Cummins - SRH: కమిన్స్కు రూ. 20.5 కోట్లు... అంత అవసరమేంటి? అతని స్పెషలేంటి?
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ పాట్ కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అతని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత రేటు పెట్టింది.?
ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మీద ఎన్నో ఏళ్లుగా విమర్శలు వస్తున్నాయి. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలోనూ అదే పరిస్థితి. ఈసారి ఏమవుతుందో అనుకున్న అభిమానులకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చింది. రూ.20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కమిన్స్ను కొనుగోలు చేసింది. అసలు అంత మొత్తం ఎందుకు పెట్టింది... కమిన్స్ ప్రత్యేకత ఏంటి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఏటా భారీ అంచనాలతో బరిలోకి దిగుతుంది. తీరా అసలు ఆట మొదలయ్యే సమయానికి తీవ్రంగా నిరాశపరుస్తుంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు... ఎస్ఆర్హెచ్ (SRH) ఓటమికి చాలా కారణాలున్నాయి. అయితే గత రెండు సీజన్లుగా బాగా ఇబ్బంది పెట్టిన అంశం మాత్రం కెప్టెన్సీ. ఉన్న ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదు. సరైన స్థానంలో సరైన బ్యాటర్ను పంపడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమిన్స్ (Pat Cummins) ను హైదరాబాద్ కొనుగోలు చేసింది అంటున్నారు.
కమిన్స్ కోసం జరిగిన వేలం పాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీపడి మరీ హైదరాబాద్ సాధించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో నిలిచిన కమిన్స్కు అంత ధర పలుకుతుందని అనుకున్నవాళ్లు తక్కువే ఉంటారు. ఒకదశలో హైదరాబాద్ దూకుడు చూసి ‘ఎందుకిలా?’ అనుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ ఆసీస్ కెప్టెన్ను జట్టులోకి తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్కు అర్జెంట్గా ఓ విజయవంతమైన కెప్టెన్ కావాలి. అలాగే ఆడాలి, ఆడిపించాలి. ఇదే కమిన్స్ కోసం అంత ధర పెట్టడానికి కారణం అనుకోవచ్చు.
ప్రపంచ కప్ హీరో
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్లో కమిన్స్ సత్తా ఏంటో అందరూ చూశారు. రెండు ఓటములతో వెనుకబడినట్లు కనిపించిన జట్టును వరుసగా ఏడు విజయాలతో ఫైనల్కు చేర్చాడు. ఇదంతా ఒకెత్తు అయితే అజేయంగా ఫైనల్కు చేరిన భారత్ను ఫైనల్స్లో దెబ్బ కొట్టాడు. ఈ మొత్తం ప్రాసెస్లో కమిన్స్ మాస్టర్ మైండ్ బాగా పని చేసింది అని చెప్పాలి. తుది పోరులో తొలుత బౌలింగ్ తీసుకోవడం వెనుక ఆలోచన అప్పట్లో అర్థం కాక క్రికెట్ మైండ్స్ తలపట్టుకున్నాయి. పిచ్ను బాగా అంచనా వేయడం వల్లే కమిన్స్ అలా చేశాడు అని తర్వాత తెలిసింది.
కేవలం కమిన్స్ను కెప్టెన్సీ కోసమే తీసుకుంది అంటే తప్పనే చెప్పాలి. ఎందుకంటే ఆసీస్కు అతనో ఫ్రంట్ లైన్ బౌలర్. లైన్, లెంగ్త్ అతని ఆయుధాలు. ఎలాంటి బ్యాటర్ను అయినా, ఏ ఫార్మాట్లో అయినా తన వెపన్స్ వాడి బోల్తా కొట్టిస్తాడు. టీ20ల్లోనే తీసుకుంటే... 50 మ్యాచ్ల్లో 55 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో గతంలో ఆరు సీజన్లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐదు మ్యాచులకు అందుబాటులో ఉన్న కమిన్స్ ఏడు వికెట్లతో రాణించాడు. బ్యాటింగ్ పరంగా కమిన్స్ ఇప్పటివరకు టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే తనదైన రోజున బ్యాట్తో విరుచుకుపడటం గతంలో చూశాం.
రజనీకాంత్ మాటల ప్రభావమా?
హైదరాబాద్ సంగతి చూస్తే... ఐపీఎల్ తొలి సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. ఆ తర్వాత 2016లో విజేతగా నిలిచింది. అక్కడి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్స్కు రాలేకపోయింది. జట్టు వీరాభిమానులు సైతం ఈ విషయంలో నిరాశతోనే ఉన్నారు. మొన్నామధ్య ‘జైలర్’ ప్రచార కార్యక్రమంలో ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ కూడా ‘ఇలా వరుసగా హైదరాబాద్ ఓడిపోవడం... యజమాని కావ్యా మారన్ బాధపడటం చూడలేకపోతున్నా’ అని అన్నారు. సరైన ప్లేయర్లను వేలంలో తీసుకుని గెలవాలి అంటూ సూచన చేశారు. ఆ మాటల ప్రభావమో ఏమో భారీ ధరతో అదిరిపోయే ప్లేయర్ను కొనుగోలు చేసింది హైదరాబాద్. అన్నట్లు ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్ను కూడా తీసుకున్నారు.
ఇక హైదరాబాద్ టీమ్ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటివరకు ఎక్కడా వార్తల్లేవు, లీకులూ లేవు. అయితే ఇంత మొత్తం పెట్టి కమిన్స్ను దక్కించుకోవడం వెనుక అసలు కారణం కెప్టెన్సీనే అని చెప్పొచ్చు. వేలం తర్వాత ఈ విషయంలో పూర్తి స్పష్టత రావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్