, బిష్ణోయ్ 10.18 ఎకానమీ, అవేశ్ 13.75 ఎకానమీతో పరుగులు ఇచ్చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి 25 ఓవర్లు వేసి 5 వికెట్లే పడగొట్టారు. ఐపీఎల్లో వీళ్లు అద్భుత ప్రదర్శన చేస్తే తిరిగి పరిగణించే ఆస్కారముంటుంది.
ఆడేదెవరు?
ఇక తుది 11 మంది ఎవరనే దానిపై కూడా తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఒక ఓపెనర్గా రోహిత్ ఆడతాడు. అతనితో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేందుకు యశస్వి, శుభ్మన్ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరిలో పోల్చి చూస్తే యశస్వికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక మూడులో కోహ్లి, నాలుగులో సూర్యకుమార్ ఆడొచ్చు. ఆ తర్వాత రింకు, హార్దిక్, పంత్ ఆడే ఆస్కారముంది. ఆల్రౌండర్ ప్లేసు కోసం హార్దిక్తో శివమ్ దూబె పోటీపడుతున్నాడు. కానీ, హార్దిక్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఇక స్పిన్ ఆల్రౌండర్గా జడేజా, అక్షర్లో ఎవరిని ఆడించాలన్నది జట్టుకు తలనొప్పిగా మారొచ్చు. మరో స్పిన్నర్గా కుల్దీప్కే ఓటు వేసే వీలుంది. ఇద్దరు స్పెషలిస్టు పేసర్లుగా బుమ్రా, సిరాజ్, షమిలను రొటేట్ చేయొచ్చు. కానీ ఐపీఎల్ తర్వాత ఈ సమీకరణాలు మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ లీగ్తో ప్రపంచకప్నకు ఎంపిక చేసే టీమ్ఇండియాపై తుది నిర్ణయానికి వచ్చే ఆస్కారముంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!