T20 League : రెండు జట్లు ఫిక్స్.. మరో రెండింటి కోసం టఫ్ ఫైట్
ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో ముప్పావు మ్యాచులు ముగిసినా టాప్-4 జాబితాలో ఉండే జట్లు ఏంటనేవి ఇంకా తెలియలేదు. మ్యాచులు జరిగే కొద్దీ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకునే జట్లేవో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొన్ని జట్లేమో వరుసగా...
ఎక్కువ అవకాశాలు ఉన్న జట్లపై ప్రత్యేక కథనం
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో ముప్పావు మ్యాచులు ముగిసినా టాప్-4 జాబితాలో ఉండే జట్లు ఏంటనేవి ఇంకా తెలియలేదు. మ్యాచులు జరిగే కొద్దీ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకునే జట్లేవో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొన్ని జట్లేమో వరుసగా ఓటమి బాట పట్టగా.. మరికొన్నేమో విజయాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పటి వరకు లీగ్ దశలో 56 మ్యాచ్లు ముగిశాయి. ఇందులో రెండు జట్లు దాదాపు ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగతా రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయో తేలాల్సి ఉంది. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం..
తొలిసారే బెర్తులు ఖరారు..
హేమాహేమీలను కాదని కొత్త జట్లు లఖ్నవూ, గుజరాత్ ఈ సీజన్లో దూసుకుపోతున్నాయి. రెండు జట్లూ తలో పదకొండేసి మ్యాచ్లను ఆడేశాయి. ఎనిమిదేసి విజయాలతో ఉన్నాయి. అయితే కాస్త రన్రేట్ ఎక్కువగా ఉండటంతో లఖ్నవూ (16) గుజరాత్ (16) కంటే ముందుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్లకు ఇంకా మూడేసి మ్యాచ్లు ఉన్నాయి. వాటిల్లో ఓడినా సరే పదహారేసి పాయింట్లతో టాప్-4లో మాత్రం ఉండటం పక్కా. కాబట్టి గుజరాత్, లఖ్నవూ దాదాపు ప్లేఆఫ్స్కు వెళ్లినట్లే.
మిగిలిన మ్యాచ్లు..
* లఖ్నవూ: గుజరాత్, రాజస్థాన్, కోల్కతా
* గుజరాత్: లఖ్నవూ, చెన్నై, బెంగళూరు
రెండు జట్లకే ఎక్కువ అవకాశాలు
లఖ్నవూ, గుజరాత్ టీమ్ల తర్వాత పాయింట్ల పట్టికలో రాజస్థాన్ (14), బెంగళూరు (14) వరుసగా ఉన్నాయి. అయితే బెంగళూరు ఇప్పటి వరకు 12 మ్యాచులకుగాను ఏడు విజయాలు, ఐదు ఓటములతో కొనసాగుతోంది. కానీ రాజస్థాన్ మాత్రం 11 మ్యాచుల్లోనే ఏడు విజయాలు నమోదు చేసింది. కాబట్టి బెంగళూరు కంటే రాజస్థాన్కే కాస్త అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ మిగతా మూడు మ్యాచ్లను కనీసం రెండు గెలిస్తే రాజస్థాన్ ఖాయంగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. అదేవిధంగా బెంగళూరు తన చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే మాత్రం ఇతర జట్ల సమీకరణాలతో అవసరం లేకుండానే ప్లేఆఫ్స్కు వెళ్తుంది. అలా కాకుండా ఒకటే గెలిస్తే రన్రేట్ను బట్టి అడుగు ముందుకు పడుతుందో లేదో చూడాలి.
మిగిలిన మ్యాచ్లు..
* రాజస్థాన్: దిల్లీ, లఖ్నవూ, చెన్నై
* బెంగళూరు: పంజాబ్, గుజరాత్
ఈ మూడు ముందుకు సాగేనా..?
వరుసగా ఐదు మ్యాచ్లను గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన హైదరాబాద్ ఆ తర్వాత నాలుగు ఓటములతో డీలా పడింది. హైదరాబాద్తో పాటు దిల్లీ, పంజాబ్ జట్లు కూడా ఐదేసి విజయాలతో 10 పాయింట్లు సాధించాయి. ప్రస్తుతం దిల్లీ ఐదు, హైదరాబాద్ ఆరు, పంజాబ్ ఏడో స్థానాల్లో నిలిచాయి. ఇంకా ఈ జట్లకు మూడేసి మ్యాచ్లు ఉన్నాయి. అన్నింట్లోనూ గెలిస్తే తప్పకుండా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్కటి ఓడినా రేసు నుంచి తప్పుకుని ఇంటిముఖం పట్టక తప్పదు. హైదరాబాద్, పంజాబ్ కంటే దిల్లీకే ఛాన్సులు అధికం. నెట్రన్రేట్ ఎక్కువ ఉండటం కలిసొస్తుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మిగిలిన మ్యాచ్లు..
* హైదరాబాద్: కోల్కతా, ముంబయి, పంజాబ్
* దిల్లీ: రాజస్థాన్, పంజాబ్, ముంబయి
* పంజాబ్: హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు
అద్భుతాలే జరగాలి..
పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి (4) ప్లేఆఫ్స్ చేరే అవకాశమే లేదు. మరోవైపు తొమ్మిదో స్థానంలో ఉన్న చెన్నై (8).. అద్భుతాలు జరిగితే తప్ప టాప్-4లో నిలవదు. ఇక ఎనిమిదిలో ఉన్న పంజాబ్ (10), ఏడులో ఉన్న కోల్కతా (10) ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో శక్తికి మించి రాణించాలి. అవి విజయం సాధించినా ఇతర జట్లతో రన్రేట్ పరంగా మెరుగ్గా ఉండాలి.
మిగిలిన మ్యాచ్లు..
* చెన్నై: ముంబయి, గుజరాత్, రాజస్థాన్
* కోల్కతా: హైదరాబాద్, లఖ్నవూ
* ముంబయి: చెన్నై, హైదరాబాద్, దిల్లీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్