బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ : ఇప్పుడేమో ఇలా.. అప్పుడు ధోనీ ఏం చేశాడంటే..?
యాషెస్ సిరీస్(Ashes Series 2023) రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఔటైన విధానం మరోసారి క్రీడాస్ఫూర్తిపై చర్చకు తెరలేపింది. ఇదే సమయంలో గతంలో ధోనీ(MS Dhoni) ప్రవర్తించిన తీరును పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్ : యాషెస్ సిరీస్(Ashes Series 2023) రెండో టెస్టు ముగిసింది. ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అయితే.. చివరి రోజు ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో(Jonny Bairstow ) ఔటైన విధానం వివాదాస్పదంగా మారింది. దీంతో పెద్ద ఎత్తున క్రీడా స్ఫూర్తిపై మరోసారి చర్చ మొదలైంది. ఆసీస్ ప్రవర్తనపై పలువురు విమర్శలు చేస్తుండగా.. అది సరైనదేనంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే మహేంద్ర సింగ్ ధోనీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తిని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
ఇప్పుడేం జరిగిందంటే..
యాషెస్ సిరీస్(Ashes Series 2023) రెండో టెస్టు(ENG vs AUS) చివరి రోజు తొలి సెషన్ ఆటలో ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్ బౌన్సర్ను తప్పించుకునేందుకు బెయిర్స్టో(Jonny Bairstow ) కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ అప్పీల్ చేయగా.. బెయిర్స్టో, స్టోక్స్తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు, స్టాండ్స్లోని అభిమానులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. బెయిర్స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి మూడో అంపైర్ ఎరాస్మస్ నాటౌట్ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్ కాలేదని భావించి బెయిర్స్టోను అతడు స్టంపౌట్గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాక్లో మునిగిపోయారు. ఆసీస్ కెప్టెన్ కమిన్స్తో బెయిర్స్టో, మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ స్టోక్స్ మాట్లాడినా ఫలితం లేకపోయింది.
గతంలో ధోనీ ఏం చేశాడంటే..?
అయితే.. గతంలో 2011లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు(IND vs ENG) లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కానీ ధోనీ(MS Dhoni) క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఔటై మైదానం వీడి వెళ్లిన ఇయాన్ బెల్ను వెనక్కి రప్పించి మరీ ఆడించాడు.
ఇంగ్లాండ్, భారత్ల మధ్య నాటింగ్హామ్ వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్లో ఇషాంత్ శర్మ వేసిన బంతిని ఇయాన్ మోర్గాన్ లెగ్సైడ్ వైపు ఆడాడు. ఫీల్డర్ ప్రవీణ్ కుమార్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపాడు. అయితే.. ఇంగ్లాండ్ బ్యాటర్లు అది రోప్ను టచ్ చేసి ఉంటుందని భావించారు.
అప్పటికే.. బ్యాటర్లు క్రీజు నుంచి బయటకి వచ్చి నిల్చున్నారు. ప్రవీణ్ వెంటనే బంతినందుకుని వికెట్ కీపర్ ధోనీ వైపు విసిరాడు. మహీ వెంటనే ఫీల్డర్కు బంతినందించగా.. బెయిల్స్ గిరాటేశాడు. అయితే.. ఆ బంతి బౌండరీయా.. కాదా..? అని తేల్చేందుకు థర్డ్ అంపైర్కు రెఫర్ చేశారు. అది బౌండరీ కాదని తేలడంతో.. మరో ఎండ్లో ఉన్న ఇయాన్ బెల్ రనౌట్ అయినట్లు థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే.. ఈ సమయంలో మహేంద్రుడు మాత్రం క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. తన రనౌట్ అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు. అదే సమయంలో టీ విరామం కోసం ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. విరామం అనంతరం మోర్గాన్తో కలిసి బెల్ క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేశాడు.
ఇదే సమయంలో కామెంటేటర్లు స్పందిస్తూ..‘‘బౌండరీ లైన్ను తాకనందున.. బంతి ఇంకా యాక్షన్లోనే ఉంది.. డెడ్ కాలేదు. అయితే.. అది ఫోర్ అని భావించి ఇద్దరు బ్యాటర్లు క్రీజు దాటారు. అది ఫోర్ కాకుంటే.. ఔటే’ అంటూ పేర్కొన్నారు. అయితే.. ధోనీ మాత్రం.. క్రీడాస్ఫూర్తిని చాటి ఇంగ్లాండ్ బ్యాటర్ను తిరిగి బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీనిపై ఇంగ్లాండ్ అభిమానుల నుంచి ధోనీ మన్ననలు పొందాడు.
ఇప్పుడు అదే రీతిలో ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్స్టో ఔటయ్యాడు. అయితే.. ఆసీస్ కెప్టెన్ అప్పీల్ను వెనక్కి తీసుకోలేదు. దీంతో అప్పటి ఘటనను గుర్తు చేసుకుంటూ పలువురు ధోనీని మెచ్చుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన