Rahul Dravid - Team India: ద్రవిడ్ ఉంటాడా.. వెళ్తాడా?
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇంతటితో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల వన్డే కెరీర్ ముగిసిందా అనే చర్చ జరుగుతోంది. వీళ్లేమీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. వీళ్లిద్దరూ వన్డేలకు దాదాపు దూరమైనట్లే అని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీమ్ఇండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) భవితవ్యం మీదా చర్చ జరుగుతోంది.
టీమ్ఇండియా కోచ్గా కొనసాగడంపై సందిగ్ధత
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇంతటితో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల వన్డే కెరీర్ ముగిసిందా అనే చర్చ జరుగుతోంది. వీళ్లేమీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. వీళ్లిద్దరూ వన్డేలకు దాదాపు దూరమైనట్లే అని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీమ్ఇండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) భవితవ్యం మీదా చర్చ జరుగుతోంది. అధికారికంగా అయితే ప్రపంచకప్తోనే రాహుల్ పదవీకాలం ముగిసింది. కానీ అతను కొనసాగింపును కోరుకుంటాడా.. బోర్డు అతడికా అవకాశమిస్తుందా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రెండేళ్ల కిందట టీ20 ప్రపంచకప్ ముంగిట భారత జట్టు ప్రధాన కోచ్ పదవిని చేపట్టాడు రాహుల్ ద్రవిడ్. ఆ టోర్నీలో విఫలమైనప్పటికీ ద్రవిడ్ శిక్షణలో అనేక ద్వైపాక్షిక సిరీస్లు గెలిచింది టీమ్ఇండియా. ఎంతోమంది యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం దక్కింది. గత రెండేళ్లలో భారత్ ఏ ఐసీసీ ట్రోఫీ గెలవలేదు కానీ.. మిగతా ప్రదర్శన మాత్రం బాగానే సాగింది. అతను కోచ్గా ఉండగానే మూడు ఫార్మాట్లలో నంబర్వన్ కావడం గొప్ప ఘనతే. అధికారికంగా తన చివరి బాధ్యత అయిన వన్డే ప్రపంచకప్లో జట్టును విజేతగా నిలపడానికి రాహుల్ శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ కప్పు విజయానికి చేరువగా వచ్చి విఫలమైంది భారత్. ఫైనల్ అనంతరం ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన భవితవ్యంపై ఇంకా ఏమీ ఆలోచించలేదన్నాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో భారత్ ఆడబోయే టీ20 సిరీస్కు లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించబోతున్నాడు. ద్రవిడ్ సంగతేంటన్నది స్పష్టత లేదు. వచ్చే నెలలో భారత జట్టు టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. ఆ పర్యటన మొదలయ్యేలోపు రాహుల్ కొనసాగడంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ద్రవిడ్ సరేనంటే బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పాటు పొడిగించే అవకాశముంది. కానీ ద్రవిడ్ ఔనంటాడా అన్నదే సందేహం.
బలవంతంగానే తెచ్చారు
ద్రవిడ్ తరం దిగ్గజ ఆటగాళ్లలో కోచ్లు కావడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడలేదు. అందుకు ప్రధాన కారణం.. 15-20 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడి, పర్యటనల్లోనే గడిపిన ఈ ఆటగాళ్లందరూ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావించడమే. పెద్ద బాధ్యతలు నెత్తికెత్తుకుని మళ్లీ తీరిక లేకుండా గడిపితే కుటుంబానికి మరింత దూరమవుతామన్న భావనతో సచిన్, గంగూలీ, జహీర్ ఖాన్, సెహ్వాగ్.. ఇలా చాలామంది దిగ్గజ ఆటగాళ్లు పూర్తి స్థాయి కోచ్లుగా మారలేదు. ఐపీఎల్ జట్లకు కోచ్లుగా, మెంటార్లుగా వ్యవహరించారే తప్ప టీమ్ఇండియా కోచ్ స్థానానికి వీళ్లెవ్వరూ పోటీ పడలేదు. అయితే ద్రవిడ్ మాత్రం ముందు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్గా.. అలాగే అండర్-19, ఇండియా-ఎ జట్ల కోచ్గా పని చేశాడు. ఆ బాధ్యతల్లో గొప్ప ప్రతిభ చూపించాడు. రిషబ్ పంత్, శుభ్మన్, ఇషాన్ కిషన్.. ఇలా ఎంతోమంది యువ ప్రతిభావంతులు ద్రవిడ్ శిక్షణలోనే ఎదిగారు. వీళ్లంతా ద్రవిడ్ కోచ్గా ఉండగా అండర్-19 ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు. అయితే తన స్వస్థలమైన బెంగళూరులో ఉంటూ ఎన్సీఏ బాధ్యతలు చూసుకుంటూ.. అండర్-19 కోచ్గా యువ క్రికెటర్లను సానబెట్టడం వరకే తన పాత్ర పరిమితం కావాలని ద్రవిడ్ భావించాడు. కానీ అతణ్ని బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా సౌరభ్ గంగూలీ పట్టుబట్టి టీమ్ఇండియా కోచ్ పదవిలోకి తీసుకొచ్చాడు. రవిశాస్త్రి పదవీ కాలం ముగిశాక జట్టుకు ద్రవిడ్ అవసరాన్ని వివరించి అతను కోచ్ బాధ్యతలు చేపట్టేలా చూశాడు. ద్రవిడ్ ఒకింత అయిష్టంగానే ఈ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు తన బాధ్యత ముగిసింది. ద్రవిడ్ టీమ్ఇండియా కోచ్ కావడంలో కీలక పాత్ర పోషించిన గంగూలీ ఇప్పుడు బోర్డులో లేడు. అతడిలా రాహుల్ను కొనసాగమని ఇప్పుడు ఎవరూ బలవంతం చేయకపోవచ్చు. ద్రవిడ్ సైతం జట్టును పట్టుకుని వేలాడే తరహా కాదు. పైగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో కోచ్గా తప్పుకొంటాడేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అతను కోచ్గా తప్పుకొనేట్లయితే.. ద్రవిడ్ తర్వాత ఎన్సీఏ చీఫ్ కావడమే కాక, భారత జట్టుకు కొన్ని సిరీస్ల్లో తాత్కాలిక కోచ్గా వ్యవహరించిన మన వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!