Sikandar Raza: విరాట్ను అధిగమించాడు.. పాక్ను పడగొట్టాడు.. ఎవరీ సికందర్ రజా!
సికందర్ రజా.. ఇప్పుడు జింబాబ్వే క్రికెట్లో సంచలనం. టీ20 ప్రపంచకప్లో పాక్ను జింబాబ్వే ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులను తుడిచి పెట్టాడు. జింబాబ్వే జట్టులో కీలక ప్లేయర్గా ఎదిగాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లో పుట్టి.. పాక్ క్రికెట్ జట్టునే గడగడలాడించిన సికందర్ రజా.. ఇప్పుడు జింబాబ్వేలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆల్రౌండర్. కీలకమైన పోరులో మూడు వికెట్లు తీసి పాక్పై సంచలన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. జింబాబ్వే మ్యాచ్ గెలిస్తే చాలు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రజాదే. అంతలా జింబాబ్వే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సికిందర్ రజా టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులను అధిగమించేశాడు. మరి ఆ రికార్డు ఏంటి.. అతడి ప్రస్థానం ఎలా ప్రారంభమైందో కూడా తెలుసుకోండి.
పాకిస్థాన్లోని పంజాబ్ సియాల్కోట్లో 1986లో జన్మించిన సికందర్ రజా.. అక్కడి ఎయిర్ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. అయితే 2002లో అతడి కుటుంబం జింబాబ్వేకి వలస వచ్చేసింది. దేశీయ పోటీల్లో అత్యద్భుత ప్రదర్శనతో జింబాబ్వే జాతీయ క్రికెట్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2013లో జాతీయ జట్టుకు ఎంపికైన సికందర్ రజా ఇప్పటి వరకు 17 టెస్టులు, 123 వన్డేలు, 61 టీ20లు ఆడాడు.
కోహ్లీని ఎలా అధిగమించాడంటే..
ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో ఇప్పటి వరకు జింబాబ్వే నాలుగు మ్యాచ్లను ఆడింది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అర్హత మ్యాచుల్లో మూడు.. సూపర్ -12 దశలో ఒక దాంట్లో తలపడింది. మూడు మ్యాచుల్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్ను ఓడింది. గెలిచిన అన్ని మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ విన్నర్గా సికందర్ రజా రికార్డు సృష్టించాడు. ఇలా ఒకే ప్రపంచకప్లో మూడుసార్లు ఇలాంటి అవార్డు అందుకోవడం విశేషం. విరాట్ కోహ్లీ 2016 పొట్టి కప్లో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అలాగే ఒకే ఏడాదిలో టీ20 ఫార్మాట్లో విరాట్ 6 అవార్డులను అందుకోగా.. సికందర్ రజా ఇప్పటికే ఏడింటిని సొంతం చేసుకొని మరో రికార్డును ఖాతాలో వేసుకొన్నాడు. ప్రస్తుత ప్రపంచ కప్లో విరాట్ కూడా ఒక అవార్డు అందుకొన్న విషయం తెలిసిందే. ఇద్దరూ మంచి ఫామ్లో ఉండటంతో ఈసారి వీరిద్దరి మధ్య పోటాపోటీ ఉండే అవకాశం ఉంది.
జింబాబ్వే తరఫున 2013లో అరంగేట్రం చేసిన సికందర్ రజా మరుసటి ఏడాదే వన్డేల్లో తొలి శతకం బాదాడు. 2015లో రెండు సెంచరీలు సాధించాడు. అయితే తర్వాత సంవత్సరం నుంచి గతేడాది వరకు దాదాపు ఆరేళ్లపాటు ఒక్క శతకం లేకుండా ఉండటం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం శక్తిసామర్థ్యాలను ఈ ఏడాదే ప్రయోగించాడు. 15 ఇన్నింగ్స్ల్లోనే మూడు శతకాలు బాదేయడమే కాకుండా.. 645 పరుగులు సాధించాడు. అందులో టీమ్ఇండియాపైనా ఒక సెంచరీ ఉంది. అలాగే టీ20 ఫార్మాట్లోనూ 20 ఇన్నింగ్స్ల్లో ఐదు అర్ధశతకాలతో 661 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో 1,185 పరుగులు చేయగా.. ఈ ఏడాదిలోనే సగాకిపైగా చేయడం విశేషం.
బంగ్లాదేశ్ను చితక్కొట్టడంతో వెలుగులోకి..
దాదాపు పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. రాని క్రేజ్ బంగ్లాదేశ్తో వన్డే సిరీస్తోపాటు ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో వచ్చింది. మూడువన్డేల సిరీస్లో భాగంగా బంగ్లాపై వరుస పెట్టి శతకాలు బాది జింబాబ్వేకు సిరీస్ను సాధించి పెట్టాడు. టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో బ్యాటింగ్కు వచ్చి మరీ సెంచరీ కొట్టడం నిజంగా అద్భుతం. తాజాగా టీ20 ప్రపంచకప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేరుస్తున్నాడు. బ్యాటింగ్లో విఫలమైతే.. బౌలింగ్లో రాణించైనా సరే కీలక పాత్ర పోషించడం విశేషం. పాకిస్థాన్ మీద సంచలన విజయం సాధించిన మ్యాచ్లోనూ బ్యాటింగ్లో విఫలమైన సికందర్ రజా.. బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను గెలిపించాడు. ఇదే ఫామ్ను కొనసాగిస్తే మాత్రం జింబాబ్వే సూపర్ -12 దశలో అద్భుతాలు చేసే జట్టుగా మారడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్