IND vs SA: టీమ్ఇండియాకు ఎందుకీ వరుస ఓటములు?
యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.. ఈ నలుగురు ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్లో మంచి ప్రదర్శన చేసిన వాళ్లే. వికెట్ టేకర్లుగా, పొదుపుగా బౌలింగ్ చేసినవారిగా సత్తా చాటారు...
అక్కడ మెరిసిన వాళ్లే.. ఇక్కడ తేలిపోతున్నారు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.. ఈ నలుగురు ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్లో మంచి ప్రదర్శన చేసిన వాళ్లే. వికెట్ టేకర్లుగా, పొదుపుగా బౌలింగ్ చేసినవారిగా సత్తా చాటారు. తీరా దక్షిణాఫ్రికాతో అంతర్జాతీయ టీ20 సిరీస్ ఆడేసరికి విఫలమవుతున్నారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికి ఆడింది రెండు మ్యాచ్లే అయినా.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో టీమ్ఇండియా ఓటములకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నారు.
యుజ్వేంద్ర చాహల్: ఈసారి భారత టీ20 లీగ్లో యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లు(27) తీసిన బౌలర్గా నిలిచాడు. అంతకుముందు సరైన ప్రదర్శన చేయలేక ఒకానొక దశలో టీమ్ఇండియాలోనే చోటు కోల్పోయే పరిస్థితికి చేరుకున్న అతడు ఈసారి రాజస్థాన్ తరఫున అద్భుతంగా మెరిశాడు. 7.75 ఎకానమీతో పొదుపుగానూ బౌలింగ్ చేశాడు. దీంతో ఆ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మళ్లీ టీమ్ఇండియాలోకి వచ్చిన చాహల్ దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో తేలిపోయాడు. తొలి టీ20లో 2.1 ఓవర్లే బౌలింగ్ చేసి 12 ఎకానమీతో 26 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసినా 49 పరుగులిచ్చాడు. ఈసారి ఒక్క వికెటే తీశాడు. ఎకానమీ 12.20గా నమోదైంది. దీంతో చాహల్ పరుగులను నియంత్రించలేక, వికెట్లు రాబట్టలేక విఫలమయ్యాడు.
అవేశ్ ఖాన్: గతేడాది భారత టీ20 లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచిన దిల్లీ పేసర్ అవేశ్ ఖాన్.. ఈసారి కొత్త జట్టు లఖ్నవూ తరఫున ఆడాడు. దీంతో ఈ సీజన్లోనూ అతడు గొప్పగా బౌలింగ్ చేశాడు. 8.72 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా మొత్తం 18 వికెట్లు పడగొట్టి లఖ్నవూ ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అవేశ్ ఇప్పుడు టీమ్ఇండియా తరఫున దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్లో వికెట్లు తీయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులిచ్చాడు. దాంతో 8.80 ఎకానమీ నమోదు చేశాడు. ఇక రెండో టీ20లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చి మంచి ఎకానమీ 5.70 సాధించాడు. ఇలా రెండు మ్యాచ్ల సగటు ఎకానమీ 7.25తో బాగానే ఉన్నా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అవేశ్ కూడా విఫలమైనట్లుగానే కనిపిస్తున్నాడు.
హర్షల్ పటేల్: ఇక బెంగళూరు పేసర్గా హర్షల్ పటేల్ గత రెండు సీజన్లలో గొప్పగా రాణించాడు. గతేడాది అతడు 32 వికెట్లతో మెరిస్తే ఈసారి ఆ మాత్రం కాకపోయినా 19 వికెట్లతో రాణించాడు. ఎకానమీ కూడా ఈసారి 7.66 బాగానే నమోదు చేశాడు. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడంలో హర్షల్ తనవంతు కృషి చేశాడు. కానీ, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో ఆడుతోన్న టీ20 సిరీస్లో అంత గొప్పగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెటే తీశాడు. ఎకానమీ 10.80గా నమోదు చేశాడు. ఇక రెండో టీ20లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులిచాడు. ఒక్క వికెటే తీసి 5.70 ఎకానమీ నమోదు చేశాడు. దీంతో హర్షల్ వికెట్లు తీయలేక.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతున్నాడు.
అక్షర్ పటేల్: ఇక అక్షర్ పటేల్ గతేడాది భారత టీ20 లీగ్లో దిల్లీ తరఫున బాగా రాణించినా ఈసారి వికెట్ల పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 6 వికెట్లే తీశాడు. అయితే, 7.46 ఎకానమీ మెరుగ్గా ఉండటంతో ఇప్పుడు టీమ్ఇండియా తరఫున దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతడు ఈ రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 40 పరుగులు ఇచ్చి 10 ఎకానమీ నమోదు చేశాడు. ఒక్క వికెటే తీశాడు. ఇక రెండో టీ20లో ఒక్క ఓవరే బౌలింగ్ చేసి 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అక్షర్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కీలకంగా ఆడతారనుకున్న బౌలర్లందరూ సమష్టిగా విఫలమవ్వడమే టీమ్ఇండియా తొలి రెండు మ్యాచ్ల ఓటములకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
మిగిలిన మ్యాచ్ల్లో గెలవాలంటే..
ఇక ఇప్పటికే రెండు మ్యాచ్లు కోల్పోయిన టీమ్ఇండియా ఈ సిరీస్లో నిలవాలంటే విశాఖపట్నంలో జరిగే మూడో టీ20లో తప్పక గెలవాలి. అది జరగాలంటే బౌలింగ్ యూనిట్లో మార్పులు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సహజంగానే విశాఖ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. దీంతో ఈ బౌలింగ్ యూనిట్నే మూడో టీ20లోనూ భారత జట్టు కొనసాగిస్తే మరిన్ని కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత్ గెలవాలంటే కచ్చితంగా ఈ విభాగంలో మార్పులు చేయాల్సిందే. మరోవైపు ఈ సిరీస్లో ఇంకా అవకాశం రాని యువ బౌలర్లు ఉన్నారు. పంజాబ్కు చెందిన అర్ష్దీప్ సింగ్ భారత టీ20 లీగ్లో డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేశాడు. అలాగే హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో వికెట్ల పండుగ చేసుకున్నాడు. అలాగే లఖ్నవూకు చెందిన రవి బిష్ణోయ్ తన లెగ్ స్పిన్తో ప్రత్యర్థులను మధ్య ఓవర్లలో కట్టడి చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్ల్లో వీరికి అవకాశం ఇస్తే టీమ్ఇండియాకు గెలిచే అవకాశాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం