IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
ఐపీఎల్ 2024 చివరి దశకు వర్షం ముప్పు ఎదురవుతోంది. లీగ్ స్టేజ్లో కోల్కతా - రాజస్థాన్ మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్కు ఇదే పరిస్థితి ఎదురైతే? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ క్లైమాక్స్కు చేరింది. 10 జట్లు హోరాహోరీగా తలపడి.. చివరికి నాలుగు టీమ్లు నాకౌట్ దశకు చేరాయి. ఇవాళ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్లో కోల్కతా - హైదరాబాద్ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న వేళ.. వర్షం ముప్పు మ్యాచ్లకు ఉండే అవకాశం లేకపోలేదు. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే అహ్మదాబాద్లో వర్షం కారణంగా గుజరాత్ X కోల్కతా లీగ్ మ్యాచ్ (మే 13) రద్దైన సంగతి తెలిసిందే. అయితే, నాకౌట్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ అప్పుడు కూడా ప్లేఆఫ్స్ మ్యాచ్లకు వర్షం అడ్డుగా నిలిస్తే.. విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే సందేహం రావడం సహజమే. అక్కడి వాతావరణం ఎలా ఉందనేది కూడా చూద్దాం..
- నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్లు.. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంది. షెడ్యూల్ తేదీ మరుసటి రోజే రిజర్వ్డేగా ప్రకటించారు.
- ఉదాహరణకు ఇవాళ కోల్కతా - హైదరాబాద్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగితే.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మరుసటి రోజు (మే 22) ఆట కొనసాగుతుంది.
- డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజేతను తేల్చేందుకు కనీసం ఐదు ఓవర్ల ఆటనైనా నిర్వహించాలి. దీనికి కటాఫ్ సమయం రాత్రి 10.25 గంటలు. అలా కాని పక్షంలో సూపర్ ఓవర్తోనైనా విజేతను ప్రకటిస్తారు.
- ఒకవేళ సూపర్ ఓవర్ కూడా ఆడేందుకు వాతావరణం కుదరలేదు. అప్పుడు ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఇరు జట్లలో సీజన్ను ఎక్కువ పాయింట్లతో ముగించిన వారే విజేతగా నిలుస్తారు.
- తొలి క్వాలిఫయర్ రద్దు అయితే.. కోల్కతా నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఎందుకంటే ఆ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానం సాధించి ప్లేఆఫ్స్కు వచ్చింది. అప్పుడు హైదరాబాద్ (17) ఎలిమినేటర్ విజేతతో తలపడాల్సి ఉంటుంది.
- ఎలిమినేటర్ మ్యాచ్లోనూ (మే 22న) ఇదే పరిస్థితి ఎదురైతే.. బెంగళూరు (14) ఇంటికెళ్లాల్సిందే. రాజస్థాన్ (17) రెండో క్వాలిఫయర్కు అర్హత సాధిస్తుంది.
- సెకండ్ క్వాలిఫయర్లో హైదరాబాద్ - రాజస్థాన్ (మే 24న) తలపడి వర్షం అడ్డంకిగా మారితే.. సన్రైజర్స్ నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఎందుకంటే ఇరు జట్ల పాయింట్లు (17) ఒకటే అయినప్పటికీ నెట్రన్రేట్లో హైదరాబాద్ ముందుంది.
- ఫైనల్ మ్యాచ్కూ (మే 26) వరుణుడు ఆటంకం కలిగిస్తే రిజర్వ్ డే ఎలానూ ఉంది. అప్పుడూ వర్షం కారణంగా మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఎదురైతే మాత్రం కోల్కతా ఛాంపియన్గా నిలుస్తుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటమే దానికి కారణం.
ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే?
పైన మనం చర్చించిన అంశాలన్నీ వర్షం పడితే ఎలా విజేతను నిర్ణయిస్తారని మాత్రమే. అయితే, గత వారం వర్షాలతో ఇబ్బంది పడిన అహ్మదాబాద్లో ఇప్పుడు వాతావరణం చాలా బాగుందనేది రిపోర్టులు చెబుతున్న మాట. ఎండ కూడా బాగా కాస్తున్నందున మ్యాచ్ల నిర్వహణకు అంతరాయం ఉండకపోవచ్చు. రెండో క్వాలిఫయర్, ఫైనల్కు వేదిక అయిన చెన్నైలో మాత్రం వరుణుడి ప్రభావం ఉంటుందని సమాచారం. సముద్రతీరం కావడంతో అక్కడి వాతావరణాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అయితే, సగటు క్రికెట్ అభిమాని మాత్రం ప్రతి మ్యాచ్ చివరి వరకూ జరగాలని కోరుకుంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?