Team India: టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియాలో ‘ఆ నలుగురు’
ఎంతటి పెద్ద ఆటగాడైనా ఫామ్లో ఉంటేనే ఆడగలడు. అలాగే టీమ్ అయినా సరే రాణించాలంటే ఏ ఒక్కరి మీదనో ఆధారపడి ఉండకూడదు. కానీ సీనియర్లు మాత్రం తమ బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ద్వైపాక్షిక సిరీసుల్లో ఎంత రాణించినా పెద్దగా గుర్తింపు దక్కదు. అదే ఆటను ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో ప్రదర్శిస్తే హీరోలు అవుతారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే చాలా ఒత్తిడి ఉండటం సహజం. యువ ఆటగాళ్లు తడబాటుకు గురైతే ఫర్వాలేదు కానీ.. సీనియర్లు మాత్రం జట్టును ముందుండి నడిపించాలి. మరి టీమ్ఇండియాకు అలాంటి ఆటగాళ్లు ఎవరున్నారు..? గత కొన్ని టీ20ల్లో ఎలా రాణించారు..? ప్రస్తుత ఫామ్ ఎలా ఉందనే విషయాలను తెలుసుకుందాం..
కెప్టెన్సీ కీలకం..
ఎలాంటి జట్టుకైనా కెప్టెన్ చాలా కీలకం. అతడు తీసుకొనే నిర్ణయాలు.. ఫామ్ జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటి వరకు ఉన్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. ప్రస్తుతం టీమ్ఇండియా సారథి. భారీ స్కోర్లను అవలీలగా చేయగలడు. పవర్ప్లేలో దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. అదేవిధంగా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు (4) చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అయితే కీలకమైన టోర్నీల్లో ప్రదర్శన నిలకడగా ఉండదనే వాదనా ఉంది.
గత ప్రపంచకప్లోనూ గొప్పగా రాణించలేదు. ఐదు మ్యాచుల్లో కలిపి 174 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. కానీ అవి అఫ్గానిస్థాన్, నమీబియా జట్లపై చేశాడు. ముఖ్యమైన పాక్, కివీస్ మ్యాచుల్లో తేలిపోయాడు. ఇక ఆసియా కప్లోనూ తన స్థాయి ఆటను ప్రదర్శించలేదు. నాలుగు మ్యాచుల్లో ఒక అర్ధశతకంతో 133 పరుగులు చేశాడు. ఆ హాఫ్ సెంచరీ కూడానూ శ్రీలంకపై చేశాడు. అయితే ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. అయితే ఎప్పుడు ఎలా ఆడతాడో అంచనా వేయడం చాలా కష్టం. ఫామ్లో లేనట్లు ఉన్నా.. ధాటిగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు.
రన్ మెషీన్..
ప్రస్తుతం ఉన్న భారత జట్టులో అత్యంత సీనియర్లలో విరాట్ ఒకడు. బ్యాటింగ్, ఫీల్డింగ్లో జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి కీలక ఇన్నింగ్స్లు ఆడటంలో దిట్ట. రెండు నెలల కిందట కోహ్లీపై పెద్దగా అంచనాలు, ఆశలు ఉండేవి కావు. కానీ ఆటకు విరామం తీసుకొని ఆసియా కప్ బరిలోకి దిగాడు. రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లతో సిరీస్లు ఆడాడు. మూడేళ్ల నుంచి సెంచరీ కోసం వేచి చూసిన కోహ్లీ.. ఆ భారం మొత్తం దించేసుకొన్నాడు.
ఇప్పుడు అద్భుత ఫామ్తో మునపటి విరాట్ను గుర్తుకు తెచ్చాడు. అందుకే ఈ ప్రపంచకప్లో భారత్కు కోహ్లీ కీలకంగా మారతాడని మాజీలు, విశ్లేషకులు అంచనా వేశారు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో 14 మ్యాచుల్లో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 485 పరుగులు చేశాడు. ఫిట్నెస్లో తిరుగులేని ఆటగాడు విరాట్. మైదానంలో చురుగ్గా ఉంటాడు. ఇదే ఫామ్ను పొట్టి టోర్నీ ఆసాంతం కొనసాగించాలి. గత టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ ఐదు మ్యాచుల్లో మూడు ఇన్నింగ్స్ల్లో 68 పరుగులు సాధించాడు. అందులో ఒక అర్ధశతకం (57) ఉంది.
హార్దిక్.. నీ మీద భారీ ఆశలే
భారత్ మొదటి వన్డే ప్రపంచకప్ను గెలిచినప్పుడు అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించాడు. అతడు పేస్ ఆల్రౌండర్. ఆ తర్వాత మిడిలార్డర్లో టీమ్ఇండియాకు దొరికిన ఆటగాడు హార్దిక్ పాండ్య. గతేడాదంతా గాయాలతో సహవాసం చేసి కోలుకొని వచ్చాడు. భారత టీ20 లీగ్లో గుజరాత్కు టైటిల్ అందించాడు. అలాగే ఆసియా కప్లో పాక్ మీద ఆల్రౌండ్ ప్రదర్శనతో మెప్పించాడు. కానీ మిగతా మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. మిడిలార్డర్లో జట్టుకు ఉపయుక్తమైన బ్యాటింగ్ చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీయాలని భారీ ఆశలు హార్దిక్పై ఉన్నాయి.
ప్రస్తుత సంవత్సరంలో హార్దిక్ పాండ్య 18 మ్యాచుల్లో 151.3 స్ట్రైక్ రేట్తో 436 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇదే స్ట్రైక్రేట్తో టీ20 ప్రపంచకప్లో ఆడితే చాలు.. టీమ్ఇండియా మిడిలార్డర్కు ఢోకా ఉండదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. 4/33 అత్యుత్తమ ప్రదర్శనతో 12 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. బౌలింగ్ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఓవర్లలో జట్టుకు అండగా నిలిచేలా బౌలింగ్ ప్రదర్శన ఉంటేనే ఆల్రౌండ్ నామధేయానికి సార్థకత చేకూరుతుంది. గత టీ20 ప్రపంచకప్లో మూడు ఇన్నింగ్స్ల్లో కలిపి 69 పరుగులు చేశాడు. అప్పటి పొట్టి కప్ పోటీల్లో ఒక్క మ్యాచ్లోనూ బౌలింగ్ చేయకపోవడం గమనార్హం.
నయా ఫినిషర్.. డీకే
టీమ్ఇండియాకు మొన్నటి వరకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ‘ఫినిషర్’’. ఇప్పుడు భారత టీ20 లీగ్ వల్ల బయటకొచ్చిన మరో హార్డ్ హిట్టర్ - ఫినిషర్ దినేశ్ కార్తిక్. ఇదేంటి తొలి టీ20 ప్రపంచకప్ నుంచి టీమ్ఇండియాతో ఆడుతోన్న డీకేని ఇప్పుడు గుర్తించడమేంటి..? అంటారా..? ధోనీ ఉన్నప్పుడు అడపాదడపా అవకాశాలు దక్కేవి. అదీ తుది జట్టులో స్థానం కష్టంగా ఉండేది. అయితే గత టీ20 లీగ్ సీజన్లో బెంగళూరు తరఫున చివరి ఓవర్లలో ధాటిగా ఆడి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో టీమ్ఇండియా మేనేజ్మెంట్ దృష్టి డీకే మీద పడింది. ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీసుల్లోనూ తన ఫినిషర్ పాత్రను నిరూపించుకొన్నాడు. రిషభ్ పంత్ ఉండటంతో జట్టులోకి కష్టమేనన్న అంచనాలను తలకిందులు చేస్తూ కార్తిక్ టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు.
తుది జట్టులోనూ రిషభ్ కంటే దినేశ్ కార్తిక్ ఉంటేనే మంచిదనే వాదనా వచ్చింది. రిషభ్ పంత్ టీ20 ఫార్మాట్లో దూకుడైన గేమ్ను ఆడలేకపోవడం కూడా డీకే కలిసొచ్చింది. గత టీ20 ప్రపంచకప్లో కార్తిక్కు స్థానం దక్కలేదు. ఇప్పుడొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. భారత్ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్ జట్టులో డీకే సభ్యుడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుత ఏడాదిలో ఆడిన 19 టీ20ల్లో 150కిపైగా స్ట్రైక్రేట్తో 273 పరుగులు చేశాడు. అయితే ఇందులో ఎక్కువగా చివర్లో వచ్చిన చేసిన పరుగులే కావడం విశేషం. ఈసారి టీ20 ప్రపంచకప్ను భారత్ ఖాతాలో పడాలంటే రోహిత్, విరాట్, దినేశ్, హార్దిక్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్