టెస్టులో స్టోక్స్.. టీ20ల్లో కోహ్లి.. వన్డేల్లో మ్యాక్స్వెల్?
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏవి అని అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. కానీ, వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్తో మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్స్ వన్డేల్లో అత్యుత్తమం అనే చర్చ నడుస్తోంది. దీంతో టీ20, టెస్టుల్లో బెస్ట్ ఇన్నింగ్స్పై చర్చ మొదలైంది.
వివిధ ఫార్మాట్లలో ఉత్తమ ఇన్నింగ్స్లపై చర్చ
క్రికెట్లో టెస్టు ఫార్మాట్ది 136 ఏళ్ల చరిత్ర.. వన్డే క్రికెట్ 52 ఏళ్లుగా సాగుతోంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్ 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏవి అని అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఒకరు ఫలానా ఇన్నింగ్స్ అద్భుతం అంటే.. ఇంకొకరు మరో ఇన్నింగ్స్ను ప్రస్తావించి దాన్ని మించింది మరొకటి లేదు అంటారు. ఐతే మరీ చరిత్ర లోతుల్లోకి వెళ్లకుండా ఆధునిక క్రికెట్ వరకు పరిశీలిస్తే.. ఉత్తమ ఇన్నింగ్స్లు ఏవన్నది ఒక అంచనాకు రావచ్చు. తాజాగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)లో మంగళవారం అఫ్గానిస్థాన్తో మ్యాచ్లో మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఆడిన ఇన్నింగ్స్ వన్డేల్లో అత్యుత్తమం అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో టెస్టులు, టీ20ల్లో ‘ది బెస్ట్’ ఇన్నింగ్స్ల గురించి మెజారిటీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
కపిల్ నుంచి మ్యాక్స్వెల్ దాకా..
వన్డే క్రికెట్లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఏది అంటే.. ఎక్కువమంది 1983 ప్రపంచకప్లో జింబాబ్వేపై కపిల్ దేవ్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ను ప్రస్తావించేవారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 17 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోతే.. కపిల్ మొండిపట్టుదలతో నిలిచి 175 పరుగుల అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించాడు. జట్టును గెలిపించాడు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్ను ఉత్తమమైందిగా పేర్కొనేవారు. ఇక 2009లో ఆస్ట్రేలియాపై ఛేదనలో సచిన్ 175 పరుగుల ఇన్నింగ్స్, 2012 ఆసియా కప్లో పాకిస్థాన్పై ఛేదనలో కోహ్లి 183 పరుగుల ఇన్నింగ్స్, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో స్టోక్స్ 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ లాంటివి కూడా గొప్ప వన్డే ప్రదర్శనలుగా పేరు తెచ్చుకున్నాయి.
ఐతే మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్ వీటికంటే ప్రతికూల పరిస్థితుల్లో సాధించింది కావడం దానికి విశిష్ఠతను తీసుకొస్తోంది. అఫ్గాన్పై 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన స్థితిలో అవతల ఒక టెయిలెండర్ను పెట్టుకుని.. డబుల్ సెంచరీ సాధించి అజేయంగా నిలవడం, జట్టును గెలిపించడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒక దశలో కాలి గాయంతో క్రీజులో నిలవడం కూడా కష్టమైన స్థితిలో మ్యాక్స్వెల్ అసాధారణ రీతిలో పోరాడిన తీరు చరిత్రలో నిలిచిపోయేదే. అందుకే చాలామంది దీన్ని ఉత్తమ వన్డే ఇన్నింగ్స్గా పేర్కొంటున్నారు.
మోడర్న్ గ్రేటెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్
సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని ఒకదాన్ని ఎంచుకోవాలంటే చాలా కష్టమే. అయితే ఆధునిక క్రికెట్లో మాత్రం బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ను ఎక్కువమంది ‘ది బెస్ట్’గా చెబుతారు. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజేతగా నిలిపిన బెన్ స్టోక్స్.. ఇంకో నెల రోజులకే టెస్టుల్లో అద్భుతం చేశాడు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్లో భాగంగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ముందు 359 పరుగుల భారీ లక్ష్యం నిలవగా.. 286 పరుగులకే ఆ జట్టు 9 వికెట్లు కోల్పోవడంతో ఓటమి లాంఛనమే అని అంతా అనుకున్నారు. స్టోక్స్ ఒక ఎండ్లో నిలబడ్డప్పటికీ... ఒక్క వికెట్టే చేతిలో ఉండగా కమిన్స్, హేజిల్వుడ్, ప్యాటిన్సన్, లైయన్లతో కూడిన బలమైన ఆసీస్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొని ఇంకో 76 పరుగులు చేయడం అసాధ్యమే అనిపించింది. కానీ లీచ్ (1 నాటౌట్)ను అవతల పెట్టుకుని అసాధారణంగా పోరాడిన స్టోక్స్ జట్టుకు సంచలన విజయాన్నందించాడు. దీన్ని మోడర్న్ గ్రేటెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్గా క్రికెట్ పండితులు పేర్కొంటారు.
8 బంతుల్లో 28 పరుగులు.. టీ20 కిరీటం కోహ్లికే
టీ20 క్రికెట్లో గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ విషయంలో అంతగా భిన్నాభిప్రాయాలు లేవు. ఆ కిరీటాన్ని కోహ్లికి కట్టబెట్టడం మీద ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేకపోవచ్చు. గత ఏడాది టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో హై ఓల్టేజ్ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ కోహ్లి ఇన్నింగ్స్ గొప్పదనం అర్థమయ్యే ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే మామూలుగానే ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. అలాంటిది బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై భారత్ ముందు 160 పరుగుల లక్ష్యం నిలవగా.. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది భారత్. ప్రతి బంతికీ వికెట్ పడేలా కనిపిస్తూ, సింగిల్ తీయడం కూడా సవాలుగా మారిన స్థితిలో కోహ్లి యోధుడిలా నిలబడి జట్టును గెలిపించిన తీరు అసామాన్యం. హార్దిక్ పాండ్య (40) విరాట్కు అండగా నిలిచినప్పటికీ.. తీవ్ర ఒత్తిడిలో కోహ్లి అద్భుతమైన షాట్లు ఆడుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించిన వైనాన్ని అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ముఖ్యంగా 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సినపుడు మ్యాచ్ మీద అందరూ ఆశలు కోల్పోగా.. హారిస్ రవూఫ్ బంతులకు కళ్లు చెదిరే సిక్సర్లు బాది మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. తర్వాతి ఓవర్లోనూ సంచలన షాట్తో జట్టుకు విజయాన్నందించాడు. ఛేదనలో, తీవ్ర ఒత్తిడిలో విరాట్ చేసిన 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్ను టీ20ల్లో ‘ది బెస్ట్’గా పేర్కొంటారు విశ్లేషకులు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు