Virat: అప్పుడు ఆర్సీబీని వదిలేద్దామనుకున్నా.. వేలంలోకి వెళ్లాలనే ఆలోచనలూ చేశా: విరాట్ కోహ్లీ
ప్రతి సీజన్లో ఈ సారి కప్ మనదే అంటూ ఎంతో ఉత్సాహంగా రావడం.. అభిమానులను నిరాశపరచడం ఆ జట్టుకు పరిపాటి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని విషయం తెలిసిందే. అయినా ఆ జట్టుకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండటానికి కారణం విరాట్ కోహ్లీ (Virat Kohli).
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు ఐపీఎల్ (IPL 2024) ట్రేడింగ్ ట్రెండ్ నడుస్తోంది. రిటెన్షన్/రిలీజ్ అయిపోయింది. ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఒకదాని నుంచి మరొకటి కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా గుజరాత్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్ పాండ్యను ముంబయి సొంతం చేసుకుంది. అలాగే ముంబయి నుంచి కామెరూన్ గ్రీన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఇలాంటి సమయంలో గతంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. అత్యధిక క్రేజ్ ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటని తెలుసు కదా.. ఇక ఆ టీమ్లో అందరి దృష్టి పరుగుల వీరుడు విరాట్పైనే ఉంటుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకి తప్పితే మరే జట్టుకు ఆడని ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీనే. అలాంటి విరాట్ కూడా ఒకానొక దశలో బెంగళూరు జట్టును వదిలేయాలని అనుకున్నాడట. గతేడాది ఐపీఎల్ (2022) సందర్భంగా విరాట్ చిట్చాట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
‘‘నన్ను ఐపీఎల్ వేలంలోకి రావాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరాయి. నేను కూడా ఒకదశలో బెంగళూరును వదిలేద్దామని నిర్ణయించుకున్నా. ఇది చెప్పడానికి నాకేమీ మొహమాటం లేదు. కానీ, ఒక రోజు జీవితమంటే ఏంటా అనే ఆలోచన వచ్చింది. మనం ఉన్నా లేకపోయినా రోజులు జరిగిపోతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంతకాలం అని రాసిపెట్టి ఉంటుంది. మనకు తెలిసి ట్రోఫీలు గెలిచిన గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, ఎవరూ మిమ్మల్ని అలా పిలవరు. మీరు ఎక్కడికైనా వెళ్తే ‘ఓహ్.. ఇతను ఐపీఎల్ ఛాంపియన్ లేదా వరల్డ్ కప్ ఛాంపియన్’ అని సంబోధించరు.
అదే నువ్వు మంచి వ్యక్తివైతే.. ప్రజలూ నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ చెడ్డ వ్యక్తిఅయితే వారే దూరంగా పెడతారు. జీవితంలో ఇదే అత్యంత విలువైంది. ఆర్సీబీ పట్ల విధేయతగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. ట్రోఫీని అందించకపోయినా.. ఏ ఫ్రాంచైజీ కూడా ఇలా ఆటగాడిపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవకపోయినా మా పట్ల ఆర్సీబీ యాజమాన్యం విశ్వాసం మరిచిపోలేం. తొలి మూడేళ్లు.. నేనప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రోజులు. అలాంటి సమయంలోనూ ఫ్రాంచైజీ ఎన్నో అవకాశాలను కల్పించింది. మరే ఇతర జట్టులోనూ నాకు ఇలాంటి మద్దతు లభిస్తుందని అనిపించలేదు’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..