KL Rahul: కేఎల్కు దక్కని చోటు.. విశ్రాంతినిచ్చారా? పక్కన పెట్టారా..?
ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ.. కేఎల్ రాహుల్ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్తో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. 50 ఓవర్లపాటు వికెట్ కీపింగ్లో మెరుపులు మెరిపించాడు. ఇటీవల టెస్టుల్లోనూ రాణించాడు. అలాంటి కేఎల్ రాహుల్ను (KL Rahul) అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు పక్కన పెట్టేయడం అభిమానులను అసంతృప్తికి గురి చేసింది. సీనియర్లు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ.. కేఎల్ విషయంలో ఇలా ఎందుకు వ్యవహరించిందనే చర్చ మొదలైంది.
అతడి స్థానం తేల్చలేకనేనా?
కేఎల్ రాహుల్ టెస్టులు, వన్డేల్లో మిడిలార్డర్లో ఆడుతున్నాడు. పొట్టి ఫార్మాట్లో ఓపెనర్గా బరిలోకి దిగేవాడు. అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ (IND vs AFG) కోసం ప్రకటించిన జట్టులో యువ బ్యాటర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. రోహిత్ శర్మతో కలిసి వీరిలో ఒకరు ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా లేదు. రోహిత్, కోహ్లీ ఉండటంతో టాప్ ఆర్డర్లోనూ ప్లేస్ లేదు. వికెట్ కీపర్లుగా జితేశ్ శర్మ, సంజూ శాంసన్ను తీసుకున్న మేనేజ్మెంట్ ఎవరిని తుది జట్టులో ఆడిస్తుందనేది ఆసక్తికరం. అటు మిడిలార్డర్లోనూ రింకు సింగ్, శివమ్ దూబె వంటి హిట్టర్లను ఎంపిక చేసింది. ఇటీవల రింకు అద్భుత ‘షినిషర్’గా మారాడు.
ఆ సిరీస్ కోసం విశ్రాంతినిచ్చారా?
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు కేఎల్ నాయకత్వం వహించాడు. రెండు టెస్టుల సిరీస్లోనూ ఆడాడు. ఈ నెల 25నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవడానికి ఇది అత్యంత కీలకం. ఇప్పటికే బుమ్రా, సిరాజ్ వంటి పేసర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. ఆ జాబితాలోకి కేఎల్ను చేర్చింది. ఐదు టెస్టుల్లో వికెట్ కీపింగ్తోపాటు మిడిలార్డర్లో రాణించాల్సిన అవసరం ఉంది. వరుసగా సిరీస్లు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చి ఉంటారని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది ప్రామాణికం కాకపోవచ్చు..
టీ20 ప్రపంచకప్ ముగింట కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 సిరీస్ను భారత్ ఆడనుంది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ అనంతరం ఐపీఎల్ 2024 సీజన్ జరగనుంది. అఫ్గాన్తో సిరీస్లో ఆడకలేక పోతే.. పొట్టి కప్లో చోటు దక్కదనే అనుమానాలు అవసరం లేదు. ఐపీఎల్లో రాణిస్తే ప్రపంచ కప్లోకి తలుపులు తెరుచుకుంటాయి. లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఆ లీగ్లో మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ జట్టులోకి రావడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!