IND vs ENG: జోరూట్ను కట్టడి చేయాలంటే ఎలా?
జోరూట్ ప్రస్తుత టెస్టు క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. గతేడాది టీమ్ఇండియాపై వరుస సెంచరీలు చేసి అదరగొట్టాడు...
టీమ్ఇండియాకు పెను సవాల్ అతడే..!
జోరూట్ ప్రస్తుత టెస్టు క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. గతేడాది టీమ్ఇండియాపై వరుస సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఇటీవల 10 వేల పరుగుల మైలురాయి చేరుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరోవైపు గత నాలుగు టెస్టుల్లో రెండు శతకాలు బాది మరింత జోరుమీదున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా త్వరలో ఇంగ్లాండ్తో ఆడే టెస్టు మ్యాచ్లో రూట్ను కట్టడి చేయడంపైనే ప్రధానంగా విజయావకాశాలు ఆధారపడ్డాయి.
చరిత్ర తిరగరాయాలేంటే..
టీమ్ఇండియా ఇప్పటివరకు ఇంగ్లాండ్లో మూడుసార్లు మాత్రమే టెస్టు సిరీస్లు గెలిచింది. అది కూడా 1972లో 1-0.. 1986లో 2-0.. 2007లో 1-0 తేడాలతో. అయితే, ఇప్పుడు తొలిసారి 3-1తో గెలుపొంది చరిత్ర తిరగరాసే అద్భుత అవకాశం దొరికింది. వాస్తవానికి ఐదు టెస్టుల ఈ సిరీస్ గతేడాదే పూర్తికావాల్సి ఉన్నా కరోనా కేసుల కారణంగా చివరి మ్యాచ్ వాయిదా పడింది. అప్పటికి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు రెండు 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే వాయిదాపడిన చివరి టెస్టు జులై 1 నుంచి ఎడ్జ్బాస్టన్లో జరగనుంది. దీంతో ఇంగ్లిష్ గడ్డపై టీమ్ఇండియా చారిత్రక సిరీస్ గెలవాలన్నా.. ఇంగ్లాండ్ ఆధిపత్యానికి కళ్లెం వేయాలన్నా భారత బౌలర్లు తప్పక రాణించాలి. ఇదివరకు రూట్ను ఔట్ చేసిన వారిలో బుమ్రా, అశ్విన్, జడేజా, కీలక పాత్ర పోషించారు.
బుట్టలో వేయలంటే బుమ్రా..
టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో రూట్ ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 6 సార్లు ఔటయ్యాడు. భారత్ తరఫున అత్యధికసార్లు అతడిని పెవిలియన్ పంపింది ఈ టీమ్ఇండియా పేసరే. గతేడాది పర్యటనలోనూ నాలుగు మ్యాచ్ల్లో బుమ్రా.. మూడు సార్లు రూట్ను వెనక్కి పంపాడు. దీన్ని బట్టి అతడిని కట్టడి చేయడంలో బుమ్రా ఎంత ముఖ్య భూమిక పోషిస్తాడో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రూట్ను డకౌట్గా వెనక్కి పంపిన ఏకైక బౌలర్ బుమ్రానే కావడం గమనార్హం. అతడు విసిరే బుల్లెట్లలాంటి బంతులకు రూట్ పలుమార్లు ఎల్బీడబ్ల్యూగా, పలుమార్లు స్లిప్లో దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో రూట్ ఇన్సైడ్ వచ్చే బంతుల్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడని తెలుస్తోంది. దీన్ని బట్టి బుమ్రా బంతిని వికెట్ టు వికెట్ సంధిస్తే కాస్త ఇన్స్వింగ్ ప్రయోగిస్తే కట్టడి చేయొచ్చు.
ఊరించి ఆడించాలంటే జడేజా..
రవీంద్ర జడేజా బౌలింగ్లోనూ రూట్ ఇబ్బందిపడిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా 2016-17 హోమ్ సిరీస్లో అతడిని ఎక్కువ కష్టపెట్టింది ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరే. మొత్తంగా ఇద్దరి మధ్య జరిగిన పోటీల్లో జడ్డూనే 5 సార్లు రూట్ను ఔట్చేసి పైచేయి సాధించాడు. అయితే, గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. జడేజా స్పిన్లో పేస్తో పాటు కచ్చితత్వం ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే అతడు వికెట్లకు కాస్త ముందు ఊరించే బంతులు వేస్తే బ్యాట్స్మన్ టెంప్ట్ అయ్యి ఫ్రంట్ఫుట్ మీదుగా షాట్లు ఆడతారు. అది మిస్ అయితే బౌల్డ్ లేదా స్టంపౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వికెట్ల మీదుగా ఆడినా క్యాచ్ ఔట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. రూట్ కూడా పలుమార్లు జడ్డూ బౌలింగ్లో ఈ ట్రిక్కు బలయ్యాడు.
స్పిన్ వలలో చిక్కాలంటే అశ్విన్..
ఇక రూట్ను బాగా ఇబ్బంది పెట్టే బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకడు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ కూడా మెరుగైన ఫలితాలు సాధించాడు. మొత్తం 5 సార్లు రూట్ను ఔట్ చేసి తన ఆధిపత్యం చాటుకున్నాడు. గతేడాది ఇంగ్లాండ్ భారత్లో పర్యటించినప్పుడు కూడా రూట్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. అప్పుడు అక్షర్ పటేల్ మూడు సార్లు రూట్ను ఔట్ చేయగా అశ్విన్ సైతం రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ చేశాడు. ముఖ్యంగా అశ్విన్ వేసే క్యారమ్ బాల్ బంతులకు రూట్ కాస్త ఇబ్బంది పడినట్లు గతేడాది చూశాం. అయితే, గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో అశ్విన్కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. మరి ఇప్పుడైనా అవకాశం వస్తుందా లేదా చూడాలి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం