Rahul Dravid - Team India: ద్రవిడ్ ఉంటాడా.. వెళ్తాడా?
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇంతటితో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల వన్డే కెరీర్ ముగిసిందా అనే చర్చ జరుగుతోంది. వీళ్లేమీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. వీళ్లిద్దరూ వన్డేలకు దాదాపు దూరమైనట్లే అని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీమ్ఇండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) భవితవ్యం మీదా చర్చ జరుగుతోంది.
టీమ్ఇండియా కోచ్గా కొనసాగడంపై సందిగ్ధత
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇంతటితో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల వన్డే కెరీర్ ముగిసిందా అనే చర్చ జరుగుతోంది. వీళ్లేమీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. వీళ్లిద్దరూ వన్డేలకు దాదాపు దూరమైనట్లే అని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీమ్ఇండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) భవితవ్యం మీదా చర్చ జరుగుతోంది. అధికారికంగా అయితే ప్రపంచకప్తోనే రాహుల్ పదవీకాలం ముగిసింది. కానీ అతను కొనసాగింపును కోరుకుంటాడా.. బోర్డు అతడికా అవకాశమిస్తుందా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రెండేళ్ల కిందట టీ20 ప్రపంచకప్ ముంగిట భారత జట్టు ప్రధాన కోచ్ పదవిని చేపట్టాడు రాహుల్ ద్రవిడ్. ఆ టోర్నీలో విఫలమైనప్పటికీ ద్రవిడ్ శిక్షణలో అనేక ద్వైపాక్షిక సిరీస్లు గెలిచింది టీమ్ఇండియా. ఎంతోమంది యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం దక్కింది. గత రెండేళ్లలో భారత్ ఏ ఐసీసీ ట్రోఫీ గెలవలేదు కానీ.. మిగతా ప్రదర్శన మాత్రం బాగానే సాగింది. అతను కోచ్గా ఉండగానే మూడు ఫార్మాట్లలో నంబర్వన్ కావడం గొప్ప ఘనతే. అధికారికంగా తన చివరి బాధ్యత అయిన వన్డే ప్రపంచకప్లో జట్టును విజేతగా నిలపడానికి రాహుల్ శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ కప్పు విజయానికి చేరువగా వచ్చి విఫలమైంది భారత్. ఫైనల్ అనంతరం ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన భవితవ్యంపై ఇంకా ఏమీ ఆలోచించలేదన్నాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో భారత్ ఆడబోయే టీ20 సిరీస్కు లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించబోతున్నాడు. ద్రవిడ్ సంగతేంటన్నది స్పష్టత లేదు. వచ్చే నెలలో భారత జట్టు టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. ఆ పర్యటన మొదలయ్యేలోపు రాహుల్ కొనసాగడంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ద్రవిడ్ సరేనంటే బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పాటు పొడిగించే అవకాశముంది. కానీ ద్రవిడ్ ఔనంటాడా అన్నదే సందేహం.
బలవంతంగానే తెచ్చారు
ద్రవిడ్ తరం దిగ్గజ ఆటగాళ్లలో కోచ్లు కావడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడలేదు. అందుకు ప్రధాన కారణం.. 15-20 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడి, పర్యటనల్లోనే గడిపిన ఈ ఆటగాళ్లందరూ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావించడమే. పెద్ద బాధ్యతలు నెత్తికెత్తుకుని మళ్లీ తీరిక లేకుండా గడిపితే కుటుంబానికి మరింత దూరమవుతామన్న భావనతో సచిన్, గంగూలీ, జహీర్ ఖాన్, సెహ్వాగ్.. ఇలా చాలామంది దిగ్గజ ఆటగాళ్లు పూర్తి స్థాయి కోచ్లుగా మారలేదు. ఐపీఎల్ జట్లకు కోచ్లుగా, మెంటార్లుగా వ్యవహరించారే తప్ప టీమ్ఇండియా కోచ్ స్థానానికి వీళ్లెవ్వరూ పోటీ పడలేదు. అయితే ద్రవిడ్ మాత్రం ముందు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్గా.. అలాగే అండర్-19, ఇండియా-ఎ జట్ల కోచ్గా పని చేశాడు. ఆ బాధ్యతల్లో గొప్ప ప్రతిభ చూపించాడు. రిషబ్ పంత్, శుభ్మన్, ఇషాన్ కిషన్.. ఇలా ఎంతోమంది యువ ప్రతిభావంతులు ద్రవిడ్ శిక్షణలోనే ఎదిగారు. వీళ్లంతా ద్రవిడ్ కోచ్గా ఉండగా అండర్-19 ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు. అయితే తన స్వస్థలమైన బెంగళూరులో ఉంటూ ఎన్సీఏ బాధ్యతలు చూసుకుంటూ.. అండర్-19 కోచ్గా యువ క్రికెటర్లను సానబెట్టడం వరకే తన పాత్ర పరిమితం కావాలని ద్రవిడ్ భావించాడు. కానీ అతణ్ని బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా సౌరభ్ గంగూలీ పట్టుబట్టి టీమ్ఇండియా కోచ్ పదవిలోకి తీసుకొచ్చాడు. రవిశాస్త్రి పదవీ కాలం ముగిశాక జట్టుకు ద్రవిడ్ అవసరాన్ని వివరించి అతను కోచ్ బాధ్యతలు చేపట్టేలా చూశాడు. ద్రవిడ్ ఒకింత అయిష్టంగానే ఈ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు తన బాధ్యత ముగిసింది. ద్రవిడ్ టీమ్ఇండియా కోచ్ కావడంలో కీలక పాత్ర పోషించిన గంగూలీ ఇప్పుడు బోర్డులో లేడు. అతడిలా రాహుల్ను కొనసాగమని ఇప్పుడు ఎవరూ బలవంతం చేయకపోవచ్చు. ద్రవిడ్ సైతం జట్టును పట్టుకుని వేలాడే తరహా కాదు. పైగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో కోచ్గా తప్పుకొంటాడేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అతను కోచ్గా తప్పుకొనేట్లయితే.. ద్రవిడ్ తర్వాత ఎన్సీఏ చీఫ్ కావడమే కాక, భారత జట్టుకు కొన్ని సిరీస్ల్లో తాత్కాలిక కోచ్గా వ్యవహరించిన మన వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్