IND vs ENG: కోహ్లి లేడు.. మరి వచ్చేదెవరు?
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు కోహ్లి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇంగ్లాండ్తో కీలకమైన టెస్టు సిరీస్ (IND vs ENG 2024)కు సిద్ధమవుతున్న టీమ్ఇండియా (Team India)కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపే ఆస్కారముంది. స్వదేశంలో సిరీస్లో విరాట్ లాంటి ఆటగాడు జట్టులో లేకపోవడం తీరని లోటే. అతణ్ని భర్తీ చేసే స్థాయి ఉన్న ఆటగాడు మరొకరు లేరనే చెప్పాలి. కానీ ఇప్పుడు తొలి రెండు టెస్టుల కోసం అతని స్థానంలో మరో ఆటగాణ్ని తీసుకోక తప్పని పరిస్థితి. మరి సెలక్షన్ కమిటీ, టీమ్ఇండియా మేనేజ్మెంట్ ఎవరిని ఎంపిక చేస్తుందన్నదే ఇప్పుడు ప్రశ్న. నలుగురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. మరి జట్టులోకి వచ్చేదెవరు?
వెటరన్కు మరో ఛాన్స్?
కోహ్లి దూరమవడంతో జట్టులోకి సీనియర్ టెస్టు ఆటగాడు చెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)ను తీసుకునే అవకాశాలున్నాయి. చివరగా నిరుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పుజారా ఆడాడు. ఫామ్లో లేని కారణంగా ఆ తర్వాత అతణ్ని పరిగణించడం లేదు. కానీ ఇప్పుడు మరోసారి పుజారా గురించి సెలక్టర్లు ఆలోచించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న పుజారా మంచి ఫామ్లో ఉన్నాడు. తొలి మ్యాచ్లో ఝార్ఖండ్పై ఈ సౌరాష్ట్ర ఆటగాడు అజేయంగా 243 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత వరుసగా 49, 43, 43, 66 పరుగుల చొప్పున సాధించాడు. తాజాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక 103 టెస్టుల అనుభవం కూడా పుజారాకు కలిసొచ్చేదే.
ముందంజలో రజత్
కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చేందుకు ముగ్గురు యువ ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఇందులో రజత్ పటీదార్ (Rajat Patidar) ముందంజలో ఉన్నాడు. ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. పైగా కోహ్లి లాగే నాలుగో స్థానంలో రజత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లో భారత్- ఎ తరపున తొలి అనధికార టెస్టులో 151 పరుగులు చేశాడు. అంతకుముందు అదే జట్టులో వార్మప్ మ్యాచ్లో 111 స్కోరు సాధించాడు. 30 ఏళ్ల రజత్ ఇప్పటివరకూ 55 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 45.97 సగటుతో 4000 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలున్నాయి. ఇక 2021-22లో మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో రజత్ కీలక పాత్ర పోషించాడు. 9 ఇన్నింగ్స్ల్లో 82.25 సగటుతో 658 పరుగులు చేశాడు. ఫైనల్లో ముంబయిపై సెంచరీ సాధించాడు.
ఈ ఇద్దరూ
గత నాలుగు సీజన్ల నుంచి ముంబయి తరపున దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో 2020 ఏడాది నుంచి ఫస్ట్క్లాస్ క్రికెట్లో 82.46 సగటుతో 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది సర్ఫరాజ్ ఒక్కడే. ఈ ప్రదర్శన సర్ఫరాజ్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. భారత్లోని స్పిన్ పిచ్లపై స్పిన్ సమర్థంగా ఆడగలిగే సర్ఫరాజ్ జట్టులో కీలకమవుతాడనే అంచనాలున్నాయి. కానీ షార్ట్పిచ్ బంతులను ఆడటంలో బలహీనత, భారత్- ఎ తరపున నిలకడ లేమి అతనికి ప్రతికూలంగా మారాయి. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 26 ఏళ్ల సర్ఫరాజ్ 65 ఇన్నింగ్స్ల్లో 68.20 సగటుతో 3751 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లాండ్ లయన్స్తో తొలి అనధికార టెస్టులో అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్లో 96 పరుగులు సాధించాడు.
మరోవైపు తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ కూడా రేసులో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఇంత వేగంగా పురోగతి సాధించిన మరో ఆటగాడు లేడనే చెప్పాలి. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్లో అరంగేట్రం చేసిన అతను.. వరుసగా రెండు అర్ధసెంచరీలతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఎర్ర బంతి క్రికెట్లోనూ సుదర్శన్ నిలకడగా రాణిస్తున్నాడు. 2022-23 రంజీ ట్రోఫీలో 12 ఇన్నింగ్స్ల్లో 47.66 సగటుతో 572 పరుగులు చేశాడు. కొంతకాలంగా భారత్- ఎ తరపున ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లో 97 పరుగులు చేశాడు. మరి వీళ్లలో జట్టులోకి వచ్చేది ఎవరో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!