Sikandar Raza: విరాట్ను అధిగమించాడు.. పాక్ను పడగొట్టాడు.. ఎవరీ సికందర్ రజా!
సికందర్ రజా.. ఇప్పుడు జింబాబ్వే క్రికెట్లో సంచలనం. టీ20 ప్రపంచకప్లో పాక్ను జింబాబ్వే ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులను తుడిచి పెట్టాడు. జింబాబ్వే జట్టులో కీలక ప్లేయర్గా ఎదిగాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్లో పుట్టి.. పాక్ క్రికెట్ జట్టునే గడగడలాడించిన సికందర్ రజా.. ఇప్పుడు జింబాబ్వేలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆల్రౌండర్. కీలకమైన పోరులో మూడు వికెట్లు తీసి పాక్పై సంచలన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. జింబాబ్వే మ్యాచ్ గెలిస్తే చాలు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రజాదే. అంతలా జింబాబ్వే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సికిందర్ రజా టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులను అధిగమించేశాడు. మరి ఆ రికార్డు ఏంటి.. అతడి ప్రస్థానం ఎలా ప్రారంభమైందో కూడా తెలుసుకోండి.
పాకిస్థాన్లోని పంజాబ్ సియాల్కోట్లో 1986లో జన్మించిన సికందర్ రజా.. అక్కడి ఎయిర్ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. అయితే 2002లో అతడి కుటుంబం జింబాబ్వేకి వలస వచ్చేసింది. దేశీయ పోటీల్లో అత్యద్భుత ప్రదర్శనతో జింబాబ్వే జాతీయ క్రికెట్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2013లో జాతీయ జట్టుకు ఎంపికైన సికందర్ రజా ఇప్పటి వరకు 17 టెస్టులు, 123 వన్డేలు, 61 టీ20లు ఆడాడు.
కోహ్లీని ఎలా అధిగమించాడంటే..
ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో ఇప్పటి వరకు జింబాబ్వే నాలుగు మ్యాచ్లను ఆడింది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అర్హత మ్యాచుల్లో మూడు.. సూపర్ -12 దశలో ఒక దాంట్లో తలపడింది. మూడు మ్యాచుల్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్ను ఓడింది. గెలిచిన అన్ని మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ విన్నర్గా సికందర్ రజా రికార్డు సృష్టించాడు. ఇలా ఒకే ప్రపంచకప్లో మూడుసార్లు ఇలాంటి అవార్డు అందుకోవడం విశేషం. విరాట్ కోహ్లీ 2016 పొట్టి కప్లో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అలాగే ఒకే ఏడాదిలో టీ20 ఫార్మాట్లో విరాట్ 6 అవార్డులను అందుకోగా.. సికందర్ రజా ఇప్పటికే ఏడింటిని సొంతం చేసుకొని మరో రికార్డును ఖాతాలో వేసుకొన్నాడు. ప్రస్తుత ప్రపంచ కప్లో విరాట్ కూడా ఒక అవార్డు అందుకొన్న విషయం తెలిసిందే. ఇద్దరూ మంచి ఫామ్లో ఉండటంతో ఈసారి వీరిద్దరి మధ్య పోటాపోటీ ఉండే అవకాశం ఉంది.
జింబాబ్వే తరఫున 2013లో అరంగేట్రం చేసిన సికందర్ రజా మరుసటి ఏడాదే వన్డేల్లో తొలి శతకం బాదాడు. 2015లో రెండు సెంచరీలు సాధించాడు. అయితే తర్వాత సంవత్సరం నుంచి గతేడాది వరకు దాదాపు ఆరేళ్లపాటు ఒక్క శతకం లేకుండా ఉండటం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం శక్తిసామర్థ్యాలను ఈ ఏడాదే ప్రయోగించాడు. 15 ఇన్నింగ్స్ల్లోనే మూడు శతకాలు బాదేయడమే కాకుండా.. 645 పరుగులు సాధించాడు. అందులో టీమ్ఇండియాపైనా ఒక సెంచరీ ఉంది. అలాగే టీ20 ఫార్మాట్లోనూ 20 ఇన్నింగ్స్ల్లో ఐదు అర్ధశతకాలతో 661 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో 1,185 పరుగులు చేయగా.. ఈ ఏడాదిలోనే సగాకిపైగా చేయడం విశేషం.
బంగ్లాదేశ్ను చితక్కొట్టడంతో వెలుగులోకి..
దాదాపు పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. రాని క్రేజ్ బంగ్లాదేశ్తో వన్డే సిరీస్తోపాటు ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో వచ్చింది. మూడువన్డేల సిరీస్లో భాగంగా బంగ్లాపై వరుస పెట్టి శతకాలు బాది జింబాబ్వేకు సిరీస్ను సాధించి పెట్టాడు. టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో బ్యాటింగ్కు వచ్చి మరీ సెంచరీ కొట్టడం నిజంగా అద్భుతం. తాజాగా టీ20 ప్రపంచకప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేరుస్తున్నాడు. బ్యాటింగ్లో విఫలమైతే.. బౌలింగ్లో రాణించైనా సరే కీలక పాత్ర పోషించడం విశేషం. పాకిస్థాన్ మీద సంచలన విజయం సాధించిన మ్యాచ్లోనూ బ్యాటింగ్లో విఫలమైన సికందర్ రజా.. బౌలింగ్లో మాత్రం అదరగొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను గెలిపించాడు. ఇదే ఫామ్ను కొనసాగిస్తే మాత్రం జింబాబ్వే సూపర్ -12 దశలో అద్భుతాలు చేసే జట్టుగా మారడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్