Bangalore: కెప్టెన్ మారినా.. తలరాత మారలేదు
ఈసారి బెంగళూరు కెప్టెన్ మారినా.. తలరాత మారలేదు. 15వ సీజన్లోనూ ఆ జట్టు ఉత్తి చేతులతోనే ఇంటిముఖం పట్టింది...
బెంగళూరు కొంపముంచింది వీళ్లే..!
ఈసారి బెంగళూరు కెప్టెన్ మారినా.. తలరాత మారలేదు. 15వ సీజన్లోనూ ఆ జట్టు ఉత్తి చేతులతోనే ఇంటిముఖం పట్టింది. గత రెండేళ్ల మాదిరే ఈసారి కూడా ప్లేఆఫ్స్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు.. ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ చేరేలాగే కనిపించింది. దీంతో అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ, రాజస్థాన్ చేతిలో ఓటమిపాలై వారి ఆశలను ఆవిరిచేసింది. బెంగళూరు ఈసారి విఫలమవ్వడానికి పలు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
కోహ్లీ ఇక మారడా..?
(Photo: Virat Kohli Instagram)
విరాట్ కోహ్లీ ఈ సారి కెప్టెన్సీ వదిలేయడంతో బ్యాట్స్మన్గా రాణిస్తాడని, అతడి బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతుందని టోర్నీ ప్రారంభానికి ముందు అభిమానులంతా ఆశించారు. కానీ, మ్యాచ్లు మొదలయ్యాక అసలు పరిస్థితి తెలిసొచ్చింది. ఆఫ్స్టంప్ బయట పడిన బంతుల్ని ఆడటంలో తన బలహీనతల్ని చాటుకుంటూ ఈ టోర్నీలో మరింత విఫలమయ్యాడు. మూడు, నాలుగు మ్యాచ్ల్లో ఫర్వాలేదనిపించినా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్పై 73 పరుగులు చేసి మళ్లీ టచ్లోకి వచ్చినట్లు సంకేతాలు ఇచ్చాడు. కానీ, ప్లేఆఫ్స్లో మళ్లీ విఫలమై పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సీజన్లో కోహ్లీ నాలుగు సార్లు సింగిల్ డిజిట్కు, మూడు సార్లు గోల్డెన్ డకౌట్గా వెనుదిరగడం గమనార్హం. దీన్నిబట్టి కోహ్లీ ఈ సీజన్లో ఎలా విఫలమయ్యాడో అర్థం చేసుకోవచ్చు. కనీసం అతడు ప్లేఆఫ్స్ లాంటి కీలక మ్యాచ్ల్లో రాణించినా బెంగళూరు పరిస్థితి మరోలా ఉండేది. మొత్తంగా కోహ్లీ ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడి 115.99 స్ట్రైక్రేట్తో 341 పరుగులు చేశాడు. సగటు 22.73గా నమోదవ్వగా 2 అర్ధశతకాలు సాధించాడు.
మాక్స్వెల్ కొట్టకపాయె..
(Photo: Glenn Maxwell Instagram)
గతేడాది మాక్స్వెల్ బెంగళూరు తరఫున అదరగొట్టాడు. అప్పుడు 15 మ్యాచ్ల్లో 144.10 స్ట్రైక్రేట్తో 42.75 సగటు నమోదు చేసి 513 పరుగులు చేశాడు. దీంతో ఈ సారి కూడా మరింత రెచ్చిపోయి ఆడతాడని ఆశించిన బెంగళూరు అతడిని అలాగే అట్టిపెట్టుకుంది. కానీ, మాక్స్వెల్ ఈసారి మంచి స్ట్రైక్రేట్ కలిగి ఉన్నా రెండు మ్యాచ్ల్లో మినహా పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకపోయాడు. పలు మ్యాచ్ల్లో ఫర్వాలేదనిపించే స్కోర్లు చేసినా అవి తన స్థాయికి తగ్గ ప్రదర్శనలు కావు. ముఖ్యంగా కీలకమైన ప్లేఆఫ్స్లో రాజస్థాన్పై 24, లఖ్నవూపై 9 పరుగులే చేసి నిరాశపరిచాడు. గతరాత్రి రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అతడు చివరి వరకూ క్రీజులో ఉంటే స్కోర్ బోర్డు మరింత పెరిగేది. కానీ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో మొత్తానికి ఈ సీజన్లో మాక్సీ 13 మ్యాచ్లు ఆడి 169.10 స్ట్రైక్రేట్తో 301 పరుగులే చేశాడు. సగటు 27.36గా నమోదు చేశాడు.
వీళ్ల గురించి అస్సలు చెప్పొద్దు..
(Photo: Mahipal Lomror Instagram)
ఇక మొదట్లో ఓపెనర్గా వచ్చిన అనుజ్ రావత్.. మిడిల్ ఆర్డర్లో మహిపాల్ లోమ్రర్, షాబాజ్ అహ్మద్ల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఈ ముగ్గురూ తలో మ్యాచ్లో మినహా జట్టును గెలిపించాలనే కసితో ఆడినట్లు కనిపించలేదు. అనుజ్ 8 మ్యాచ్ల్లో ఒకే ఒక్క అర్ధశతకంతో 129 పరుగులు చేశాడు. సగటు 16.13గా నమోదవ్వగా స్ట్రైక్రేట్ 109.32గా ఉంది. ఇక షాబాజ్ అహ్మద్ 16 మ్యాచ్ల్లో ఆడినా మొత్తం 219 పరుగులే చేశాడు. సగటు 27.38, స్ట్రైక్రేట్ 120.99. అలాగే మహిపాల్ లోమ్రర్ 4 మ్యాచ్ల్లో 86 పరుగులే చేశాడు. సగటు 17.20, స్ట్రైక్రేట్ 150.88. ప్రధాన బ్యాట్స్మెన్ విఫలమైతే బాధ్యతగా ఆడాల్సిన వీరు ఈ సీజన్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇతర జట్లలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సైతం దంచికొడుతుంటే వీళ్లు మాత్రం తమకేమీ పట్టనట్టు కనిపించారు.
అంతా దినేశ్ కార్తీక్ చలవే..
(Photo: Dinesh Karthik Instagram)
ఈ సీజన్లో బెంగళూరు తరఫున టాప్ ఆర్డర్లో అంతో ఇంతో మెరిసిన బ్యాట్స్మన్ ఎవరంటే కెప్టెన్ ఫా డుప్లెసిస్. అతడు 16 మ్యాచ్ల్లో 3 అర్ధ శతకాలతో 468 పరుగులు చేశాడు. సగటు 31.20 నమోదవ్వగా.. 127.52 స్ట్రైక్రేట్తో ఫర్వాలేదనిపించాడు. తర్వాత ఫినిషర్ పాత్ర పోషించిన దినేశ్ కార్తీక్ బెంగళూరు తరఫున అతిగొప్ప ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన మెరుపు బ్యాటింగ్తో కొన్ని విలువైన విజయాలు అందించాడు. అసలు బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడం కూడా అతడి చలవే. సీజన్ మొత్తం చివరి క్షణాల్లో అదిరిపోయే ప్రదర్శన చేసిన డీకే ఈ టోర్నీలోనే మేటి ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా 16 మ్యాచ్ల్లో 55.00 సగటుతో.. అదిరిపోయే 183.33 స్ట్రైక్రేట్తో 330 పరుగులు చేశాడు. కానీ, కీలకమైన క్వాలిఫయర్-2లో రెచ్చిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
అయితే బౌలింగ్ పరంగా బెంగళూరు ఈసారి బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. హసరంగ, హెజిల్వుడ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ లాంటి బౌలర్లు ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసి ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. కానీ బ్యాట్స్మెన్ సరిగా ఆడకపోవడమే ఆ జట్టు కొంపముంచింది. దీంతో ఈసారి కూడా బెంగళూరు ఉత్తి చేతులతో తిరిగిరావడానికి ప్రధాన కారణం బ్యాట్స్మెన్ వైఫల్యమే అని స్పష్టంగా కనిపిస్తోంది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం