IND vs SA: టీమ్ఇండియాకు ఎందుకీ వరుస ఓటములు?
యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.. ఈ నలుగురు ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్లో మంచి ప్రదర్శన చేసిన వాళ్లే. వికెట్ టేకర్లుగా, పొదుపుగా బౌలింగ్ చేసినవారిగా సత్తా చాటారు...
అక్కడ మెరిసిన వాళ్లే.. ఇక్కడ తేలిపోతున్నారు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.. ఈ నలుగురు ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్లో మంచి ప్రదర్శన చేసిన వాళ్లే. వికెట్ టేకర్లుగా, పొదుపుగా బౌలింగ్ చేసినవారిగా సత్తా చాటారు. తీరా దక్షిణాఫ్రికాతో అంతర్జాతీయ టీ20 సిరీస్ ఆడేసరికి విఫలమవుతున్నారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికి ఆడింది రెండు మ్యాచ్లే అయినా.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో టీమ్ఇండియా ఓటములకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నారు.
యుజ్వేంద్ర చాహల్: ఈసారి భారత టీ20 లీగ్లో యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లు(27) తీసిన బౌలర్గా నిలిచాడు. అంతకుముందు సరైన ప్రదర్శన చేయలేక ఒకానొక దశలో టీమ్ఇండియాలోనే చోటు కోల్పోయే పరిస్థితికి చేరుకున్న అతడు ఈసారి రాజస్థాన్ తరఫున అద్భుతంగా మెరిశాడు. 7.75 ఎకానమీతో పొదుపుగానూ బౌలింగ్ చేశాడు. దీంతో ఆ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మళ్లీ టీమ్ఇండియాలోకి వచ్చిన చాహల్ దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో తేలిపోయాడు. తొలి టీ20లో 2.1 ఓవర్లే బౌలింగ్ చేసి 12 ఎకానమీతో 26 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసినా 49 పరుగులిచ్చాడు. ఈసారి ఒక్క వికెటే తీశాడు. ఎకానమీ 12.20గా నమోదైంది. దీంతో చాహల్ పరుగులను నియంత్రించలేక, వికెట్లు రాబట్టలేక విఫలమయ్యాడు.
అవేశ్ ఖాన్: గతేడాది భారత టీ20 లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచిన దిల్లీ పేసర్ అవేశ్ ఖాన్.. ఈసారి కొత్త జట్టు లఖ్నవూ తరఫున ఆడాడు. దీంతో ఈ సీజన్లోనూ అతడు గొప్పగా బౌలింగ్ చేశాడు. 8.72 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా మొత్తం 18 వికెట్లు పడగొట్టి లఖ్నవూ ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అవేశ్ ఇప్పుడు టీమ్ఇండియా తరఫున దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్లో వికెట్లు తీయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులిచ్చాడు. దాంతో 8.80 ఎకానమీ నమోదు చేశాడు. ఇక రెండో టీ20లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చి మంచి ఎకానమీ 5.70 సాధించాడు. ఇలా రెండు మ్యాచ్ల సగటు ఎకానమీ 7.25తో బాగానే ఉన్నా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అవేశ్ కూడా విఫలమైనట్లుగానే కనిపిస్తున్నాడు.
హర్షల్ పటేల్: ఇక బెంగళూరు పేసర్గా హర్షల్ పటేల్ గత రెండు సీజన్లలో గొప్పగా రాణించాడు. గతేడాది అతడు 32 వికెట్లతో మెరిస్తే ఈసారి ఆ మాత్రం కాకపోయినా 19 వికెట్లతో రాణించాడు. ఎకానమీ కూడా ఈసారి 7.66 బాగానే నమోదు చేశాడు. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడంలో హర్షల్ తనవంతు కృషి చేశాడు. కానీ, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో ఆడుతోన్న టీ20 సిరీస్లో అంత గొప్పగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెటే తీశాడు. ఎకానమీ 10.80గా నమోదు చేశాడు. ఇక రెండో టీ20లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులిచాడు. ఒక్క వికెటే తీసి 5.70 ఎకానమీ నమోదు చేశాడు. దీంతో హర్షల్ వికెట్లు తీయలేక.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతున్నాడు.
అక్షర్ పటేల్: ఇక అక్షర్ పటేల్ గతేడాది భారత టీ20 లీగ్లో దిల్లీ తరఫున బాగా రాణించినా ఈసారి వికెట్ల పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 6 వికెట్లే తీశాడు. అయితే, 7.46 ఎకానమీ మెరుగ్గా ఉండటంతో ఇప్పుడు టీమ్ఇండియా తరఫున దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతడు ఈ రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 40 పరుగులు ఇచ్చి 10 ఎకానమీ నమోదు చేశాడు. ఒక్క వికెటే తీశాడు. ఇక రెండో టీ20లో ఒక్క ఓవరే బౌలింగ్ చేసి 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అక్షర్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కీలకంగా ఆడతారనుకున్న బౌలర్లందరూ సమష్టిగా విఫలమవ్వడమే టీమ్ఇండియా తొలి రెండు మ్యాచ్ల ఓటములకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
మిగిలిన మ్యాచ్ల్లో గెలవాలంటే..
ఇక ఇప్పటికే రెండు మ్యాచ్లు కోల్పోయిన టీమ్ఇండియా ఈ సిరీస్లో నిలవాలంటే విశాఖపట్నంలో జరిగే మూడో టీ20లో తప్పక గెలవాలి. అది జరగాలంటే బౌలింగ్ యూనిట్లో మార్పులు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సహజంగానే విశాఖ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. దీంతో ఈ బౌలింగ్ యూనిట్నే మూడో టీ20లోనూ భారత జట్టు కొనసాగిస్తే మరిన్ని కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత్ గెలవాలంటే కచ్చితంగా ఈ విభాగంలో మార్పులు చేయాల్సిందే. మరోవైపు ఈ సిరీస్లో ఇంకా అవకాశం రాని యువ బౌలర్లు ఉన్నారు. పంజాబ్కు చెందిన అర్ష్దీప్ సింగ్ భారత టీ20 లీగ్లో డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేశాడు. అలాగే హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో వికెట్ల పండుగ చేసుకున్నాడు. అలాగే లఖ్నవూకు చెందిన రవి బిష్ణోయ్ తన లెగ్ స్పిన్తో ప్రత్యర్థులను మధ్య ఓవర్లలో కట్టడి చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్ల్లో వీరికి అవకాశం ఇస్తే టీమ్ఇండియాకు గెలిచే అవకాశాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే