No.4 in Team India: నాలుగులో నిలబడేదెవరు ... యువీ వారసుడి కోసం కొనసాగుతున్న వేట
టీమ్ ఇండియాలో యువరాజ్ సింగ్ తర్వాత ఎవరు? ఈ ప్రశ్న చాలా రోజుల నుండి వస్తూనే ఉంది. యువీ రిటైర్ అయ్యాక ఆ నాలుగో స్థానంలో ఇప్పటివరకు స్థిరమైన ఆటగాడు దొరకలేదు. దొరికినా ఇప్పుడు అందుబాటులో లేరు. వన్డే ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. మరి ఆ స్థానంలో ఎవరు?
ఇంకో నెలన్నరలో వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023). సొంతగడ్డపై జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారీ అంచనాలతో బరిలోకి దిగనున్న భారత జట్టు (Team India).. ఈ పాటికి ప్రతి స్థానంలోనూ ఒక స్థిరమైన ఆటగాడిని ఖరారు చేసుకుని ఉండాలి. కానీ టీమ్ఇండియా ఇంకా వేర్వేరు స్థానాల్లో వేర్వేరు ఆటగాళ్లను ఆడిస్తూ ప్రయోగాలు కొనసాగిస్తోంది. కీలకమైన నాలుగో స్థానం (2nd Down)లో ఎవరు ఆడతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది.
అవును.. వన్డేల్లో నాలుగో స్థానం మాకు సమస్యగా మారిన మాట వాస్తవం. ఆ స్థానంలో యువరాజ్ సింగ్ తర్వాత ఎవరూ నిలకడగా ఆడలేదు
- ఇటీవల భారత వన్డే సారథి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలివి.
వన్డే ప్రపంచకప్ సమీపిస్తుండగా.. స్వయంగా కెప్టెన్ రోహిత్ ఈ మాట అన్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ మెగా టోర్నీలో రోహిత్, శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ఆరంభించడం ఖాయం. మూడో స్థానంలో ఎప్పట్నుంచో విరాట్ కోహ్లి ఆడుతున్నాడు. కానీ అతడి తర్వాత బ్యాటింగ్కు ఎవరు వస్తారనే విషయంలో స్పష్టత లేదు. కొన్ని నెలల ముందు వరకు శ్రేయస్ అయ్యర్ ఆ స్థానంలో ఆడేవాడు. ప్రపంచకప్లోనూ అతనే నంబర్ 4లో ఆడతాడని అనుకున్నారు.
కానీ ఈ ఏడాది ఆరంభంలో గాయపడ్డ అతను.. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు కూడా దూరమయ్యాడు. ఇప్పటికీ కోలుకోలేదు. శ్రేయస్ ప్రపంచకప్లో ఆడటమూ సందేహంగానే ఉంది. గతంలో కొన్ని మ్యాచ్ల్లో నాలుగో స్థానంలో ఆడిన కేఎల్ రాహుల్ సైతం శ్రేయస్ లాగే కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స చేయించుకుని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతను కూడా ప్రపంచకప్ ఆడటం అనుమానంగానే ఉంది.
దీర్ఘ కాల సమస్య
వన్డేల్లో టీమ్ఇండియా నాలుగో నంబర్ సమస్య ఈనాటిది కాదు. రోహిత్ అన్నట్లు యువరాజ్ సింగ్ తర్వాత ఎవ్వరూ ఆ స్థానంలో కుదురుకోలేదు. టాప్ఆర్డర్, మిడిలార్డర్ మధ్య వారధిగా నిలిచే ఆ స్థానంలో యువరాజ్ దీర్ఘ కాలం బ్యాటింగ్ చేశాడు. ఆ స్థానంలో అతను 108 ఇన్నింగ్స్లు ఆడి 35.20 సగటుతో 2,415 పరుగులు సాధించాడు. కానీ 2017లో యువీ నిష్క్రమించాక ఎవ్వరూ ఆ స్థానంలో నిలదొక్కుకోలేదు. గత అయిదారేళ్లలో పది మందికి పైగానే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం గమనార్హం.
అజింక్య రహానె, మనీష్ పాండే, అంబటి రాయుడు, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. ఇలా చాలామందిని భారత్ ప్రయత్నించి చూసింది. మిగతా వారితో పోలిస్తే శ్రేయస్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 20 ఇన్నింగ్స్లో 47.35 సగటుతో 805 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లందరి గణాంకాలు పేలవం. శ్రేయస్ రూపంలో మంచి ప్రత్యామ్నాయం దొరికినట్లే అనుకునే సమయానికి అతను గాయపడి ప్రపంచకప్నకు అనుమానంగా మారడంతో ఆ స్థానంలో ఎవరిని ఆడించాలో తెలియని అయోమయం నెలకొంది.
మనోడికి ఛాన్సుందా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో సూర్య కుమార్, ఇషాన్ కిషన్ మాత్రమే నాలుగో స్థానానికి చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయాలు. కానీ టీ20ల్లో మెరుపులు మెరిపిస్తున్న సూర్యకుమార్.. వన్డేల్లో ఇంకా రుజువు చేసుకోలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్లో మెరుగ్గా ఆడుతున్నాడు కానీ.. నాలుగో స్థానానికి సరిపోడనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ గురించి చర్చ జరుగుతోంది. 20 ఏళ్ల ఈ ఎడమ చేతివాటం బ్యాటర్ ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేశాడు.
వెస్టిండీస్తో సిరీస్లో తిలక్ చక్కటి ప్రదర్శన చేశాడు. 5 మ్యాచ్ల్లో 177 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ నిలకడ, దూకుడు, పరిణతి చూసి అతణ్ని వన్డే ప్రపంచకప్నకు ఎంపిక చేయాలని మాజీలతో పాటు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. టీ20ల్లో అతనాడింది నాలుగో స్థానంలోనే కావడం విశేషం. వన్డేల్లో కూడా ఆ స్థానానికి అతను సరిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సెలక్టర్లు, జట్టు యాజమాన్యం ఆలోచన ఎలా ఉందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్