WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..
డబ్ల్యూపీఎల్ వేలం (WPL 2024 Auction) నిర్వహణకు ప్లేయర్ల జాబితా, ఫ్రాంచైజీలు సిద్ధం. ఇలాంటి కీలకమైన కార్యక్రమం నిర్వహించాలంటే ఆక్షనీర్ కూడా యాక్టివ్గా ఉండటంతోపాటు ప్లేయర్లపై అవగాహన ఉండాలి. మరి ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించబోయే మల్లికా సాగర్ గురించి తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024) సీజన్కు సంబంధించి ప్లేయర్ల వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ముంబయి వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మహిళల లీగ్ ఈ ఏడాదే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రెండో సీజన్ జరగనుంది. కీలకమైన డబ్ల్యూపీఎల్ ఆక్షన్ను సమర్థంగా నిర్వహించేందుకు మల్లికా సాగర్ సిద్ధంగా ఉన్నారు. తొలి సీజన్కూ ఆమెనే ఆక్షనీర్. దీంతో ఈమె ఎవరు? అని క్రికెట్ అభిమానులు నెట్టింట శోధన మొదలు పెట్టేశారు.
మల్లికా సాగర్ ముంబయికి చెందిన ఆర్ట్ కలెక్షన్ కన్సల్టెంట్. ప్రస్తుతం ఆర్ట్ ఇండియా సంస్థలో పనిచేస్తున్నారు. 46 ఏళ్ల మల్లికా సాగర్ వ్యక్తిగత విశేషాలు మాత్రం ఎక్కడా వెల్లడి కాలేదు. అయితే, కెరీర్ పరంగా 2000లో ఆర్ట్ కలెక్షన్ను ప్రారంభించారు. న్యూయార్క్లో మోడర్న్ ఇండియన్ ఆర్డ్ క్రిస్టీ తొలి సేల్కు క్యూరేటర్గా వ్యవహరించారు. ముంబయి పండోల్స్ ఆర్ట్ గ్యాలరీలో ఆక్షన్ను నిర్వహించిన అనుభవం అమె సొంతం. ఆ తర్వాత క్రీడల పట్ల ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. మల్లికా డబ్ల్యూపీఎల్ తొలి వేలం మాత్రమే కాకుండా.. గతంలో ప్రొ కబడ్డీ లీగ్కు (2021లో) సంబంధించిన వేలం కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పురుషుల ఐపీఎల్ 2024 వేలం కూడా మల్లికాతో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలూ వస్తున్నాయి. పురుషుల ఐపీఎల్ వేలాన్ని హ్యూ ఎడ్మీడ్స్, రిచర్డ్ మ్యాడ్లీ, చారు శర్మ ఇప్పటి వరకు నిర్వహించారు. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం జరగనున్న సంగతి తెలిసిందే.
ఇక డబ్ల్యూపీఎల్ వేలం విషయానికొస్తే.. మొత్తం 165 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 104 మంది భారత్ నుంచి, మరో 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి కూడా 15 మంది క్రికెటర్లు వేలంలోకి వచ్చారు. గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు 30 స్లాట్ల కోసం వేలంలో పాల్గొననున్నాయి. అందులోనూ గుజరాత్ అత్యధికంగా 10 మందిని కొనే అవకాశం ఉంది. ప్రతి గంటకు ఓ పది నిమిషాల బ్రేక్ సమయం బీసీసీఐ కేటాయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం