Ashwin - Australia: అశ్విన్ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. మనకు ఇతనొక స్టార్ బౌలర్. కానీ ఆస్ట్రేలియా (Australia)కు నైట్మేర్. అంతలా అశ్విన్కు ఆసీస్ భయపడుతోంది. త్వరలో బోర్డర్ - గావస్కర్ (ind vs aus) సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటివరకు అశ్విన్ వర్సెస్ ఆసీస్ సంగతేంటో చూద్దాం!
అశ్విన్ అంటే ఆస్ట్రేలియాకు ఎందుకంత భయం?
గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానుల్లో వినిపిస్తున్న మాట ఇదీ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయమూ ఇదే. ప్రత్యర్థి జట్టు ఏకంగా ‘నకిలీ’ అశ్విన్ను తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసేంతగా ఆశ్విన్ (Ashwin) భయపెట్టాడా? ఆసీస్(Australia)పై అతని బౌలింగ్ ప్రదర్శన చూస్తే.. మీరే పై ప్రశ్నకు సమాధానం చెప్పేయొచ్చు.
ఆఫ్స్పిన్నర్ బౌలింగ్కి వస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు చిన్న వణుకు వస్తుంది. ఆ కంగారు పీక్స్లోకి వెళ్లాలంటే ఆ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయి ఉండాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్లను అలా కంగారు పెడతాడు మరి. ఇప్పుడు ఆస్ట్రేలియా భయం కూడా అదే. అసలే స్పిన్ పిచ్ల పై కంగారూలు తడబడతారనే అపవాదు ఉంది. అందులోనూ ఆ జట్టులో కీలకమైన లెఫ్టీలు ముగ్గురు ఉన్నారు. వీటికితోడు గతంలో ఆసీస్ మీద అశ్విన్ వికెట్ల వేట మామూలుగా సాగలేదు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో అశ్విన్ 18 టెస్టు మ్యాచ్లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. అందులో ఐదు వికెట్ల ఫీట్ 5 సార్లు, పది వికెట్ల ఫీట్ ఒకసారి ఉంది.
మన దగ్గర 50+
స్వదేశంలో అశ్విన్ 50 వికెట్లు తీయగా.. ఆసీస్ గడ్డ మీద 39 వికెట్లు పడగొట్టాడు. ఈ లెక్కలు చూశాక ఆసీస్ భయపడటంలో తప్పేమీ లేదు అనిపిస్తోంది కదా. అశ్విన్ స్టాట్స్లోకి ఇంకాస్త డీప్గా వెళ్తే లెక్క ఇంకా బాగా అర్థమవుతుంది. అశ్విన్ కనుక ఎక్కువ వికెట్లు తీస్తే.. ఆ మ్యాచ్లో ఆసీస్కు పరాజయం పక్కా లేదంటే డ్రా అయినా అవుతుంది. భారత్ గెలిచిన టెస్టుల్లో అశ్విన్ 52 వికెట్లు తీయగా, డ్రా అయిన మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అంటే 89లో 66 అన్నమాట. 2013లో జరిగిన బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో ఏకంగా 29 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.
వార్నర్ను ఆటాడుకుని..
బ్యాటర్ల వారీగా చూస్తే.. డేవిడ్ వార్నర్ను అశ్విన్ 10 సార్లు (15 మ్యాచ్ల్లో) ఔట్ చేశాడు. స్మిత్ను 6 సార్లు (12 మ్యాచ్ల్లో), లబుషేన్ను రెండుసార్లు (3 మ్యాచ్ల్లో), ఉస్మాన్ ఖవాజాను రెండుసార్లు (ఒక మ్యాచ్లో) పెవిలియన్కు పంపించాడు. ఇప్పుడు ఈ నలుగురూ ఆ జట్టుకు కీలక ఆటగాళ్లు అనే విషయం తెలిసిందే. అశ్విన్ పడగొట్టిన 89 వికెట్లలో 52 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లవే. పై నలుగురులో ఇద్దరు లెఫ్టీలు కావడం గమనార్హం. ఇదంతా చదివాక అశ్విన్ డూప్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం ఆ జట్టుకు ఎంత అవసరమో అర్థమవుతుంది.
ఆ రెండు మైదానాల్లో...
ఇక ఈ సిరీస్ జరగనున్న నాలుగు మైదానాల్లో ఆసీస్ వర్సెస్ అశ్విన్ సంగతి చూస్తే... ఇంకాస్త క్లియర్ పిక్చర్ వస్తుంది. రెండో టెస్టు జరగనున్న దిల్లీ, మూడో టెస్టు జరగనున్న ధర్మశాలలో అశ్విన్ రికార్డు బాగుంది. ధర్మశాలలో ఆసీస్పై నాలుగు వికెట్లు తీయగా, దిల్లీలో ఏడు వికెట్లు పడగొట్టాడు. రీసెంట్ సిరీస్ అంటే. 2020-21లో మూడు టెస్టులాడి.. 12 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ గడ్డ మీద జరిగిన సిరీస్లోనే అన్ని వికెట్లు తీస్తే.. మరి సొంత పిచ్లపై ఇంకెంత ప్రభావం చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్పిన్నర్లలో అశ్విన్ తర్వాత ఆసీస్ వికెట్లు ఎక్కువ పడగొట్టింది రవీంద్ర జడేజా (63) మాత్రమే.
ఇదంతా చదివాక ఆసీస్ మీద అశ్విన్ ప్రతాపం ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ లెక్కలే ఇప్పుడు కంగారూలను కంగారు పెడుతున్నాయి. మాటల యుద్ధానికి దిగేలా చేస్తున్నాయి. డూప్లికెట్ అశ్విన్ అని పిలుచుకునే మహేశ్ పితియాతో ప్రాక్టీస్ చేసేలా చేస్తున్నాయి. అయితే ఎవరెన్ని ప్లాన్స్ వేసుకున్నా.. వారిని బురిడీ కొట్టించే బంతులు అశ్విన్ దగ్గరున్నాయి. టీమ్ ఇండియా అన్న అని పిలుచుకునే అశ్విన్ మీద... రోహిత్ నమ్మకం కూడా అందుకే.
ఈ నేపథ్యంలో అశ్విన్ గెలుస్తాడా? లేక ఆసీస్ ప్లానింగ్ ఫలిస్తుందా అనేది ఈ నెల 9 నుంచి తెలుస్తుంది. ఎందుకంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు నాగ్పూర్లో అదే రోజు మొదలవుతుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు