IPL 2023 : ఎవరీ సుయాశ్ శర్మ..? అందరి దృష్టి ఈ మిస్టరీ స్పిన్నర్పైనే..
అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టాడు సుయాశ్ శర్మ(Suyash Sharma). మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ మిస్టరీ స్పిన్నర్పైనే ఉంది.
ఇంటర్నెట్డెస్క్ : తన స్పిన్ మాయాజాలంతో రెండో మ్యాచ్లో బెంగళూరు (Royal Challengers Bangalore)ను చిత్తు చేసింది కోల్కతా నైట్రైడర్స్(Kolkata Knight Riders). తొలి మ్యాచ్లో ఓటమి అనంతరం గొప్పగా పుంజుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం అభిమానుల దృష్టి ఆ జట్టు యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ(Suyash Sharma)పైనే ఉంది. అరంగేట్ర మ్యాచ్లోనే 3 వికెట్లు తీసిన ఈ మిస్టరీ స్పిన్నర్.. బెంగళూరు బ్యాటింగ్ లైనప్ వెన్ను విరిచి సత్తా చాటాడు. దీంతో ఈ 19 ఏళ్ల యువ స్పిన్నర్ గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు.
తొలి మ్యాచ్లోనే ‘ఇంపాక్ట్’ చూపించి..
దిల్లీ కుర్రాడైన సుయాశ్ శర్మ(Suyash Sharma) అండర్-25లో దిల్లీ తరఫున ఆడుతున్నాడు. అయితే, కోల్కతాతో అరంగేట్రం చేసే వరకూ అతడు ఇప్పటివరకూ ఎలాంటి లిస్ట్-ఏ, ఫస్ట్క్లాస్, టీ20 మ్యాచ్లు ఆడలేదు. అతడిని కేకేఆర్ జట్టు గతేడాది వేలం సందర్భంగా కేవలం రూ.20లక్షల బేస్ ప్రైజ్కే కొనుగోలు చేసింది. ఇక బెంగళూరుతో మ్యాచ్లో సుయాశ్ తుదిజట్టులో కూడా లేడు. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి తొలి మ్యాచ్లోనే తన సత్తా ఏమిటో చూపించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంతిని సుడులు తిప్పుతూ.. బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. దినేశ్ కార్తిక్, రావత్, కర్ణ్శర్మల వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన మరో మిస్టరీ స్పినర్ వరుణ్ చక్రవర్తితో కలిసి బెంగళూరు పతనాన్ని శాసించాడు.
క్రికెట్లోకి అలా వచ్చాడు..
చిన్నతనంలోనే సుయాశ్ ప్రతిభ గుర్తించిన వెటరన్ క్రికెట్ కోచ్ సురేశ్ బాత్రా.. అతడి గురించి దిల్లీ మాజీ క్రికెటర్ కర్తార్ నాథ్కు తెలియజేశాడు. దీంతో నాథ్ సుయాశ్ను పిలిపించి.. అతడి బౌలింగ్ను పరిశీలించాడు. అనంతరం డీడీసీఏ లీగ్లో అవకాశం ఇచ్చాడు. ఉత్తర దిల్లీకి చెందిన సుయాశ్..ఇంట్లో అందరికంటే చిన్నవాడు. అతడికి సోదరుడి నుంచి ఎంతో సహకారం లభించింది. కరోనా పరిస్థితులకు ముందు నాథ్.. సుయాశ్కు దిల్లీ అండర్-19 జట్టులో అవకాశం ఇప్పించేందుకు ఏకంగా పోరాటమే చేశాడు. కానీ, అది ఫలించలేదు. ఆ తర్వాత మాజీ ఆటగాడు గురుశరణ్ సింగ్ దిల్లీ క్రికెట్ సలహా సంఘంలో సభ్యుడయ్యాడు. దీంతో నాథ్ ఆయన వద్దకు వెళ్లి సుయాశ్ గురించి చెప్పాడు. దీనిపై ఓ సందర్భంలో గురుశరణ్ మాట్లాడుతూ ‘‘ కర్తార్ నాథ్ అతడి గురించి నాకు చెప్పాడు. నేను కూడా ఆ కుర్రాడి బౌలింగ్కు ముగ్దుడినయ్యాను. పత్రాలకు సంబంధించి చిన్న సమస్యలు ఉన్నాయి. నాటి డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ సమస్యలను పరిష్కరించి సుయాశ్ను అండర్-25 ఎంపిక చేయడంలో సహకరించాడు’’ అని వెల్లడించాడు.
అయితే.. పెద్దగా అవకాశాలు రాని సమయంలో సుయాశ్ తల్లి.. అతడు ఇక క్రికెట్ ఆడడని చెప్పిందని నాథ్ అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు. ‘2020లో సుయాశ్ తల్లి నన్ను పిలిచింది. అతడు ఇక క్రికెట్ ఆడడని చెప్పింది. అయితే.. కరోనా పరిస్థితులను వివరించి.. మాకు కొంత సమయం ఇవ్వాలని ఆమెను కోరాం. చివరికి ఆమె అంగీకరించింది’ అని నాథ్ వెల్లడించాడు.
అతడి బౌలింగ్ అంచనా వేయడం కష్టం..
ఇక ఈ ఐపీఎల్ వేలం ప్రక్రియకు ముందు ముంబయిలోని కేకేఆర్ అకాడమీకి వెళ్లాడు సుయాశ్. ‘వేలానికి ముందు ఇతర యువ ఆటగాళ్లతో సుయాశ్ ఆటను పరిశీలించారు.. అతడి గూగ్లీలను మెచ్చుకున్నారు. అతడు ఏ జట్టులో ఉన్నా.. మెరుస్తాడని భావించారు’ అని అండర్-25 మాజీ కోచ్ పంకజ్ సింగ్ తెలిపాడు. ఒక్కసారి కేకేఆర్కు ఎంపిక కాగానే.. సుయాశ్ నెట్స్లో తన స్పిన్ను మెరుగుపరుచుకునేందుకు ఎంతో సాధన చేశాడు. అతడి బౌలింగ్ను చూసినవారు.. అనుభవజ్ఞులైన బ్యాటర్లు కూడా అతడి విసిరే బంతులను అంచనా వేయడం కష్టంగా ఉందని చెప్తుండేవారు.
అతడు సాధారణ ఆటగాడిగా కనిపించలేదు..
సుయాశ్ బౌలింగ్ ప్రదర్శనపై కోల్కతా కెప్టెన్తో పాటు పలువురు సీనియర్లు ప్రశంసలు కురిపించారు. ‘ఆర్సీబీ బ్యాటర్లకు మిడిల్ ఓవర్లలో పేస్ను ఆఫర్ చేయకూడదని మేం ప్లాన్ చేసుకున్నాం. తొలి మ్యాచే అయినా.. సుయాశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మేం అతడి గురించి ఇంతవరకూ పెద్దగా తెలుసుకోలేదు కూడా. మూడో స్పిన్నర్ అవసరమైతే అతడిని తీసుకోవాలనేది మా ప్రణాళిక. అతడు సాధారణ ఆటగాడిగా కనిపించడంలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు’ అంటూ కెప్టెన్ నితీశ్ రాణా(Nitish Rana) మెచ్చుకున్నాడు.
‘సుయాశ్ను ట్రయల్ మ్యాచ్ల్లో చూశాం. అతడి పోరాట పటిమ అద్భుతం. అతడి ప్రదర్శనతో మేం ఎంతో సంతోషంగా ఉన్నాం’ అంటూ కోల్కతా కోచ్ చంద్రకాంత్ పండిట్ కొనియాడాడు.
ఇక ఈ మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్లైన వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ కలిసి మొత్తం 9 వికెట్లు తీసి బెంగళూరును 123 పరుగులకే ఆలౌట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు