Cummins - SRH: కమిన్స్కు రూ. 20.5 కోట్లు... అంత అవసరమేంటి? అతని స్పెషలేంటి?
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ పాట్ కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అతని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత రేటు పెట్టింది.?
ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మీద ఎన్నో ఏళ్లుగా విమర్శలు వస్తున్నాయి. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలోనూ అదే పరిస్థితి. ఈసారి ఏమవుతుందో అనుకున్న అభిమానులకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చింది. రూ.20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కమిన్స్ను కొనుగోలు చేసింది. అసలు అంత మొత్తం ఎందుకు పెట్టింది... కమిన్స్ ప్రత్యేకత ఏంటి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఏటా భారీ అంచనాలతో బరిలోకి దిగుతుంది. తీరా అసలు ఆట మొదలయ్యే సమయానికి తీవ్రంగా నిరాశపరుస్తుంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు... ఎస్ఆర్హెచ్ (SRH) ఓటమికి చాలా కారణాలున్నాయి. అయితే గత రెండు సీజన్లుగా బాగా ఇబ్బంది పెట్టిన అంశం మాత్రం కెప్టెన్సీ. ఉన్న ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదు. సరైన స్థానంలో సరైన బ్యాటర్ను పంపడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమిన్స్ (Pat Cummins) ను హైదరాబాద్ కొనుగోలు చేసింది అంటున్నారు.
కమిన్స్ కోసం జరిగిన వేలం పాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీపడి మరీ హైదరాబాద్ సాధించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో నిలిచిన కమిన్స్కు అంత ధర పలుకుతుందని అనుకున్నవాళ్లు తక్కువే ఉంటారు. ఒకదశలో హైదరాబాద్ దూకుడు చూసి ‘ఎందుకిలా?’ అనుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ ఆసీస్ కెప్టెన్ను జట్టులోకి తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్కు అర్జెంట్గా ఓ విజయవంతమైన కెప్టెన్ కావాలి. అలాగే ఆడాలి, ఆడిపించాలి. ఇదే కమిన్స్ కోసం అంత ధర పెట్టడానికి కారణం అనుకోవచ్చు.
ప్రపంచ కప్ హీరో
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్లో కమిన్స్ సత్తా ఏంటో అందరూ చూశారు. రెండు ఓటములతో వెనుకబడినట్లు కనిపించిన జట్టును వరుసగా ఏడు విజయాలతో ఫైనల్కు చేర్చాడు. ఇదంతా ఒకెత్తు అయితే అజేయంగా ఫైనల్కు చేరిన భారత్ను ఫైనల్స్లో దెబ్బ కొట్టాడు. ఈ మొత్తం ప్రాసెస్లో కమిన్స్ మాస్టర్ మైండ్ బాగా పని చేసింది అని చెప్పాలి. తుది పోరులో తొలుత బౌలింగ్ తీసుకోవడం వెనుక ఆలోచన అప్పట్లో అర్థం కాక క్రికెట్ మైండ్స్ తలపట్టుకున్నాయి. పిచ్ను బాగా అంచనా వేయడం వల్లే కమిన్స్ అలా చేశాడు అని తర్వాత తెలిసింది.
కేవలం కమిన్స్ను కెప్టెన్సీ కోసమే తీసుకుంది అంటే తప్పనే చెప్పాలి. ఎందుకంటే ఆసీస్కు అతనో ఫ్రంట్ లైన్ బౌలర్. లైన్, లెంగ్త్ అతని ఆయుధాలు. ఎలాంటి బ్యాటర్ను అయినా, ఏ ఫార్మాట్లో అయినా తన వెపన్స్ వాడి బోల్తా కొట్టిస్తాడు. టీ20ల్లోనే తీసుకుంటే... 50 మ్యాచ్ల్లో 55 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో గతంలో ఆరు సీజన్లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐదు మ్యాచులకు అందుబాటులో ఉన్న కమిన్స్ ఏడు వికెట్లతో రాణించాడు. బ్యాటింగ్ పరంగా కమిన్స్ ఇప్పటివరకు టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే తనదైన రోజున బ్యాట్తో విరుచుకుపడటం గతంలో చూశాం.
రజనీకాంత్ మాటల ప్రభావమా?
హైదరాబాద్ సంగతి చూస్తే... ఐపీఎల్ తొలి సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. ఆ తర్వాత 2016లో విజేతగా నిలిచింది. అక్కడి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్స్కు రాలేకపోయింది. జట్టు వీరాభిమానులు సైతం ఈ విషయంలో నిరాశతోనే ఉన్నారు. మొన్నామధ్య ‘జైలర్’ ప్రచార కార్యక్రమంలో ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ కూడా ‘ఇలా వరుసగా హైదరాబాద్ ఓడిపోవడం... యజమాని కావ్యా మారన్ బాధపడటం చూడలేకపోతున్నా’ అని అన్నారు. సరైన ప్లేయర్లను వేలంలో తీసుకుని గెలవాలి అంటూ సూచన చేశారు. ఆ మాటల ప్రభావమో ఏమో భారీ ధరతో అదిరిపోయే ప్లేయర్ను కొనుగోలు చేసింది హైదరాబాద్. అన్నట్లు ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్ను కూడా తీసుకున్నారు.
ఇక హైదరాబాద్ టీమ్ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటివరకు ఎక్కడా వార్తల్లేవు, లీకులూ లేవు. అయితే ఇంత మొత్తం పెట్టి కమిన్స్ను దక్కించుకోవడం వెనుక అసలు కారణం కెప్టెన్సీనే అని చెప్పొచ్చు. వేలం తర్వాత ఈ విషయంలో పూర్తి స్పష్టత రావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!