T20 League: టీ20 లీగ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో శతకాలు బాదిన వీరులు
భారత టీ20 లీగ్ తుది అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఉత్కంఠభరింతంగా సాగుతున్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్-1లో గుజరాత్ విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లగా.. ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు గెలుపొందింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్ తుది అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఉత్కంఠభరింతంగా సాగుతున్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్-1లో గుజరాత్ విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లగా.. ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు గెలుపొందింది. శుక్రవారం రాజస్థాన్, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-2 జరగనుండగా.. ఆదివారం ఫైనల్ మ్యాచ్ని నిర్వహించనున్నారు. మరి ఇప్పటివరకు టీ20 లీగ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో శతకాలు బాదిన వీరులు ఎవరో ఓ లుక్కేద్దాం.
మురళీ విజయ్
టీ20 లీగ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో తొలిసారి శతకం బాదింది చెన్నై బ్యాటర్ మురళీ విజయ్. 2012 క్వాలిఫయర్-2లో దిల్లీ, చెన్నై జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో దిల్లీ బౌలర్లకు చెన్నై ఆటగాడు మురళీ విజయ్ చుక్కలు చూపించాడు. కేవలం 58 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. దీంతో చెన్నై 222/5 స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ 136 పరుగులకే కుప్పకూలడంతో చెన్నై 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది.
వీరేంద్ర సెహ్వాగ్
ప్లే ఆఫ్స్లో రెండో సెంచరీ బాదిన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. 2014 క్వాలిఫయర్ 2 మ్యాచ్లో చెన్నై, పంజాబ్ జట్లు తలపడ్డాయి. పంజాబ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (122; 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్లు) వీర విహారం చేశాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనకు దిగిన చెన్నై 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ 24 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
వృద్ధిమాన్ సాహా
టీ20 లీగ్ నాకౌట్ మ్యాచ్ల్లో శతకం బాదిన మూడో ఆటగాడు వృద్ధిమాన్ సాహా. 2014 ఫైనల్స్లో కోల్కతా, పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా (115; 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్లు) శతక్కొట్టాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా ఏడు వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించి టైటిల్ని ముద్దాడింది.
షేన్ వాట్సన్
టీ20 లీగ్ 2018 ఫైనల్స్లో హైదరాబాద్, చెన్నై జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చెన్నై రెండు వికెట్లు నష్టపోయి 9 బంతులు మిగిలుండగానే ఛేదించి ఛాంపియన్గా అవతరిచింది. చెన్నై విజయంలో షేన్ వాట్సన్ కీలకపాత్ర పోషించాడు. కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో 117 పరుగులు చేసిన వాట్సన్ ప్లే ఆఫ్స్లో శతకం బాదిన నాలుగో క్రికెటర్గా నిలిచాడు.
రజత్ పాటిదార్
టీ20 లీగ్ ప్లే ఆఫ్స్లో శతకం బాదిన ఐదో క్రికెటర్ రజత్ పాటిదార్. 2022 ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూ, బెంగళూరు జట్లు తలపడ్డాయి. రజత్ పాటిదార్ (112; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లు) విధ్వంసం సృష్టించడంతో బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!