Rajasthan: బాగా ఆడిన రాజస్థాన్ ఎందుకు కప్ కొట్టలేకపోయింది... ఏం జరిగింది?
2022 టీ20 లీగ్లో తొలుత నుంచి బాగా ఆడుతున్న రాజస్థాన్ ఎందుకు టైటిల్ సాధించలేకపోయింది.
టీ20 లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఫైనల్కి వచ్చింది. ఈ సారి టైటిల్ గెలిచి షేన్ వార్న్కి నివాళి ఇద్దామనుకున్నారు. అయితే ఫైనల్లో ఊహించని రీతిలో ఓడిపోయారు. అయితేనేం రెండో మేటి జట్టుగా క్రీడాభిమానుల ప్రేమను సాధించారు. మరి టైటిల్ ఎందుకు కొట్టలేకపోయారో ఓసారి పోస్ట్మార్టమ్ చేద్దామా?
73 మ్యాచ్లపాటు అభిమానులు వేచి చూసిన టీ20 లీగ్ ఫైనల్ నిన్న జరిగింది. అన్ని రంగాల్లో సమష్ఠిగా రాణించిన గుజరాత్ అరంగేట్ర సీజన్లోనే కప్పు సాధించింది. సిరీస్ సాంతం బాగా ఆడిన రాజస్థాన్.. ఫైనల్లో బొక్క బోర్లాపడింది.
బలమే బలహీనత...
టీ20 లీగ్ 2022లో రాజస్థాన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో జాస్ బట్లర్ ఒకటి. సిరీస్ ప్రారంభంలో బట్లర్ బాదుడు చూసి ఈ ఏడాది రాజస్థాన్ టైటిల్ కొట్టేయడం పక్కా అనుకున్నారంతా. అంతలా విరుచుకుపడ్డాడు. నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలతో సీజన్లో 863 పరుగులు చేశాడు బట్లర్. బ్యాటింగ్లో ఈ ఏడాది అత్యధికాలు అన్నీ బట్లర్వే. అంతలా బలంగా కనిపించిన బట్లరే... బలహీనత కూడా. అందుకే బట్లర్ బాగా ఆడిన మ్యాచ్ల్లో గెలవడం, లేదంటే ఓడడం రాజస్థాన్ డైలీ రొటీన్ అయిపోయింది. అలా అని ఆడిన అన్ని మ్యాచ్లు గెలవలేదనుకోండి.
కానీ, ఫైనల్ లాంటి కీలక మ్యాచ్లో బట్లర్ బాగా ఆడాల్సి ఉంది. కీలకమైన క్వాలిఫయర్ 2లో బెంగళూరుపై సెంచరీ చేసిన బట్లర్ నుంచి ఫైనల్లో అదే ప్రదర్శన ఆశించింది రాజస్థాన్. కానీ ఆఖరి పోరులో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో జట్లు స్కోరు 130 పరుగులకే పరిమితమైపోయింది. బట్లర్ లేదంటే శాంసన్ అన్నట్లుగా ఉన్న రాజస్థాన్ బ్యాటింగ్ వాళ్లిద్దరూ పెవిలియన్కి చేరేసరికి.. మిగిలినవాళ్లూ డగౌట్కి వచ్చేశారు. రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం బలంగా మారిన బలహీనత అయిన బట్లర్ అని చెప్పొచ్చు. ఒక్కరిద్దరి మీద ఆధారపడితే మ్యాచ్లు గెలుస్తారు తప్ప టోర్నీలు కాదని సీనియర్లు ఊరికే చెప్పలేదు.
వేగం నియంత్రించలేక...
గుజరాత్ ఈ ఏడాది టాప్ టీమ్గా ఫైనల్కి చేరిందంటే దానికి కారణాల్లో ఒకటి బౌలింగ్లో వైవిధ్యం. జట్టులో 140 - 150 కి.మీల వేగంతో బంతులేసేవాళ్లు ఉన్నారు. అదే సమయంలో 120 నుంచి 130 మధ్య నిలకడగా బంతులేసేవాళ్లూ ఉన్నారు. కొన్ని పిచ్ల మీద ఆ పేస్ వేరియేషన్ చాలా అవసరం. రాజస్థాన్ బౌలర్లలో ఇది కాస్త తక్కువే అని చెప్పొచ్చు. పాండ్య లాంటి మీడియం పేసర్ రాజస్థాన్కి లేకపోయాడు. దాంతోపాటు రియాన్ పరాగ్ లాంటి ఆరో బౌలర్ ఆప్షన్ ఉన్నా వాడకపోవడం రాజస్థాన్ చేసిన తప్పు అని కూడా పరిశీలకులు అంటుంటారు.
అశ్విన్ కూడా చెయ్యేసుంటే...
రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కూడా చేస్తాడని తెలుసు. అలా ఈ ఏడాది తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. టిపికల్ టెయిలెండర్లా కాకుండా, సరైన ఆల్రౌండర్లా ఆడాడు. అయితే ఈ క్రమంలో బౌలింగ్లో పట్టుసడలింది అని చెప్పాలి. 17 మ్యాచ్ల్లో కేవలం 12 వికెట్లే తీశాడు. ఓవైపు యుజ్వేంద్ర చాహల్ 27 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచినా.. అతడు విఫలమైనప్పుడు లేదంటే వికెట్లు తీయలేనప్పుడు అశ్విన్ ఓ చెయ్యి వేయాల్సింది. కానీ అశ్విన్ నుంచి ఆ స్థాయి బౌలింగ్ ప్రదర్శన ఈ ఏడాది రాలేదు. పరుగులు నియంత్రించినా వికెట్లు అంతగా తీయలేకపోయాడు.
నలుగురే ఆడాలా...
రియాన్ పరాగ్ లాంటి యంగ్ ప్లేయర్ ఉన్నప్పటికీ సంజూ శాంసన్ కీలక సమయాల్లో రవిచంద్రన్ అశ్విన్ను ఆర్డర్లో పైకి తీసుకొచ్చి ఆడించాడు. అశ్విన్ మీద నమ్మకం ఒక కారణమైతే.. పరాగ్ ఆట మీద నమ్మకం లేకపోవడమూ ఓ కారణం అని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే మిడిలార్డర్కి, టెయిలెండర్లకు అనుసంధానంగా ఉండాల్సిన లోయరార్డర్ ఈ సిరీస్లో రాజస్థాన్కి పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. కరీబియన్ హిట్టర్ హెట్మయర్, ఇండియన్ యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఆశించిన మేర రాణించలేదు. రూ.3.8 కోట్లకు రాజస్థాన్ అతడిని కైవసం చేసుకుంది. కానీ పరాగ్ మాత్రం 132 పరుగులే చేశాడు. మరోవైపు హెట్మయర్ 204 పరుగులు చేశాడు. దీంతో జట్టుకు అవసరమైన సాయం చేయలేకపోయారు.
అందరి దారిలో వెళ్లకుండా...
2022 ఐపీఎల్లో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంటుంది అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. పొట్టి క్రికెట్లో ఛేజింగ్ చేయడమే విజయరహస్యం అని ఫ్రాంచైజీలు అనుకోవడమే దీనికి కారణం. కానీ రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫైనల్లో అందరి దారిలో వెళ్లకుండా కొత్తగా ప్రయత్నించాడు. ఛేజింగ్లో ఒత్తిడికి చిత్తవుతామనే భయమో లేక పిచ్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కానీ... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిపోయిన హార్దిక్ పాండ్యకు ఇది నెత్తిన పాలు పోసినట్లయింది. అవకాశాన్ని గట్టిగా పట్టుకున్న పాండ్య ఆండ్ కో వరుస వికెట్లు తీసి శాంసన్ నిర్ణయం ఎంత తప్పో నిరూపించారు.
అన్ని ప్రయత్నాలు చేసి...
రాజస్థాన్కి సంజూ శాంసన్ 2021లో కెప్టెన్ అయ్యాడు. తొలి సీజన్ ఏ మాత్రం కలసి రాలేదు. 14 మ్యాచ్ల్లో కేవలం ఐదింట గెలిచి ఏడో స్థానంలో నిలిచిపోయింది. అలాంటి జట్లు ఈ ఏడాది రెండో స్థానానికి వచ్చింది. అంటే సంజూ శాంసన్ ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. చాలావరకు కూల్ అండ్ కామ్గా కనిపించే శాంసన్.. తను ఆడాడు, ఆడించాడు... కానీ జట్టుకు కప్ తీసుకురాలేకపోయాడు. ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్ చేయించాలనే అప్రకటిత నియమం పెట్టుకుని, వేరియేషన్లు లేక కొన్ని మ్యాచ్లు చేజార్చుకున్నాడు. ఇది కెప్టెన్సీ లోపమే అంటున్నారు క్రీడా పండితులు.
ఏదైతే ఏముంది ఈ ఏడాది టోర్నీ గెలిచి తమ మొదటి కెప్టెన్ షేన్ వార్న్కి నివాళి ఇద్దామనుకున్న రాజస్థాన్ ఆశ నెరవేరలేదు. కొత్త ఏడాదిలో శాంసన్ కొత్త ఆలోచనలతో వస్తాడని ఆశిద్దాం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం